Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కేసీఆర్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఈ మధ్య కాలంలో సారు చేస్తున్న పనులు ఇందుకు ఆద్దం పడుతున్నాయి. ఒకప్పుడు రాజులు, మహారాజులు, చక్రవర్తులు తమ ఉనికి వేల ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు తమ రాజ్యంతో పాటు ఆధీనంలో ఉన్న సామంత రాజ్యాలలో సైతం శాసనాలు చెక్కించుకునేవారు. వాటి ఆధారంగానే నేడు పరిశోధకులు చరిత్రను ఔపోసాన పడుతున్నారు. తన చరిత్రను ఎందుకు భద్రపర్చకూడదని అనుకున్నారో ఏమో.. ఏకంగా యాదాద్రి ఆలయ ప్రాంగణాన్ని పావనం చేశారు. తన బొమ్మలతో పాటు పలు ప్రభుత్వ పథకాలను ఆలయంలోని శిలలపై చెక్కించుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఇదేం పోయే కాలం అంటూ ప్రతి పక్షాలు కన్నెర్ర చేశాయి. తప్పించుకునే దారి లేక నష్ట నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.... జరగాల్సిందంతా జరిగి పోయిందని, అపచారానికి పరిహారం లేదనీ అన్ని వైపుల నుంచి ఆగ్రహం పెల్లుబికుతున్నది. ఆ రోజుల్లో రాజులు ఎంత ప్రచారం చేసుకున్నా పవిత్రమైన ఆలయాల్లో తమ బొమ్మలను చెక్కించుకోలేదు. రాజు దైవాంశ సంభూతుడు అనే ఫ్యూడల్ సంస్కృతి వంటబట్టిందో ఏమో గానీ కేసీఆర్ పాలన అచ్చం తుగ్లక్ తంతును మరిపిస్తున్నది.
- ఊరగొండ మల్లేశం