Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆరధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా 66 ఏండ్ల కిందట ఏర్పడింది. కానీ నీళ్లు, నిధులు, నియామకా ల్లో వివక్షత, భాషపై చులకన ఆనాటి పెద్ద మను షుల ఒప్పందాన్ని తొలి మఖ్యమంత్రి నీలం సంజీ వరెడ్డి నుండి చివరి ముఖ్య మంత్రి కిరణ్కుమార్రెడ్డి దాకా ఉల్లంఘించడంతో పలు ఉద్యమాల ద్వారా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పో రాటానికి ప్రధాన భూమిక పోషించిన కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. బంగారు తెలంగాణ సాధించాలనే విజన్తో ఆరంభమైన పాలనకు ఐదేండ్లు గడిచాయి. మళ్లీ రెండోసారి కేసీఆర్ అధికా రంలోకి వచ్చారు. విధానాలు మాత్రం ప్రజలపై అప్పులు వేసే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ఇది ధనిక రాష్ట్రం (తర చూ సీఎం అనే మాట). కానీ ఆనాటికీ రూ.69వేల కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పు 2019 నాటికి రూ. 1,80,230 వేల కోట్లకు చేరింది. ఈ వాస్తవాన్ని కేం ద్ర ఆర్థిక మంత్రే రాజ్యసభలో చెప్పారు. లక్ష ఉద్యో గాల భర్తీ ఏమైంది? పది లక్షల ఎకరాలకు నీరు ఏమై ంది? పక్కరాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసు కుంది. ఇక్కడ పరిస్థితి ఏమిటో బోధపడదు. అనాటి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అన్నారు. జరగ లేదు. అసలు ఉత్పాదక రంగంలో ప్రభుత్వం ఆధ్వర్య ంలో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు. తెలంగాణలో రెండున్నర లక్షల మంది కాంట్రాక్టు, డెయిలీ వేజ్, ఎన్ఎంఆర్లు పని చేస్తున్నారు. వారి క్రమబద్దీకరణ జరగలేదు. కోతల బడ్జెట్ను ప్రతి వారూ గమనించా లి. వృథా ఖర్చులు పెరుగుతున్నాయి. నాడు 294 మందికి సరిపోయిన అసెంబ్లీ నేడు 120మంది ఎమ్మెల్యేలకు చాలదా? 90 మంది ఎమ్మెల్సీలకు సరిపోయే శాసనమండలి నేడు 50 మందికి చాల దా. ఐదేండ్లు రెండు రాష్ట్రాలకు సరిపోయిన సచివాలయం నేడు ఒక తెలంగాణకు చాలదా? జూబ్లీహిల్స్ ఆదర్శనగర్, హైదర్గూడలలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నా కూలదోసి మళ్లీ కట్టారు. గత ముఖ్యమంత్రి ఉన్న అధికార భవనాన్ని కూల్చి ప్రగతి భవన్ కట్టారు. అలాగే అసెంబ్లీ, సచివాలయం, రవీంద్రభారతి లాంటి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని ప్రయత్నిస్తున్నారు! ఒకవైపు కేంద్రం నిధుల్లో వివక్షత, ఆర్థిక మాంద్యం, పెరిగే ధరలు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు, విధులు కేటాయిం చలేని స్థితిని మనం చూస్తున్నాం. సీఎం అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక స్థితి చెప్పారు. 11 వేల కోట్ల ఆదాయం వస్తుంటే వడ్డీల చెల్లింపులకే 2వేల కోట్లు పోతోంది కదా! ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సంక్షేమంలో 16వేల కోట్లు తగ్గించడం, ఎంబీసీ కార్పొరేషన్కు కేవలం రూ.5కోట్లు ఇలా రాస్తూ పోతే శాఖలవారిగా అన్నింటా కోత కనిపిస్తుంది. దళితులకు 3 ఎకరాల భూముల మాటేమిటి? డబుల్ బెడ్రూంల సంగతే మిటి? ఆరేండ్లయినా జర్నలిస్టులకు స్థలాల మాటెత్త రేమిటి? లక్షలాది అసంఘటిత కార్మికుల మాటేమి టి? గతంలో లేని విధంగా ట్రాఫిక్ రూల్స్ పేరిట చలానాల వసూళ్లేమిటి? ధరలపై ఏ మాత్రం నియం త్రణ లేదు. ఎటు చూసినా అప్పుల తెలంగాణ, బాధల తెలంగాణ, రోగాల తెలంగాణే కనిపిస్తున్నది తప్ప బంగారు తెలంగాణ కనిపించదేం?!.
- తంగిరాల చక్రవర్తి
సెల్ : 9393804472