Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్కారు అనుబంధ ప్రజాసంఘాలు కొన్ని నాంపల్లిలో ఓ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఫెడరల్ వ్యవస్థపై వక్తలు అనర్గళంగా ఉపన్యాసాలు దంచేశారు. ఈలోపు లంచ్ టైం అయ్యింది. భోజనాలు అయ్యాక మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్ వస్తారని, సభ కొనసాగుతుందని నిర్వాహకులు మైక్లో అనౌన్స్ చేశారు. ఎవరికి తప్పినా పాత్రికేయులకు తిప్పలు తప్పవు కాబట్టి...ఆయన కూడా ఏం చెప్తాడో అని భోజనాలు అయిపోయాక అదే హాలులో 40 నిముషాలకు పైగా వెయిట్ చేశారు. కేటరింగ్ తెచ్చిన వాళ్లు కూడా బొగోనేలు సర్దుకొని వెళ్లిపోబట్టే...! అప్పటి వరకు సభకు వచ్చినోళ్లు ఒక్కోక్కరే కనిపించకుండా మాయం కాబట్టే! ఏమైతాందా అని ఓ పాత్రికేయమిత్రుడు అత్యుత్సాహంతో నిర్వాహకుల్ని అడిగేందుకు వెళ్తే వాళ్లు భోజనం చేసి వెళ్లిపోయి అరగంట అయ్యిందని అక్కడోళ్లు చెప్పబడ్తిరి...ఇదేందన్నా..వినోద్కుమార్ సార్ వస్తరని చెప్తిరి కదా అని ఫోన్ చేసి అడిగితే...'హ...హ...హ...గామాటలు నమ్మినారు...ఊకే చెప్పినాం' అంటూ అటునుంచి వెటకారపు సమాధానం వచ్చే! దీంతో ఎక్కడ మండాలో అక్కడ మండిన పాత్రికేయులు 'ఛీ దీనెవ్వ జీవితం' అని విసుక్కుంట పోబడ్తిరి!!
- కెఎన్ హరి