Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోడీ మాట్లాడుతూ.. 'ఆవులం టే కొందరికి భయం.. ఓం, ఆవు మాటలు వినబడితేనే వారికి రొమాలు నిక్కబొడుచుకుటాయి. దేశం 16వ శతాబ్డంలోకి పోయినట్టు మాట్లాడతార'ని అన్నారు. వాస్తవంగా చూస్తే దేశా న్ని 16వ శతాబ్దంలోకే కాదు.. అంతకుముందున్న మధ్యయుగాల నాటికి తీసుకుపోవాలని ప్రయ త్నిస్తున్నదెవరో దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంటేనే 'అదేదో మనకు సంబంధం లేని విషయమన్నట్టు' కేంద్ర మంత్రివర్యులంతా సెలవిస్తున్నారు. కన్యాశుల్కంలో అన్నట్టు.. 'అన్ని వేదాల్లోనే ఉన్నాయిష' అని వ్యాఖ్యానాలు చేస్తూ శాస్త్రజ్ఞులకు అర్థంకాని సనాతన సైన్సును కనిపెడుతున్నారు. అలాగే 2014 నుంచి ఆవు పేరిట రాజకీయాలు చేస్తున్నదెవరో, దానిని అడ్డుపెట్టుకుని అధికారంలో ఊరేగుతున్నదెవరో.. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
ఇక మోడీ రెండోసారి అధికారం చేపట్టడానికి కొద్దిరోజుల ముందే ఆటో మొబైల్ రంగంలో అమ్మకాలు తగ్గాయి (గుర్గావ్లో పలు ఆటోమొబైల్ సంస్థ లలో పనిచేసే కార్మికులు డిసెంబర్, ఫిబ్రవరిలోనే ఉద్యోగాలు కోల్పోయారని ఇటీవల ఓ ఆంగ్ల వెబ్ఛానెల్ కథనం ప్రచురించింది). ఎన్నికల మూడ్లో ఉన్న దేశం అప్పుడావిషయాన్ని అంతగా పట్టించుకోలేదు. జూన్ నుంచి ఇది తీవ్రరూపం దాల్చుతున్నది. మరోవైపు దేశ వృద్ధి రేటు వరుసగా రెండో త్రైమాసికం కూడా తాను పైకెళ్లనంటే వెళ్లనని మొండికేస్తున్నది. ఎనిమిది రంగాల్లో గతేడాది 7.3 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. ఈ ఏడాది జులై నాటికి 2.1 శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మం త్రిత్వ శాఖే వెల్లడించింది. నిరుద్యోగం, పెట్టుబడుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మం చిది. రెండు నెలలుగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ప్రధాని మాత్రం స్పందించలేదు. ఈ రెండు నెలల్లో రెండు మన్ కీ బాత్లు, పలు వేదికల మీద తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధా ని.. ఆర్టికల్ 370, దేశ సమగ్రత అంటూ 'అవే మాటలు' మార్చి మార్చి చెప్పారు. దేశాధినేత వైఖరి ఇలా ఉంటే ఇక ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రుల చేస్తున్న వ్యాఖ్యలకు నవ్వుకోవాలో.. విచా రం వ్యక్తం చేయాలో అర్థం కాని స్థితి ప్రజలది.
కేంద్ర ఆర్థికమంత్రి హౌదాలో ఉండి దేశంలో కార్లు అమ్ముడుకాకపోవడానికి కారణం మిలీని యన్లు (1981 నుంచి 1996 మధ్యలో జన్మించినవారు) ఓలా, ఊబర్లు వాడటమేననీ.. నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) కట్టడానికి వారు ఆసక్తి చూపడం లేదని నిర్మలా సీతారమన్ వ్యాఖ్యానిం చారు. జనాలు మెట్రో రైళ్లలో వెళ్తుండటం కూడా దీనికొక కారణంగా మన తెలుగింటి కోడలు సెల విచ్చారు. మాంద్యం ఉన్నదని ఒప్పుకునేందుకు ఇష్టపడని ఆమె.. పై వ్యాఖ్యలు చేసిండొచ్చని విశ్లే షకులు భావిస్తుంటే, సోషల్మీడియాలో మాత్రం ఈ విషయంపై జోకులు పేలుతున్నాయి. మిలీ నియన్లు ఊబర్, ఓలాలను వాడటమే ఆటో ఇండిస్టీకి శాపమైతే... ఈ ఏడాది జూన్లో ఎకనామిక్ టైమ్స్ వెలువరించిన సమాచారం ప్రకారం గత ఆరు నెలల కాలంలో ఆయా సంస్థల్లో రోజూవారీ రైడ్లు కేవలం నాలుగు మాత్రమే పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో ఈ రంగం లో 90 శాతం వృద్ధి కనిపించగా.. 2018 నాటికి అది 20 శాతానికి పడిపోయింది. మరి మంత్రి చెబుతున్నట్టు యువత ఊబర్, ఓలాలను వాడితే ఈ రంగంలో వృద్ధి ఎందుకు క్షీణిస్తున్నట్టో మ హామహా ఆర్థికవేత్తలకు సైతం అర్థం కావడం లేదు. దేశంలో సుమారు 40 కోట్ల మంది యువజన మే. మరి వారందరూ ఉబర్, ఓలాలు కాకుండా ఇంకేమి వాడుతున్నట్టో. అసలు యువతకు ఉద్యో గాలే కరువైనప్పుడు, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడుతున్నప్పుడు వారికి కార్లు కొనేంత శక్తి ఎక్కడిద ని కొందరి వాదన. ఇక మెట్రో రైళ్లు దేశంలోని కొన్ని చోట్ల మినహా ఇంకా చాలా రాష్ట్రాల్లో టెండర్ల దశలోనే ఉన్న విషయమూ ఆర్థిక మంత్రికి గుర్తే. ద్విచక్రవాహనాలు, కార్ల సంగతి అటుంచితే.. వాణిజ్య వాహనాల విషయంలోనూ అమ్మకాలు భారీగా పడిపోయాయి. సరుకు రవాణాలో కీలక ంగా ఉండే లారీల అమ్మకాలు 60 శాతం పడిపోగా.. ట్రక్కులు, బస్సుల విక్రయాలూ 39 శాతం మేర దిగజారాయి.
మరో మంత్రి పీయూశ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు మరింత విడ్డూరంగా ఉన్నాయి. వృద్ధిరేటు సాధించే క్రమంలో లెక్కల జో లికి వెళ్లొద్దని ఆయన చెప్పారు. ఇందుకు ఉదాహరణగా గురుత్వా కర్షణ సిద్ధాంతాన్ని కనిపె ట్టినప్పుడు ఐన్స్టీన్కు ఇలాంటి లెక్కలు ఏమాత్రం ఉపయోగపడలేదని గోయల్ సెలవిచ్చారు. అ యితే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఐన్స్టీన్ కాదనీ, ఐజాక్ న్యూటన్ అని నెటిజన్లు ట్వి ట్టర్లో ఆయనకు తలంటారు. 'సిద్ధాంతాలు, సూత్రాలు, గతకాలపు జ్ఞానర' అంటూ ఆయన ఏవే వో తత్వ బోధనలు చేసినా చర్చ న్యూటన్, ఐన్స్టీన్ల మధ్యే సాగింది. ఇటీవలే కన్ను మూసిన కేం ద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గైర్హాజరీలో ఆర్థికమంత్రి హౌ దాలో పలుమార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన గోయల్.. మాంద్యంపై మాట్లాడుతూ లెక్కల గురించి మరిచిపోండని సెలవివ్వడం నిజం గా ఆశ్చర్యమే. అయినా డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, సాపేక్ష సిద్ధాంతాన్ని (ఐన్స్టీన్ ప్రతి పాదించింది), భౌతికవాదాన్ని అడుగడుగునా వ్యతిరేకించే కాషాయ పరివారం.. గణాంకాల కోసం వారి పేరును వాడుకోవడం విడ్డూరం కాక మరేంటి.
రాబోయే ఐదేండ్లలో భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి పక్కనబెడితే ప్రస్తుతం ప తనమవుతున్న ఆర్థిక పరిస్థితి గురించి ఒప్పుకునే స్థితిలో ప్రభుత్వ పెద్దలు లేరు. ఐదు ట్రిలియన్ల సంగతి మరిచిపోండనీ, మాంద్యాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు చేపట్టండని ఆర్థిక వేత్తలు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. 'మన్మోహన్ చెప్పారా.. అయినా పాటించం' అంటూ చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై పట్టున్న ఓ ఆర్థికవేత్త సూచన లు వినడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం పెద్ద నోట్లరద్దు, జీఎ స్టీలేనని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గొంతెత్తి మొత్తుకుంటున్నా సర్కారుకు మాత్రం అవేమి పట్టడం లేదు. దేశం మాంద్యం కోరల్లో పడి చిక్కుకుంటే మోడీ మాత్రం ఇటీవల జార్ఖండ్లో నిర్వ హించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. తమ వంద రోజుల పాలన ట్రైలరేననీ, చూడాల్సిన సిని మా ముందుందని అంటున్నారు. అంటే 'దేశాన్ని మరింత మాంద్యం కోరల్లో తీసుకెళ్తారనా దానర్థం' అని సామాజిక మాధ్యమాలలోనూ నెటిజన్లు అదే విధంగా స్పందిస్తున్నారు. ఆర్థికాంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆర్టికల్ 370, పీవోకే, ఎన్నార్సీ, గోరక్షణ, జాతీయవాదాన్ని బీజేపీ ముందు కు తెస్తున్నది. ఎంత మభ్యపెట్టినా ప్రజలు తిరగబడనంత వరకేననే వాస్తవాన్ని పాలకులు గుర్తెరగాలి.
- శ్రీను మునిగాల
సెల్ : 7989660512