Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకూ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే సామాన్య ప్రజలు జీవనం దుర్భలంగా మారి దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. కొన్నేండ్లుగా స్థూల జాతీయోత్పత్తి రేటు పడిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ విధానాల మూలంగా వారు చెప్పిన దానికి భిన్నంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతున్నది. దీనిపై అనేకమంది మేధావులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, వామపక్షవాదులు ముందే హెచ్చరించారు. అయినా అవినీతికి అలవాటుపడ్డ పాలకపక్షాలు దేశ ప్రయోజనాలు పక్కనబెట్టి సామ్రాజ్యవాదులు, పెట్టు బడిదారులతో కుమ్మక్కై ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాల ను అతి వేగంగా అమలు చేస్తున్నారు. అందువల్లనే ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పడిపోవ చ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వృద్ధిరేటు 5.6 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడు తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకవైపు అంతర్జాతీ య మార్కెట్లో రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా క్షీణిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే మన ఎగుమతుల వల్ల వచ్చే ద్రవ్య విలువ తగ్గటమేగాక, మన దిగుమతులకు అనేక రెట్లు ఎక్కువ మోతాదులో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్బీఐ వద్దనున్న నిల్వలన్నిం టినీ ఉపయోగించినా దేశ ఆర్థిక పరిస్థితి చక్కబడదు. జనాన్ని మాయ చేసే జిమ్మిక్కే షేర్ మార్కెట్. వాస్తవంగా ఒక సంస్థ, పరిశ్రమల షేర్స్ ధర పెరగాలంటే ఆ సంస్థల ఉత్పత్తి పెరిగి, గణనీయమైన కొనుగోళ్లు, అమ్మకాలు జరగా లి. ఆ విధంగా వచ్చే లాభాల రేటు మూలంగా షేర్స్ పెరుగు దల, తగ్గుదల ఉండాలి. కానీ వాస్తవానికి అది జరగటం లేదు. ఉత్పత్తితో ప్రమేయం లేకుండా రాజకీయ నిర్ణయాల తో మాయమాటల పథకాల ప్రకటనల వల్ల వచ్చే మార్పుల తో, ప్రభావమవుతున్నట్లు నమ్మించి ప్రజలను మోసం చేస్తు న్నారు. కానీ నిరంతరం అలా మోసగించడం సాధ్యం కాదు.
మనదేశంలో పాలకులు ఇక్కడి రిలయన్స్ లాంటి కంపె నీలకు లాభాలను చేకూర్చి పెట్టడమే ధ్వేయంగా పనిచేస్తు న్నారు. చమురు, గ్యాస్ ధరలు ప్రపంచ మార్కెట్తో పోల్చితే సుమారు 3 రెట్లు అధికంగా ఉన్నాయి. వాటిని అరికడితే, ఉత్పత్తి ఖర్చు, రవాణా ఖ ర్చు తగ్గి అన్ని రకాలైన వ స్తువుల ధరలు తగ్గుతా యి. ఉత్పత్తి ఖర్చు పెరగ టానికి ముఖ్యంగా ముడి సరుకుల రవాణతోపాటు ఇంధనం, బొగ్గులాంటివి కూడా కారణం.
కాబట్టి ఇంధన ధరలను ప్రపంచ మార్కెటుకు అనుగుణంగా వెంటనే తగ్గించాలి. కానీ అవినీతి, స్వార్థ రాజకీయాలకు అలవాటుపడి సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులతో భాగస్వామ్యమైన మన పాలకులు, బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు అది ఇష్టం ఉండదు. అలాంటి చర్యలు చేపడితే సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారుల నుండి వ్యతిరేకత పెరుగుతుందని పాలకుల భయం. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఇందుకు వ్యతిరేకంగా ప్రజా సమీకరణ జరగాలి. దేశాన్ని కాపాడే ప్రత్యామ్నాయ శక్తులు అధికారంలోకి రావాలి.
- టి.కిషోర్
సెల్ : 9440725437