Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ఎవరినైనా ప్రే మించారా! అని మల్లిని పాత్రికేయులు ఒకసారి అడిగితే, 'అవును నేను పర్వతాలని ప్రేమిస్తు న్నాను' అని అయన చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఆయన పర్వ తారోహణనే శ్వాసగా, జీవితాశ యంగా జీవించాడు. మల్లి మస్తాన్ బాబు కేవలం 172 రోజుల్లో ప్రపం చంలోని ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలని అవలీలగా అధిరోహించి, ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించాడు. మల్లి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘం గ్రామంలో 1974 సెప్టెంబర్ 3న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించాడు. మల్లి బాల్యంలో చురుకైన విద్యార్థిగా ఉండేవా డు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో పూర్తిచేసిన మస్తాన్ బాబు కోరుకొండ సైనిక పాఠశాలలో పైతరగతులు చదివాడు. చిన్నప్పటినుంచే మల్లికి కొండలెక్కడం అంటే మహా సరదా. సైనిక పాఠశాలలో చేరడమే ఆయన జీవితంలో కీలక మలుపు. సైనిక పాఠశాలలో పూర్వ విద్యార్థి ఎం.ఉదయ భాస్కర్రావు ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో మృత్యువాత పడటం, ఆయన విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణలో ఏర్పాటు చేయడం తదితర సంఘటలన్నీ మల్లికి శిఖరా రోహణపై ఆసక్తి కలిగించాయి. ఎవరెస్ట్ను అధిరోహించి తన సీనియర్ విద్యార్థికి నివాళి అర్పించాలనుకున్నాడు. మల్లి ఉన్నత విద్యాభ్యాసమంతా ఐఐటీ, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో జరిగింది. ఆయన కొంతకాలం సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేసి, తన లక్ష్య సాధన కోసం ఆ సంస్థ నుంచి తప్పుకొని, పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న పలు శిఖరాలను అధిరోహించాడు. 2006 జనవరి 19న అంటార్కిటికా ఖండంలోని 4897మీటర్లు ఎత్తున్న 'విన్సఫ్ మాసిన్' శిఖరాన్ని అధిరోహించి తన శిఖర ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది మే 21న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం ద్వారా తన సీనియర్ విద్యార్థి కన్న కల నిజం చేశాడు. 2006 జూలై 10న ఉత్తర అమెరికాలోని 6194 మీటర్లున్న మౌంట్ మేకిన్లి (డెనాలి) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాలకుల నుండి పెద్దగా ప్రోత్సాహం లేకపోయి నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. మల్లి బహుభాషాకోవిదుడు. గొప్ప పర్యావరణ ప్రేమికుడు, మంచి వక్త. హిమాలయ పర్వతాలలో పేరుకుపోతున్న వ్యర్థ పదార్థాల గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. దేశ వ్యాప్తంగా పర్యటించి తన ప్రసంగాలతో యువతలో ఉత్తేజం నింపేవాడు. దురదృష్టవశాత్తూ 2015 మార్చిలో దక్షిణ అమెరికలోని అండీస్ పర్వతాలలో గల 6749 మీటర్ల ఎత్తుగల 'నెవాడో టైస్ క్రూసెన్ సర్ సమ్మిట్'ని అధిరోహించి దిగే క్రమంలో తుఫాన్ తాకిడికి గురై మరణించాడు. పర్వతారోహణ అనేది సాహసంతో కూడుకున్న క్రీడ. అందులో అనేక వ్యయ ప్రయాసాలు ఉంటాయి. 2016లో మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ ఆ శిఖరాన్ని అధిరోహించి మల్లి కలని సాకారం చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్, కిలిమంజిరో వంటి శిఖరాలను అధిరోహించడం హర్షణీయం. ఆటలంటే క్రికెట్, చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అనే అభిప్రాయం ఉన్న మన దేశంలో పాలకులు మరింత ప్రోత్సహిస్తే మస్తాన్ బాబు వంటి మట్టిలో మాణిక్యాలు మరికొందరు వెలుగులోనికి వస్తారు.
- యం.రాంప్రదీప్
సెల్ : 9492712836