Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సదవేస్తే... ఉన్న మతి పోయిందనీ...కాకరకాయ కాస్తా కీకరకాయ అయ్యిందట! అట్టుంది కరెంటోళ్ల లొల్లి...అప్పట్లో ఉద్యోగుల్ని మెప్పించేందుకు వాళ్లు ఏం చెప్తే అది చేశారు కరెంటు బాసు...1,157 మంది ఆంధ్రా స్థానికత పేరుతో ఒక్క కలంపోటులో రిలీవ్ చేసేశారు. అదేందని...వాళ్ళంతా కోర్టుకెక్కితే...నెలకు రూ.27 కోట్లను జీతాల రూపంలో అప్పనంగా ఇచ్చేశారు...ఇస్తున్నారు. అప్పట్లోనే విభజన చట్టం మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులు ఆప్షన్లను ఇస్తామంటే కుదరదన్న కరెంటు బాసులు...ఇప్పుడు జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలతో 'ఆప్షన్లు' ఇవ్వండి అని కరెంటు ఉద్యోగులకు సర్క్యులర్ జారీచేశారు. ఆ తెల్వి ముందే ఉంటే పున్నేనికి 1,157 మందికి కూసోబెట్టి ఇచ్చిన వందల కోట్ల రూపాయల జీతాలు మిగిలేవి కదా! అని ఇప్పుడు సదరు కరెంటోళ్లు సణుక్కొంటున్నారు!
- ఎస్ఎస్ఆర్ శాస్త్రి