Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యారంగం సంక్షోభంలో ఉందని చెప్పుకో వటం మామూలు మాటైంది. సంక్షోభం లోనే కాకుండా ప్రస్తుతం మనం ఒక ప్రజాస్వా మ్య, లౌకికవాద వ్యతిరేక మార్గం వైపునకు వేగం గా అడుగులు వేస్తున్నామని చెప్పుకోవటం సబబు గా ఉంటుందేమో. ఇది మనము న్న పరిస్థితులను మరింత జ ఠిలం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తిలోకి రావటంతోనే మ నం చాలా గౌరవప్రదమైన వృత్తి లోకి వచ్చినట్టు మన చుట్టూ ఉన్నవారు అనుకుం టారు. ''గురు : బ్రహ్మ గురు : విష్ణు గురు దేవో మహేశ్వర:, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:'' అనే ప్రార్థనతోనే చాలా పాఠశాలల్లో దినచ ర్య ప్రారంభమవుతుంది. భిన్న మతస్తులైన విద్యార్థులను ఈ ప్రార్థనలోని దే వతల ప్రస్తావన గందరగోళ పరుస్తుందేమో అన్న ఆలోచనే చాలా మందికి రాదు. లౌకికవాద ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవడం ఇలాంటి చోట చా లా అవసరం. పాఠశాలను విద్యాలయమని మనం అనేటప్పుడు కూడా ఏదో ప్రశాంతమైన ధార్మిక ప్రదేశమనీ, ఉపాధ్యాయులు దైవసమానులైన మనవుల నే భావన కనిపిస్తుంది. ఇది పూర్తిగా వాస్తవ వ్యతిరేక ఆలోచన. అనవసరమై న ఆరాధనాభావం కలిగించేది. గురువులు దైవసమానులైతే వారి దగ్గర కా స్తో కూస్తో దైవ శక్తులు ఉండాలి కదా. వాటిని ఉపయోగించి నూరు శాతం ఉత్తీర్ణతలు ఇట్టే సాధించొచ్చు కదా? ఉపాధ్యాయులమైన మనం మామూలు మనుషులమే. మన జ్ఞానానికీ, అనుభవాలకూ పరిమితులుంటాయి. మనం వా టిని మన విద్యార్థులతో ఎంత పంచుకుంటామో మనం వాళ్ల నుంచి అం తే నేర్చుకోవలసి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించాలి. పిల్లలు నేర్చు కోవటం పాఠశాలతోనే లేదా మనతోనే ప్రారంభమవడంలేదు. మనమంద రం నేర్చుకుంటూనే ఉంటాం. అ భ్యాసనమనేది ఒక ఆనందభరితమైన, ఉత్తే జకరమైన నిరంతర ప్రక్రియ. మ నం పాఠశాలలో పిల్లలతో ఉన్న ప్రతి సంద ర్భంలోనూ ఈ భావన మనలను నడిపించాలి. మనం మనంగానే ఉండాలి. పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండటానికి వేరేలా నటించాల్సిన పనిలేదు. పి ల్లలు మన మాటలకు, మన చేతలకు ఉన్న తేడా చాలా త్వరగా గ్రహిస్తారు. వాటికి పొంతన లేనప్పుడు పిల్లలు కూడా ఆలోచనలకు ఆచరణకు పొంతన లేని వ్యక్తులుగానే తయారవుతారు. తమ ఉపాధ్యాయులలో మానవీయ లక్ష ణాలు కనిపిస్తున్నా వారిని భూమి మీద దేవుని ప్రతిరూపంగా ప్రార్థించే పిల్ల లు వైరుధ్యాలను ప్రశ్నించడం మానుకుని, వాటిని అంగీకరించే మానసిక దౌ ర్భల్య స్థితికి జారుకుంటారు. ఇది వారు గుర్తించలేనంతగా వారి ఆలోచన లను ప్రభావితం చేస్తుంది. పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత, అంశాల వారీగా మార్కుల శాతం, వారు నేర్చుకున్న దానికీ, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యా లకు కొలమానమైంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ సహా యంతో ప్రతి తరగతి, అంశాల వారీగా అభ్యాసన ఫలి తాలు తయారు చేయి ంచింది. ప్రతి విద్యార్థి తన తరువాతి తరగతికి అర్హత పొందే నాటికి సాధిం చాల్సిన ప్రమాణాలను రూపొందించి ఉపాధ్యాయుల తరగతి బోధనకు ఒక దిశ నిర్ధేశించే ప్రయత్నం జరిగింది. అభ్యాసన ఫలితా ల మొత్తం డాక్యుమెంటులో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అది ఒక ఆదర్శవ ంతమైన కొత్త లక్ష్యాలను పాత విద్యా నిర్మాణంలోనే సాధించడానికి ప్రయ త్నం చేస్తున్నది. ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా బోధిస్తున్న పద్ధతుల ను వదిలిపెట్టి వాటికి భిన్నమైన నూతన బోధనా విధానాలను ఆచరించడం ఒక సవాలు. సాంప్రదాయక పాఠశాల, తరగతి రూపాలు ఈ నూతన బోధ నా పరీక్ష పద్ధతులకు వ్యతిరేకంగా ఉంటాయి. చాలామంది ఉపాధ్యాయులు కూడా ప్రయోగాలకు విముఖంగా ఉంటారు. అభ్యాసన ఫలితాల డాక్యుమెం ట్ విద్యార్థులందరూ వారి మీద రుద్దబడే పాఠ్యప్రణాళికకు భౌతికంగా, మానసికంగా సిద్ధంగా ఉంటారనే నిర్ధారణకు వచ్చినట్టుగా కనిపిస్తుంది.
పాఠాలలో ఉన్న వాటికన్నా చాలా సంక్షిష్టమైన విషయాలను పిల్లలు ప్ర త్యక్షానుభవం ద్వారా పదేపదే వాటిని చేయడం ద్వారాను నేర్చుకోగలరని జీ వితానుభవం మనకు చెబుతుంది. ఉదాహరణకు ఓ గడియారం మెకానిక్ ఎ లాంటి పుస్తక జ్ఞానం లేకుండానే తాను నేర్చుకున్న పనిని చక్కగా చేసుకుపో తుంటాడు. ఆ పనిని అతడు ప్రత్యక్షంగా వేరే వ్యక్తి నుంచి నేర్చుకున్నాడు. అ దే పనిని అతనికి పుస్తకాల ద్వారా నేర్చుకోవాల్సి వస్తే అతనికి సుదీర్ఘకాలం పట్టొచ్చు. చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లుంటే కొద్ది నెలల్లో పిల్లలు ఈ కొత్త భాష నేర్చుకోగలరు. కానీ పుస్తకాల నుంచి మాత్రమే భాషను నేర్చుకోవాల్సి రావడంతో ఏమి జరుగుతుందో మనకు తెలియనిది కాదు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వందల విషయాలు పిల్లలు ఎందుకు గుర్తుంచుకోరు? ఎందుకంటే పిల్లలకు ఆ విషయాలు స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకునేందుకు అవకాశం లేకపో వడం లేదా కల్పించబడకపోవడమే. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుచేసుకోవాలి. పుస్తకాల్లోని చాలా విషయాలు పిల్ల లు చదివి, అర్థం చేసుకొని, నిత్య జీవితంతో దానికుండే సంబం ధాన్ని తన మాటల్లో అందరితో పంచుకోగలిగితే చాలు. కానీ వాళ్లు వాటిని పరీక్ష కోసం పదేపదే మననం చేయాల్సి రావడం జాలిపడాల్సిన పరిస్థితి. ఇ ందుకు కావాల్సిన సామర్థ్యాలు అందరికీ ఒకేవిధంగా ఉండవు. రాత పరీక్ష లు, వాటిలో ఎక్కువ మార్కులు సాధించాల్సిన పరిస్థితి పిల్లల అమూల్యమైన సమయాన్ని వృథా చేయడమే కాదు, అవి వారు భిన్నంగా ఆలోచించడాన్నీ, రాయడాన్నీ నిరుత్సాహపరుస్తున్నాయి. ఒక కొత్త తరహా పద్ధతులను అను సరించడానికి, తప్పులు చేయడానికి వెనుకాడేలా చేస్తున్నాయి. పరీక్షలలో ఎక్కువ సమాధానాలు పిల్లలు తాము చదివిన పుస్తకాల నుంచి గుర్తుంచుకొని రాసిన సమాధానాలే. ఇది చాలా నిరర్థకమైన ప్రక్రియ.
ప్రముఖ విద్యావేత్త కెన్ రాబిన్సన్ ఇలా అన్నారు. '' పిల్లలకు నేర్చుకునే వ్యామోహం అపారంగా ఉంటుంది. చాలా సంక్షిష్టమైన భాషలను కూడా పి ల్లలు చిన్నతనంలోనే తన చుట్టూ ఉన్నవారి నుంచి తేలికగా నేర్చుకుంటారు. కానీ పిల్లలకు పాఠశాల ప్రతిబంధకంగా తయారైంది. అది ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో వారికి నేర్పాలని అనుకుంటుంది. పిల్లలు సహజంగా నేర్చుకునే ప ద్ధతులకు స్కూలు అనుసరిస్తున్న పద్ధతులకు పొంతన కుదరటం లేదు''. మ రి ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలి? మొదటగా పిల్లల్లో ఈ నేర్చుకో వడంపై ఉన్న ఆసక్తిని తగ్గకుండా చూడాలి. వారిని గౌరవించాలి. వారి ఆస క్తులను, అభిరుచులను మన్నించాలి. వారికీ స్వయంగా నేర్చుకునే శక్తి ఉంది. వారికి అవసరమైనప్పుడే మనం సహాయం అందించాలి. తమ అభ్యసనాన్ని పిల్లలు తామే నియంత్రించుకునేలా చేయాలి. పిల్లల ఆసక్తులు ఒకేలా ఉండ వు. మన విద్యావ్యవస్థ వారి ఆసక్తులను నిర్లక్ష్యం చేసి తన పరిమితులను, స్వీ య నిర్ధేశిత లక్ష్యాలను వాళ్ల మీద రుద్దుతుందనీ, కాలం చెల్లిన మార్కులు ప ర్సంటేజీల లక్ష్యాలను మనందరి మీద రుద్దతున్నదని గుర్తించాలి. ప్రతి వి ద్యార్థి తనకు అభిరుచి ఉన్న విషయంలో ప్రోత్సాహం, అవకాశాలు లభించే పరిస్థితి మన తరగతి గదుల్లో లభిస్తే అవి ఉత్తేజపూరితంగా ఉంటాయని గుర్తించాలి.
- కెటి.ప్రసాద్