Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో మంచం పట్టిన ఆదిలాబాద్ గిరిజన గ్రా మాలు, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాలు అనే పేపర్ వార్తలు ప్రముఖంగా వినబడేవి. ఇప్పుడు పల్లె, పట్టణం తేడా లేదు. తెలం గాణ అంతటా విషజ్వరాలే! డెం గ్యూ, టైపాడ్, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా వంటి విష జ్వరాలతో గత రెండు నెలలుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కుటుం బంలో ఒకరైనా అనారోగ్యం పాలయ్యారంటే అతిశయో క్తికాదు. రాష్ట్రంలో 10వేల డెంగ్యూ, 3 లక్షలకుపైగా వైరల్ జ్వరాలు నమోదయ్యాయని పత్రికలు కోడై కూస్తున్నా.. ప్రతిపక్షాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతున్నా ఆరోగ్యమంత్రి పర్యటనలు తప్ప ప్రభుత్వం లో ఉలుకుపలుకు లేదు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో వచ్చినట్టు తెలంగాణలో ఫ్లడ్స్ వంటి ప్రకృతి బీభత్సవా లు ఏమి సంభవించలేదు. అయినా తెలంగాణలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నది. గత సంవత్సరం కూ డా ఇదే పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది? గతం లో ప్రభుత్వ హాస్పటల్లో సరిపోను మందులు, డాక్టర్స్, స్టాఫ్ ఉండేది. బిల్డింగ్స్ అంధవికారంగా ఉండేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చాలాచోట్ల హాస్పటల్స్ బిల్లింగ్లు నిర్మించా రు. కానీ సరిపడా డాక్టర్స్, సిబ్బంది లేరు. మందులు, పరికరాలు అందుబాటులో లేవు. దీం తో ప్రజలు అధికశాతం ప్రయివేట్ హాస్పిటల్స్కు వెళ్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న యాజమాన్యా లు జ్వరం బారిన పడిన ప్రజల నుంచి చికిత్స పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇదివరకు గర్భిణులు నార్మల్ డెలివరీలకు అవకాశం ఇవ్వకుండా ఆపరేషన్లు చేసేవారు. ప్రమాదవశాత్తు కాలో, చేయ్యో విరిగితే సిమెంట్ పట్టి సరిపోయేదానికి కూడా సర్జరీలు చేయడం చూశాం. గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా అవసరం లేని అపెండిసైటిస్ ఆపరేషన్లు. గ్యాస్ట్రిక్తో చాతి నొప్పి వచ్చి నా గుండె నొప్పి అని పేషెంట్ను ఆందోళనకు గురి చేయడం, సర్జరీ చేయడం వంటి ఘటనలు చూశాం. ఇప్పుడు డెంగ్యూ పేరిట ప్రయివేట్ హాస్పిటల్స్ దందా జరుగుతోంది. జ్వరాల మీద వ్యాపారం నిత్య సమస్య పచ్చతోరణంగా ఉంటుంది అనుకున్నారేమో! డెంగ్యూ రోగ నిర్ధారణకు ఎలిసా టెస్ట్ చేయవలసి ఉన్నా, ప్రయివేట్ హాస్పిటల్స్లో సాధారణ టెస్టులు చేసి యాంటిబయాటిక్స్ మందులు ఇస్తున్నారు.
పేదలకు సరైన తిండికి కావాల్సిన డబ్బులు లేవు. ఉపాధి లేదు. డెంగ్యూ బాధితులకు రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చే యువకుల నుంచి డాక్టర్స్ బ్లడ్ తీసుకోవ డం లేదు. చూడడానికి హెల్తీగా ఉంటారు. 20-35 సంవత్సరాల వయస్సు కలవారే. ఎందుకంటే వారిలో బ్లడ్ హెచ్పీ 10శాతంలోపే ఉంటున్నది. రాష్ట్ర ప్రజలు కేవలం జ్వరాల చికిత్స కోసమే ఈ కాలంలో కనీసం రూ.1500 కోట్లు ఖర్చు చేసి ఉంటారని ఒక అంచనా. జ్వరాల ప్రభావం దసరా పండుగ, కొత్త బట్టలు కొనుగో లుపై పడుతున్నది అంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
స్వచ్ఛభారత్ అభియాన్ క్యాంపెయిన్ 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 గాంధీజీ 150వ జయంతి నాటికి 100శాతం బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన కోసం 9కోట్ల టాయిలెట్స్ కోటి 96 లక్షల కోట్ల ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వం 80శాతం ఓడీఎఫ్కు చేరామని చెబుతున్నప్పటికీ ఆచరణలో 52శాతం దాటలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బిల్లులు రాక మధ్యలోనే నిలిచిపోయాయి. అధికారుల కాగితాల పైన ఉన్న లెక్కలు వేరు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి వేరు. సరిపడు సంఖ్యలో, పారిశుధ్య, ఆరోగ్య సిబ్బందిని నియమించలేదు. సరైన జీతాలు ఇవ్వడం లేదు. దేశంలోని చాలా రాష్ట్రాలలో ఆరోగ్య, పారిశుధ్య (హెల్త్ అండ్ ఏఎంపీ, శానిటేషన్) వ్యవస్థలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేరళలో హెల్త్ అండ్ ఏఎంపీ, శానిటేషన్ వ్యవస్థ బాగుంది. కాబట్టే గతేడాది సంభవిం చిన ప్రకృతి మహావిపత్తును కేరళ ప్రభుత్వం ఎదుర్కొని, ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకోగలిగి ంది. తెలంగాణ సమాజంలో ఈ వ్యవస్థ బాగులేదు కాబట్టే ఏ ప్రకృతి విపత్తు లేకున్నా తెలంగాణ జిల్లాలు మంచం పట్టాయి. వస్తువుల వినియోగం, ఆహార పదార్థాల వినియోగం, మల, మూత్ర విసర్జనలు మానవుని దినచర్యలో భాగంగా జరుగుతాయి. పరిసరాల పరిశుభ్రతకు శాశ్వతమైన యంత్రాంగం ఉండాలి. ప్రజలకు పౌష్టికాహారం అందాలి. అప్పుడే ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుంది.
సెల్: 94900 98857