Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిగులు బడ్జెట్తో తులతూగిన తెలగాణ ఆర్థిక ముఖచిత్రం నేడు పైసలు లేవు అనే పరి స్థితికి వచ్చింది. ''ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను'' అనే మాటను సాక్షాత్తు ముఖ్యమంత్రే అనడం పరిస్థితి విషమించిందని తెలియజేస్తున్నది. నిజానికి తెలంగా ణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణాలు ముఖ్యంగా 1. విచ్చలవిడి అవినీతి, 2. ప్రణాళిక ర హిత పరిపాలన, 3. అహేతుకమైన నిర్ణయాలు, 4. అప్రధానమైన ఖర్చులు. పాలకులకు సంక్షేమ పథకా లే సర్వస్వమైనప్పుడు ప్రజా జీవితాన్ని ప్రభావితం చే సే మిగితా అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తా యి. తమకు విద్యా, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు అవసరం అనే స్పృహను ప్రజలూ విస్మరిస్తే... పాల కులు తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ఏమార్చి, తమ పబ్బం గడుపుకుంటారనే విషయం తెలంగాణ రాష్ట్రంలో రుజువైంది.
''నీళ్లు, నిధులు, నియామకాల'' ఎజెండాతో ఉ వ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ ఉద్యమం విజ యవంతమైనా- ఉద్యమ ఫలాలను అందుకోవడం లో తెలంగాణ సమాజం మాత్రం దారుణమైన పరాభవాన్ని రుచి చూసింది. ''తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ప్రజల జీవితాలు గణనీయంగా పురోభి వృద్ధి సాధిస్తాయని'' నమ్మబలికిన నాయకత్వమే గత ఐదేండ్లుగా తెలంగాణను ఏలుతున్నది. అపారమైన సహజ వనరులు, బహుళ ఆదాయ మార్గాలు, మిగులు బడ్జెట్తో తులతూగిన తెలంగాణ ఖజానా నేడు లోటుతో కూనరిల్లుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం తెలంగాణ అప్పులు 2,03,730 కోట్లకు చేరుతాయని కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ మొత్తానికి ప్రతి సంవత్స రం రూ.14,584 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్టు కూడా తెలిపారు. తల ఒక్కంటికి రూ.38 వేల అప్పుగా తేల్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఒక లక్షా 30 వేల 54 కోట్ల రూపాయలుగా ఉండగా అందులో తెలంగాణ వాటా కేవలం 69 వేల 515 కోట్లుగా ఉండింది. 2018-19 బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనా రూ.29 వేల 77 కోట్లుగా చూపబడింది. అంటే ఇది కేంద్ర వాటా రూ.29 వేల 41 కోట్ల కంటే ఎక్కువ. ఈ అంకెలను గమనిస్తే మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ''లోటు బడ్జెట్''లోకి వచ్చిందనే విషయం తెలుస్తున్నది. ఇలా ఒకవైపు మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్గా మారడంతోపాటు, మరోవైపు ప్రభు త్వం చేసిన అప్పులు కూడా గణనీయంగా పెరిగా యి. 2014 -15లో 9,410 కోట్ల అప్పుతో మొదలై న ప్రయాణం 2016 -17 సంవత్సరానికి గరిష్టంగా 35,280 కోట్లకు చేరుకున్నది. 2019 -20 ఆర్థిక సంవత్సరానికి 23,470 కోట్ల అప్పులు చేసి ప్రభు త్వం తెలంగాణ అప్పులను దాదాపు 2 లక్షల 50 వేల కోట్లకు చేర్చనుంది. చిన్న చిన్న బిల్లులు మొదలు ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులు దాపురించినట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కనిపిస్తున్నది. ప్రతి నెల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభు త్వం చెల్లిస్తున్న సొమ్ములో సింహ భాగం అంటే రెం డు వేల కోట్ల రూపాయలు అప్పులపై వడ్డీ చెల్లింపు లకే పోతున్నది. ఈ వడ్డీలు తాజా అప్పులతో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు, పెన్ష న్లకు పోగా, ఆసరా పెన్షన్లకు 420 కోట్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లకు 200 కోట్లు ఖర్చు అవుతున్నది. సబ్సిడీ బియ్యం రూ.168 కోట్లను కలుపుకుంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ వ్యయం నాలుగు వేల కోట్లపై మాటే! ఇదిలా ఉండగా రోజురోజుకు అన్ని రంగాలలో ప్రభుత్వం చెల్లించవలసిన పెండిం గ్ బిల్లులు పేరుకుపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు 20 వేల కోట్లపైమాటే! రోడ్లు, భవనాల నిర్మాణానికి కాం ట్రాక్టర్లకు చెల్లించవలసినది 1000 కోట్లుగా ఉంది. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలు - కార్పొరేషన్లలో రూ.1400 కోట్లు కాంట్రాక్టర్లకు, ఇతర సంస్థలకు చెల్లించవలసి ఉన్నది. ఈ మొత్తం 22,400 కోట్లకు చేరుకున్నది. ఎన్నికలు వరుసగా రావడంతో ఎవరూ ఏమీ చేసే పరిస్థితి లేదని మిన్నకుండి పోయారు చాలా మంది కాంట్రాక్టర్లు, ఇతరులు.
మిగులు బడ్జెట్తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కేవలం ఐదేండ్లలో కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? బుద్ధి జీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. కొన్ని ప్రధానమైన కారణాలను గుర్తించవచ్చు. అప్రధాన, అనుత్పాదక వ్యయాలకు గానూ విపరీతమైన నిధులు కేటాయిం చడం ఒక ముఖ్యమైన తప్పిదంగా చెప్పవచ్చు. కుల మతాల వారీగా కేటాయింపులు జరిపి, గుళ్లు, గోపురాలకు, యజ్ఞయాగాదులకు అనాలోచితంగా ఖర్చులు చేయడం, అనవసర హంగులు, ఆర్భాటాలకు పోయి ప్రచారాలు నిర్వహించడం, ప్రజలు కోరుకున్న వాటి కంటే కూడా కోరని వాటిని ముందుగా నెరవేర్చడం వల్ల ప్రత్యేకత చాటుకునే ప్రయత్నాలు చేశారు. ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి వాటిని మధ్యలోనే ఆపి, కొత్త పనులను మొదలు పెట్టడం వల్ల అనేకమైన వనరులు వృథా అయ్యాయి. అవసరమున్న దానికంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం తద్వారా రాష్ట్రం మొత్తంలో జరగవలసిన నిర్మాణాలను, అభివృద్ధిని, నిధులను ఏలికలు కేవలం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న, తమకు నచ్చిన ప్రాంతాలవైపే మళ్లించడం వల్ల అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఉదాహరణకు గజ్వేల్ నియోజకవర్గాన్నే తీసుకుందాం! స్వయానా సీఎం నియోజకవర్గమన్న ఒకే ఒక్క అర్హత వల్ల విశృంఖల, విధ్వంసక అభివృద్ధి ప్రణాళికలు రచించారు. ప్రజల ప్రత్యక్ష పరిపాలన, ప్రణాళికా భాగస్వామ్యం లేకుండా అవసరమా?, అనవసరమా? అనే విచక్షణ లేకుండా అమాంతం నిధులను కేటాయించారు. దాదాపు 500 కోట్ల వ్యయంతో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ విద్యాలయాలు, కాలేజీలు కనీస అవసరాలకు దూరంగా మౌనంగా రోదిస్తుంటే ''పరిమిత వనరులను పరిమితమైన ప్రదేశాలకు పరిమితం చేయడం'' విజ్ఞత అనిపించదు. అదే గజ్వేల్లో పాత బస్టాండ్ను 50 లక్షలతో అధునాతనంగా మార్చి వారం రోజులు తిరగకముందే కూల్చివేయడం, అదే స్థలంలో మార్కెట్ యార్డును నిర్మించడం స్థానికులకు బాగా తెలుసు. ప్రభుత్వ స్థలంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన వైట్ హౌస్ వీధి పోటుతో ''ఆధునిక బూత్ బంగ్లా''గా మారుతున్నది.
మిషన్ భగీరథ పథకంలో మంచి మంచి కాంక్రీట్ రోడ్లను తవ్వి ఇంటింటికీ నల్లాలు బిగించారు. కానీ మెజారిటీ రోడ్లు నాశనమయ్యాయి. వేసిన రోడ్లను ఒకవైపు కూలగొడుతూ, మళ్లీ మరమ్మతు చేయించడం, లేదా కొత్తగా నిర్మించడానికి టెండర్లు పిలవాల్సి వస్తున్నది. దీనివల్ల విలువైన ప్రజాధనం వృథా అయిపోతున్నది. ''చిన్న రంధ్రమైనా పెద్ద పడవను ముంచిన'' చందంగా తెలంగాణ విషయంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చాలా జరిగాయి. దాని ఫలితంగా ఆర్థిక పరిస్థితి దుర్లభంగా మారింది. తాత్కాలిక తాయిలాలతో లొంగిపోయిన ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోయిన ఫలితంగా, ప్రశ్నించే గొంతులను నొక్కేసాక అడ్డంకులు లేకపోవడం వలన జవాబుదారీతనం మసకబారిపోతోంది. అంతులేని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ముందు ప్రజలు, వారి సమస్యలు కనిపించవు.
నిజానికి తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్య, కేజీ టు పీజీ పథకం అమలు కావాలని తమ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో , కాలేజీల్లో చదువుకోవాలని ఆశిస్తున్నారు. తమ దగ్గర్లో ఆసుపత్రి అన్ని వసతులతో, సిబ్బందితో ఉండి తమ ఆరోగ్య రక్షణ చూడాలని కోరుకుంటున్నారు. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడుగుతున్నారు. అన్ని పరీక్షలు ఉచితంగా చేసే యంత్రాంగం ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ ముఖ్య అంశం నియామకాలు. కనీసం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ నిరుద్యోగులు, విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగాలను కోరుతున్నారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి ఒకవైపు పెరుగుతూ, మరోవైపు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశను చాలించుకోవాలని, ప్రైవేటు రంగంలో అవకాశాలు వెతుక్కోవాలని ఉద్యోగ సంఘాల మాజీ కార్యకర్త, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం గర్హనీయం. తెలంగాణ ఉద్యమమంతా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా! తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు చక్రాలైతే నియామకాలు ఇరుసుతో పోల్చవచ్చు. కానీ కనీసం ఒక్క డీఎస్సీ కూడా ప్రభుత్వం వెయ్యలేదంటే ఏ రకంగా ప్రాధాన్యత క్రమాలను మర్చిపోయారో తెలుసుకోవచ్చు.
యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడ్డది. అది ముందుగా రాష్ట్రంలో అత్యున్నత ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితోనే మొదలు కావాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల జీతభత్యాలు హేతుబద్దీకరించాలి. కాంట్రాక్టులలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టే శాశ్వత ఏర్పాట్లు చేయాలి. ప్రజలు తమ స్వంత కాళ్లమీద తాము నిలబడే అవకాశాలు కల్పించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జరుగుతున్న విపరీతమైన ఖర్చు స్థానంలో దక్షిణ కొరియా మార్గంలో వివిధ రకాలుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి రాకముందే ఈ చర్యలు చేపట్టడం అనివార్యం. పొరపాట్లు చేయడం కంటే వాటిని దిద్దుకునే ధైర్యం, నిజాయితీ గొప్పవి. మరి ఆ సత్తా మన ప్రభుత్వానికి ఉందా? అనేది అంతిమమైన ప్రశ్న.
- కె.శ్రీనివాసాచారి
సెల్ : 8096653459