Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం ఓ ఆకలి రాజ్యం... ఓ మెతుక్కు కూడా నోచుకోని, అసలు తిండి ఊసే లేని జనం ప్రపంచ జనాభాలో 80 కోట్ల మంది ఉన్నారు. కడు పునిండా తిండి సంగతి అటుంచి కనీసం గ్లాసు గంజి కూడా లేని ప్రజల సంఖ్య తె లిస్తే గుండె చెరువవుతుంది. ఈ భూ మ్మీద ప్రతి 9మందిలో ఒకరు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. ఇందులో 60శాతం మంది మహిళలు. ఇక పౌష్టి కాహారం లేకపోవడంతో ప్రతి పదిమంది ఐదేండ్లలోపు చిన్నారులలో నలుగురు చనిపోతున్నారు. రోగాలతోనే కాకుండా ఆకలితో చనిపోవడం ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత విషాదం. ఇలా మరణిస్తున్నవారి సంఖ్య ఏడాదికి 50 లక్షల మంది అంటే ఇంతకంటే భయంకరం మరొకటి లేదు. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఆకలికేకలు విని పిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసు కోవచ్చు. ఇక్కడ 14.3శాతం మందికి కడుపునిండా తిండి దొరకడం లేదు. ప్రతి ఏడుగురి లో ఒకరికి ఇక్కడ పొట్టనిండే పరిస్థితి లేదు. ఇక ఆఫ్రికా దేశాల్లోనూ పరిస్థితి చాలా దారు ణం. ఇక్కడ 60శాతం మంది ఆకలి కేకలు పెడుతున్నారు. ఆసియాది ఆ తరువాతి స్థానం. మిగతా ఖండాలతో పోలిస్తే ఐ రోపా కొంత మెరుగు. ఇదీ ఈ ఆధునిక సమాజానికి సామ్రాజ్య వాదంమిగిల్చిన పెను విషాదం.
ఈ దుస్థితికి పేదరికమే అసలు కారణం. తగినంత ఆహా రాన్ని కొనుగోలు చేయడానికి తగిన ఆదాయం లేకపోవడం లేదా సొంతంగా ఆహారం పండించుకోవడానికి తగినంత భూమి లేకపోవడం వల్ల కోట్లాది మంది తరచూ పస్తులతో అలమటిస్తున్నారు. వనరుల పంపిణీలో అసమానతలు, విపరీతమైన ఆదాయ వ్యత్యాసాలు వంటి కారణాల వల్ల వెనుకబడిన దేశాలల్లో 89.9 కోట్లమంది నిరుపేదరికంలో మగ్గిపోతున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వల్ల, లోపభూయిష్టమైన ఆర్థిక వ్యవస్థల కారణంగానే చాలా దేశాల్లో పేదరికం, ఆకలి తాండవిస్తోంది.
''పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన'' అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి.బాలక్రిష్ణన్ అన్నారు. భారత్లోనూ ఆకలి కేకలు తీవ్రంగానే ఉన్నాయని ''ప్రపం చ ఆకలి సూచిక-2016'' నివేదిక వెల్లడించింది. ''ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్'' వెలువరించిన ఈ నివేదికలో మొత్తం 118 దేశాలకు గాను భారత్ 97వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాల్లో చైనా-29, నేపాల్-72, మయన్మార్-75, శ్రీలంక-84, బంగ్లాదేశ్-90 మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక బ్రిక్స్ దేశాలలో భారత్ చివరిస్థానంలో ఉంది.
పోషకాహార లోపం అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వం టి మౌలిక సమస్యలతో భారతదేశం సతమతమవుతోంది. స్వాతం త్య్రానాంతరం కొంత అభివృద్ధి జరిగినా దాని ఫలాలు మాత్రం అతి కొద్దిమందికే దక్కడం వలన ఆదాయ అసమానతలు పెరిగిపోయా యి. పేదరికాన్ని కేవలం ఆర్థికపరమైన సమస్యగానే కాకుండా సాంఘిక సమస్యగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. మానవా భివృద్ధి నివేదిక ప్రకారం దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలు, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం దక్కకపోవడం, పేదరికం ఇవి వ్యక్తి వికాసానికి అడ్డంకి అవుతున్నాయి.
పేదరికాన్ని అంచనా వేయడానికి అనేక పద్ధతులను అవలంభిం చారు. ఒక వ్యక్తి జీవించటానికి కావాల్సిన కనీస జీవన వ్యయం ఆధారంగా పేదరిక రేఖను నిర్ణయిస్తారు. దీని కోసం ప్రణాళిక సం ఘం 1989 సెప్టెంబర్లో డి.టి.లక్షవాలా అధ్యక్షతన ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1993 జులైలో తన నివేదికను సమర్పించింది. పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీలను ప్రాతిపదికగా తీసుకున్నారు. తదుపరి సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించారు. కమిటీ తన నివేదికను 2009లో ప్రభుత్వానికి సమ ర్పించింది. ఈ నివేదికలో కమిటీ పేదరిక రేఖను నిర్ణయించటానికి మన్నికగల వస్తువులతోపాటు విద్య, ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలనీ పేదరిక రేఖను నిర్ణయించ టానికి కేలరీల బదులు జీవన వ్యయ సూచీని తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2004-5కు గాను నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రా మాల్లో రూ.446.68 కాగా, పట్టణాల్లో రూ.578.80. దీని ప్రకారం గ్రామీణ పేదరికం 41.8శాతంగా పట్టణ పేదరికం 25.7శాతంగా నమోదైంది. భారతదేశ పేదరికాన్ని 37.2శాతంగా లెక్కించారు. సురేష్ టెండూల్కర్ కమిటీ సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించేందుకు 2012లో రంగరాజన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో ప్రతి పదిమందిలో ముగ్గురు పేదరికంలో ఉన్నట్టు అంచనా వేసింది. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 2011-12లో పేదరిక జనాభా 21.97శాతం కాగా రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5శాతంగా ఉంది. వాస్తవంలో పేదరిక స్థాయి ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
అయితే పేదరిక నిర్మూలన ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించటం లేదు. రూ.వేలకోట్లను బడా పారిశ్రామికవేత్తలకు రాయితీగా ఇస్తూ సాధారణ పేద ప్రజానీకానికి ఇచ్చే సబ్సిడీలకు కోత పెడుతున్నా యి. ఇది సహించరానిది. ఆహార భ ద్రత లేక, ఉపాధి దొరకక, ఉద్యోగ భద్రత లేక, మరోవైపు మౌలిక ప్రాథ మిక రంగమైన వ్యవసాయ రంగ సంక్షోభం, ఉపాధి హామీ పథకం సక్ర మంగా అమలుకాకపోవడం వంటివి దేశం పేదరిక విష వలయంలో చిక్కుకుపోవడానికి కారణాలవుతు న్నాయి. వాస్తవం ఇది కాగా భారత దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అ మాంతం 7.5శాతానికి చేరి చైనాను కూడా మించిపోయిందని మోడీ ప్రభుత్వం ఉదరగొడుతోంది. ఈ జీడీపీ గణాంకాలకు ప్రజలు జీవన ప్రమాణాలకు లంకె ఎప్పుడో తెగిపోయింది. అప్పటి నుంచే ఈ గణా ంకాలు విశ్వసనీయతను కోల్పోయాయి. ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశంలో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేదిగా ఉండాలి. పెరిగిన సంపద ప్రజలకు పంపిణీ కావాలి. మ న దేశంలో పెరిగిన సంపద కొద్దిమంది కుబేరుల చేతిలో పోగు పడుతోంది. ఈ పరిస్థితి కారణంగా పేదలు మరింత పేదలుగా మా రుతున్నారు. ఫలి తంగా ప్రజల ఆకలి తీరటం లేదు. ఆకలితో బాధప డుతున్న పేద ప్ర జలు ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే ఉన్నా రని ఐరాస ఆహార సహాయ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. భారతదే శంలో దాదాపు 20 కోట్లమంది ప్రజలు తరచూ పస్తువులతో అలమ టిస్తున్నారని, ఏటా దాదాపు 70 లక్షల మంది చిన్నారులు పోషకాహా ర లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఐరాస ప్రకటించింది.
భారతదేశంలో త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రణాళికలను రూపొందించుకుని, పరిమితంగా లభించే వనరులను అభిలషణీయంగా వినియోగించాలని, తద్వారా సాంఘిక న్యాయం సాధించాలని ఆశయంగా పెట్టుకున్నారు గానీ పెట్టుబడిదారీ విధానంలో వనరుల కేటాయింపు, ఉత్పత్తి తీరుతెన్నులను మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. కాబట్టి వనరుల కేటాయింపు ప్రజా సంక్షేమానికి కాకుండా లాభాపేక్షకు జరిగి అనేక అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇవి సాంఘిక న్యాయానికి, రాజ్యాంగ ఆశయాలకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఆకలికేకలు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించాలంటే సకల సంపదకు మూలమైన భూ పంపిణీ చేసి సామాన్యులకు అందించాలి. ఈ దేశంలో దారిద్య్రం, నిరుద్యోగం, ఆకలి సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం. ఇవాళ రాజ్యాంగం 9వ షెడ్యూల్డ్లోని భూ సంస్కరణలను అమలు చేయాలని కోరుతూ ప్రజలు భూ పోరాటాలు చేసి భూమిని, ప్రకృతి సంపదలను కాపాడుకోవాలి. తద్వారా జీవించే హక్కునూ కాపాడుకోవాలి.
- షేక్ కరిముల్లా