Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలంలో సోష ల్మీడియా అత్యంత ప్రాధాన్యతగల సమాచార మాధ్యమం. అయితే సోషల్ మీ డియాలో వాస్తవాలు ఎంతగా విస్తరిస్తున్నాయో అవాస్తవాలు కూడా అంతే వేగంగా వి స్తరిస్తున్నాయి. ఇక రాజకీయంగా అయితే సోషల్ మీడి యాను అసత్యాలు, అవాస్తవాలు, అనైతికమైన పద్ధతి లో వాడుకుంటున్నారు. అందులో బీజేపీ నాయకులు ముందు వరుసలో ఉన్నారు. మొన్నటికి మొన్న ఆర్టికల్ 370, 35ఏ రద్దు విషయంలో వారు ఎంత రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆర్టి కల్ 370 రద్దుకు ముందు దాని వల్ల దేశానికి తీరని న ష్టమనీ, దాన్ని తప్పకుండా రద్దు చె య్యాలని అబద్దాల తో నిండిన వార్తలను వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూ బ్ల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా 370 రద్దు చే సే సమయానికి ఇది మోడీ, షాల మహోన్నత చర్యగా డబ్బాలు కొట్టుకున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో మోడీ, షాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని దేశ ద్రో హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ వాట్సాప్ బ్యాచ్ దేశం మొత్తం విస్తరించి ఉంది. ఎక్కడైనా డిబేట్ జరిగితే వాట్సాప్లో వచ్చిన మెసేజ్లను బట్టే వారు మాట్లాడుతున్నారంటే వారి మేధో సంపత్తి ఎంత మూ ఢవాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాల పై సామాన్య ప్రజలకు అవగాహన లేదంటే సరే అను కోవచ్చు కానీ సాక్షాత్తు దేశ ఉపరాష్ట్రపతి కూడా 370 రద్దును సమర్థించడమే కాకుండా ఆనాడు ఆర్టికల్ 370 రద్దు చేయాలని అంబేద్కర్ కోరారని చెప్పుకొచ్చారు. అ యితే ఉపరాష్ట్రపతి ఈ సమాచారం ఒక ఆర్ఎస్ఎస్ వాది రాసిన బుక్ నుండి సేకరించి దానినే నిజమని న మ్మించే ప్రయత్నం చేశారు. ఉపరాష్ట్రపతి అంతటివారే ఇలాంటి చర్యలకు పాల్పడితే వీటికి అడ్డు కట్ట ఎలా వే యాలి? సామాన్యులకు నిజాలు ఎలా తెలుస్తాయి?. యూట్యూబ్లో ఎవరైనా బీజేపీ నాయకులు ఏదైనా వీడి యో పోస్ట్ చేస్తే అది నిజమా, అబద్దమా అని తెలుసు కు నేలోపే వందలమంది ఆ వీడియోని లైక్ చెయ్యడం, కామెంట్స్ పెట్టడం చేస్తారు. ఆ వందలమందిలో చాలా మంది బీజేపీ వారే ఉంటారు. వారంతా ప్రతీ వీడియో కు పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టి స్తుంటారు. అంటే సోషల్ మీడియాపై అసత్య ప్ర చారాల కోసం మూకుమ్మడి దాడి జరుగుతుందని అను కోవచ్చు. ఇప్పుడు ఆ మూకుమ్మడి దాడి అన్ని రాష్ట్రాల లో ఉండే సంస్కృతి, సంప్రదాయాలపై, ప్రాంతీయ మ మకారంపై జరుగుతున్నది. ఎందుకంటే అధికార అహభావంతో బీజేపీ నాయకులు సోషల్ మీడియాను అ వాస్తవాల పుట్టగా మార్చేస్తున్నారు. ఏకత్వం పేరుతో భి న్నత్వాన్ని మంట గలిపే ప్రయత్నంలో ఉన్న ఇలాంటి నాయకుల నుండి దేశానికి విముక్తి కలిగిస్తేనే సామాన్య ప్రజల బతుకులు బాగుపడతాయి. ఏ రూపంలోనైనా బీజేపీ నాయకులు పార్టీ విస్తరణే ధ్యేయంగా పనిచేస్తు న్నారు. అందుకు ప్రధానంగా సోషల్ మీడియానూ ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ వాదుల ద్వారా భారత ఆర్థిక స్థితి, శాస్త్ర సా ంకేతిక రంగాల అభివృద్ధి, విద్యా, వైద్యం, ఉపాధి వంటి విషయాలకంటే పాకిస్థాన్, హిందూత్వ, రాముడు, తీవ్ర వాదులు, ముస్లిం వంటి అంశాలే ముఖ్యంగా ప్రచారం చేస్తున్నారు. వాస్త వాలను కనబడని పాతాళంలోకి తొ క్కి అవాస్తవాలను కనబడే వాతావరణంలా చూపించడలో వాట్సాప్ నాయకులు రెచ్చిపోతున్నారు.
- వెంకట్ నాయక్