Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి కడుపుల రక్షకుడే నేడు ఆకలితో సహజీవనం చేస్తు న్నాడు. రాను రాను రైతు పరిస్థితి దిగ జారిపోతోంది. ఆరుగాలం కష్టంచేసి పండించిన పంట దళారీల మాయలో బందీ అవుతుంది. సమస్యల సముద్రం లో ఉన్న రైతు ఒడ్డును చేరే దారులు కనింపించడం లేదు. రైతు కోరుకునే గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా ఉం డిపోతోంది. భారతదేశానికి వెన్నెముక రైతు. జాతీయోత్పత్తిలో వ్యవసాయరం గం వాటా 14.5 శాతంగా ఉంది. అయినా రైతు పరిస్థితి మార టం లేదు. ఎన్ని పథకాలు వచ్చినా అవి క్షేత్రస్థాయిలో రైతు అవ సరాలను తీర్చలేకపోతున్నాయి. రైతు జీవమే బీజమై ధరణీలో దాగి, వర్షపు చినుకులకు తడిసి మొక్కై మొలిచిన ప్రాణమే ఈ సమస్త జీవానికి ఆధారం. తన భవిష్యత్ను పెట్టుబడిగా చేసిన రైతుకు అడుగడుగునా అడ్డంకులే. ఎకరా వరి వేయాలంటే సు మారు రూ.20వేలు ఖర్చు అవుతుంది. కానీ రైతులకు వస్తున్న పెట్టుబడి సాయం పొలం దున్నడానికి కూడా చాలట్లేదనేది సా మాన్య రైతు వాదన. దీంతో అప్పులు చేసి మరీ వ్యవసాయం చే స్తున్నారు. ఈ అప్పులే వాళ్ల పాలిట ఉరితాళ్లవుతున్నాయి. వ్యవసాయ సంక్షోభం కారణంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. సగటున ప్రతిరోజూ 52 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. అంటే రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నారు నుంచి మొదలు వడ్లు రాశిగా చేరే వర కు పంటను కంటికి రెప్పలా రైతు కాపాడతాడు. భారత దేశంలో సుమారు 50శాతం మంది వ్యవసాయం మీద ఆ ధారపడి జీవనం సాగిస్తున్నారు. మానవ నవీకరణ పుణ్యా మా అని భూగర్భ జలాలు అడుగంటాయి. గత ఐదారు ఏండ్ల నుంచి వర్షాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 250కి పైగా శాశ్వత కరువు మండలాలు ఉన్నాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇం డియా ప్రకటించింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప ంట తీయడం రైతుకు కత్తిమీద సాములాంటిదే. అయినా పట్టు వీడని విక్రమార్కుడిలా కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు. ఈరో జు అద్దాల మేడలో హాయిగా నాలుగు మెతుకులు తింటున్నామ ంటే స్వేదం తీసి సేద్యం చేసే రైతు పుణ్యమే. సూపర్ మార్కెట్లో నిల్వ ఉన్న కూరగాయలకు ట్యాక్స్లు కట్టి, టిప్పులు ఇచ్చే జనం సాగుచేసిన రైతు దగ్గర ఐదు రూపాయల కోసం బేరమాడు తారు. ఇలాంటి పరిస్థితులు పోవాలి. రైతే రాజు అన్న మాట మళ్లీ తెరమీదికి రావాలి. దళారుల వ్యవస్థ అంతం కావాలి. అం టే ప్రభుత్వమే నేరుగా రైతు పంటను కొనాలి. ప్రభుత్వ మా ర్కెట్లను ఏర్పాటు చేయాలి. తెలంగాణలో అధికారికంగా 274, అనధికారికంగా 800 మార్కెట్ కమిటీలున్నాయి. వీటన్నింటిలో రైతులకు న్యా యం చేకూరేలా చూడాలి. దళారులు ఇందులో కూ డా పంజా వి సురుతున్నారు. రైతులు తీసుకెళ్లిన ధాన్యానికి అధి కారులు నానా కారణాలు చూపిస్తూ, దళారులకు రెడ్కార్పెట్ పరి చి స్వాగతం పలుకుతున్నారు. మార్కెట్యార్డుకు రైతు నేరుగా రాకుండా ద ళారుల దగ్గరికే వెళ్లేలా కొంతమంది అధికారులు లేని కారణాలను చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రరైతు సం ఘం చేసిన ప ర్యటనలో ఆశ్చర్య పరిచే నిజాలు వెల్లడయ్యాయి. కొంతమంది ద ళారులు, బరువు నిర్దారించే మెషిన్ను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడతున్నారు. యథేచ్ఛగా రైతుల ను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి డిజిటల్ మోసాలు రైతులకు తెలవకపోవడంతో చేసిన కష్టమంతా దళారు ల చేతిలోకి పోతుంది. ప్రభుత్వం దళారీ వ్యవస్థపై దృష్టిసారించి రైతులకు న్యాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యవసా య రంగానికి లక్షా ముప్పైవేల కోట్ల రూపాయలు కేటాయిం చింది. కానీ ఇందులో 75 వేల కోట్లు 'కిసాన్ సమ్మాన్' కిందికి చేరనుంది. కిసాన్ సమ్మాన్ పథకానికి వ్యవసాయ రంగ నిధులు కాకుండా సొంత నిధులు కేటాయించివుంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడే రైతులకు నిజమైన న్యాయం జరుగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆర్థికమాంద్యం భారతదేశంలో కూడా పడగ విప్పిం ది. మన దేశంలో ఆర్థికమాంద్యం రావడానికి ముఖ్యకారణం ప్ర జలలో కొనుగోలు శక్తి లేకపోవడం. 75శాతం దేశ సంపద, గ్రా మస్థులు కొంటున్న నిత్యావసరాల నుండి వస్తుందని నివేదికలు చెప్తున్నాయి. గ్రామాలలో నివసించేది రైతులే. అంటే రైతుల ఆ దాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ రంగంలో మార్పులు రావాలి. స్వామి నాథన్ సిఫారసుల ప్రకారం ధర నిర్ణయించాలి. నేను వ్యవసా యదారుడిని అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. కానీ నే డు నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రైతును ప్రభుత్వా లు ఆదుకునేలా కనపడటం లేదు. అందరూ రైతులకు రిక్తహ స్తాలే చూపిస్తున్నారు. రైతుకు సాయం అందించే చేతులు కరువ య్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు కష్టాలను తీర్చా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సి.హెచ్. చందు