Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కు దుపుకు గురైంది. ఆర్థికమాంద్యం భయంతో ఆందోళన చెందుతున్నది. అందు కే.... బ్యాంకుల విలీనానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ డ్జెట్లో ఆర్థికమాంద్యం భయంతో అనేక సంక్షే మ పథకాలకు కోత విధించారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఏర్పడటం మనదేశానికి కొత్తేమీ కాదు. అయితే ఈ సారి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తారుమారవుతుండడం ఆందోళన కలిగిం చే విషయం. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య పరిస్థితు లు ఏర్పడినప్పటికీ ఈసారి దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో ఇటువంటి ఆర్థికమాంద్య పరిస్థితు లు ఏర్పడి ప్రజల జీవనవిధానాలు అగమ్యగోచరంగా మారాయి. 80శా తం ప్రజలు బలవంతంగా కాపురాలు నెట్టుకొచ్చారు. ఒకవైపు స్వాతం త్య్రోద్యమం నిర్విరామంగా సాగుతుండగా మరోవైపు ప్రజలను ఆర్థిక ఒడిదుడుకుల నావనుంచి ఒడ్డున చేర్చడానికి పొదుపు గురించి కూడా చైతన్యవంతులను చేశారు. ఇందులో భాగంగా మెజార్టీ ప్రజల ఆహార ని యమాలను వాస్తవిక ప్రపంచానికి దగ్గరగా నిరూపించారు. అప్పట్లో పే దరికం ఎక్కువగా ఉండడంతో చాలా గ్రామాలలో ప్రజలకు ఒంటినిండా కప్పుకునే బట్టలు ఉండేవి కావు. సంవత్సరానికి రెండు మూడు జతల బట్టలు మాత్రమే కొనుక్కునేవారు. వాటిని అపురూపంగా దాచుకొని పం డుగల సమయంలోనో.... పట్టణాలకు వెళ్లినప్పుడో.... వేరే బంధువుల ఊర్లకు వెళ్లినప్పుడో.... మాత్రమే పూర్తి స్థాయి బట్టలు ధరించి వెళ్లేవారు. మిగతా సమయాల్లో ఇండ్ల దగ్గర ఉన్నప్పుడు ఒంటి మీద షర్ట్స్ లేకుం డానే జీవించేవారు. ఆ తరహా జీవన విధానాన్ని గాంధీజీ ఆచరణలో చూ పించారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో దేశవ్యాప్తంగా ఒకసారి అనావృష్టి ఏర్పడి కరువు ముంచుకొచ్చి ఆహారధా న్యాల కొరత ఏర్పడగా... అనేక చోట్ల గంజి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలాగే.... ప్రజలు అడవులలో ఆకు, అనాసగడ్డ వంటివి సేకరించి వాటి ని ఫ్రై చేసుకొని తిన్నారు. ఇలాగే ఉస్తికాయలను ఇతర అటవీ ఫలాలను తెచ్చుకొని భుజిస్తూ కొన్ని రోజులు జీవనం సాగించారు. అటువంటి గం జికేంద్రాలను, కరువు పీడిత ప్రాంతాలను స్వయంగా నెహ్రూ సందర్శిం చి ప్రజల బాగోగులను నేరుగా పరిశీలించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్థాన్తో యుద్ధంలో విజయం సాధించిన తరు వాత దేశంలో ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అంతకు ముందు మూడేండ్ల కిందటే నెహ్రూ జీవించి ఉన్నప్పుడే.... చైనాతో జరిగిన యుద్ధ ప్రభావం కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అప్పుడు దిగజారిన ఆర్థిక పరిస్థి తిలో భాగంగా ఆహార ధాన్యాల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఆ సమ యంలో లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్-జై కిసాన్' నినాదాన్ని జాతికి అందించారు. ఆ సందర్భంలోనే శాస్త్రి గారు రాత్రి పూట అన్నం కాకుండా చపాతి తినాలని పొదుపులో భాగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అలా.... అప్పట్లో పాలకులు, జాతినేతలు ప్రజలకు ఇచ్చే సందేశాలు ఆచరణాత్మకంగా ఉండేవి.
ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం నాయకులు పొదుపు మం త్రం గురించి ప్రజలు ఈ పొదుపును పాటించే విధానం గురించి ఏవేవో పలుకుతున్నారు. మొదట పాలకులలో జవాబుదారీతనం ఏర్పడాలి. రా ష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్రమంత్రు ల కార్యాలయాలలో పొదుపు కార్యక్రమం ప్రారంభమై రాష్ట్రాల పాలకుల వరకు సాగాలి. ప్రజలేమో పొదుపు పాటించాలి... నాయకులేమో విలా సాలలో తేలియాడుతామంటే ఎలా? సామాన్యులు కష్టాలతో త్యాగాలు చేయాలి... పాలకులు, ఉన్నతాధికారులు భోగాలు అనుభవించాలనే విధ ంగా నేటి పరిస్థితులు దాపురించాయి. కేంద్రమంత్రులు, ఎంపీలు ఇతర భారత ప్రభుత్వ అధినేతలు, అమాత్యులు, ప్రముఖుల గౌరవ వేతనాలలో కోత విధించాలి. ఒక పార్లమెంట్ సభ్యునికి సరాసరిన గౌరవ వేతనంతో సహా ఇతర సౌకర్యాలు నెలకు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. మంత్రుల పేషీలో, అతిథి గృహాలలో 24 గంటల ఏసీల సౌకర్యం, కార్పెట్ల వైభోగం ఇతరత్రా చిల్లర మర్యాదలకే నెలవారీ ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి. గ వర్నర్లకు, ముఖ్యమంత్రులకు సంబంధించిన వేతనాలు సరేసరి. ఈ అ ధినేతలు అధికారిక పర్యటనలు జరిపినప్పుడు అయ్యే ఖర్చు ద్వారా ప్రభు త్వ ఖజానాకు ఎంత బొక్క పడుతున్నదో వేరే చెప్పవలసిన పనిలేదు. ఒక్కో కేంద్రమంత్రి నివాస భవనం (క్వార్టర్) ఢిల్లీలాంటి మహానగరంలో ఒక ఎకరా వైశాల్యంలో ఉంటుంది. ప్రధాన గేట్ ముందు, లోపల అడు గడుగున సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఇక పీఏలు, పీఎస్లు, ఓఎస్డీలు అటు గెస్ట్ హౌస్లో, ఇటు ఆఫీస్లో వారి హడావిడి సరేసరి. రాష్ట్రపతి కా ర్యాలయ భవనం సుమారు మూడు వందల గదులతో ఉంటుందని ప్ర చారంలో ఉంది. దేశంలో అటు రాష్ట్రపతి, రాష్ట్రాలలో ఇటు గవర్నర్లు కేవ లం ఆరో వేలులాగా అలంకారప్రాయంతో రబ్బరు స్టాంపుల్లాగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రాజ్భవన్ ఖర్చు కూడా ఏటా కోట్లల్లో ఉంటుంది. జిల్లాలలో కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారుల నివాస భ వనాలు కూడా విశాల ప్రదేశాలలో నాటి రాజరికపు ఛాయలను తలపిం పచేస్తున్నాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా ప్రతి నెలా లక్షల్లో ఉంటున్న ది. రాష్ట్రాలలో రాష్ట్ర మంత్రులకు ఒక్కొక్కరికి నెలవారీ వేతనం ఇతర ఖర్చుల కింద నెలకు సరాసరిన 10 లక్షలు ఖర్చవుతోంది. ఎమ్మెల్యేలకు కూడా సరాసరిన నాలుగైదు లక్షలు ఖర్చవుతోంది. బ్యూరోక్రాట్ల ఖర్చులు కూడా ఇదేతరహాలో ఉంటున్నాయి. కాబట్టి ముందు పాలకులు పొదుపు ఉద్యమంలో భాగంగా అటు ప్రజలకు ఇటు భావితరాలకు ఆదర్శంగా వ్య వహరించడానికి తమ వేతనాలలో, ఖర్చులలో స్వచ్ఛందంగా కోత విధిం చుకొని ప్రభుత్వ ఖజానాకు అప్పగించి ప్రజలకు పొదుపు పాఠాలు చెబితే అప్పుడు ప్రజలు కూడా పొదుపు ఉద్యమంలో భాగస్వాములై త్యాగాలకు సిద్ధమవుతారు. అలాగే బడాబాబుల దగ్గర ఉన్న బ్లాక్మనీ వెలికితీతకు ఈ సమయంలోనైనా పటిష్టమైన ప్రణాళికతో కఠినమైన చట్టం తీసుకొస్తే కొంతలో కొంతైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో 'పొదుపు ఉద్యమం -పాలకుల నైతిక బాధ్యత' అనే అంశం మీద విస్తృత చర్చ అవసరం.
- టి.రామదాసప్ప నాయుడు
సెల్ : 99898 18212