Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదనభీతు జూచి కాలుండు నవ్వును''
అంటాడు వేమన. కానీ ఆయనను చూసి భూమి నవ్వలేదు... ధనమూ నవ్వలేదు. ఎందుకంటే జనమే తానై బతికినవాడు గనుక..! మహౌన్నత సామ్యవాద సిద్ధాంత వెలుగులో తనకు వారసత్వంగా వచ్చిన వేల ఎకరాల భూమిని తృణప్రాయంగా ప్రజాపరం చేసినవాడు గనుక..! ఇక కదనభీతికి ఆయన జీవితంలో చోటే లేదు..! కమ్యూనిస్టుగా ఆయన జీవితమే ఓ కదనరంగం...!! బతికినంత కాలం విలక్షణ మానవీయ వ్యక్తిత్వంతో నిత్య జీవనోత్సాహంతో తొణికిసలాడిన మార్క్సిస్టు మహాసాగరమతడు..!
కామ్రేడ్ సర్వదేవభట్ల రామనాథం...
శ్రామికజనాభ్యుదయానికి తన సర్వస్వాన్నీ ధారపోసిన త్యాగాల సంద్రం..!
ఉన్నత విద్యావంతుడే కాదు.. ఉన్నతాదర్శాలను నరనరాన జీర్ణించుకున్న ఉత్తమ కమ్యూనిస్టు..!
విద్యార్థిగానే విప్లవమార్గాన్నెంచుకున్నాడు. అది ఉస్మానియా విశ్వవిద్యాలయం ... ఉదయం ప్రార్థనా సమ యం... విద్యార్థులందరూ నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. కానీ దాన్ని ఛేదిస్తూ ఎ క్కడినుంచో వందేమాతర గీతం వినిపిస్తోంది.!. యూని వర్సిటీలో వందేమాతర గీతంపై నిషేధాజ్ఞలున్నాయి. అధి కారులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఎవరిదా సాహ సం అనుకుంటూ వెతకడం ప్రారంభించారు. ఆ గీతం వి నిపిస్తుంది బి హాస్టల్ నుండని కనిపెట్టి పరుగు లు తీసా రు. అయినా ఏ అదురూ బెదురూ లేకుండా ఆ హాస్టల్ గ దిలో సుమారు వందమందికి పైగా విద్యార్థులు ముక్తకం ఠంతో గీతాలాపన పూర్తిచేసాకగానీ వారివైపు తి రిగిచూ డలేదు. దీంతో రెచ్చిపోయిన అధికారులు ఆ విద్యా ర్థులం దరికీ నోటీసులిచ్చారు. ఆ సాహసానికొడిగట్టిన నాయక త్వాన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఆ బహిష్కరణకు గురైన నాయకులలో సర్వదేవభట్ల ఒకరు. దేవులపల్లి వెంకటేశ్వర్రావు మరొకరు. దాంతో ఆయన తన న్యాయశాస్త్ర అధ్యయనాన్ని నాగపూర్ యూనివర్సిటీలో పూర్తి చేయాల్సి వచ్చింది. నాగపూర్లో చదువుకునే రోజుల్లోనే ఎస్.జి.సర్దేశాయి పరిచయం ఆయనను కమ్యూనిస్టుగా మార్చింది.
కమ్యూనిస్టుగా మారిన ఆయన ఈ నేలమీద తిరిగి కాలుమోపే నాటికి దేశం మొ త్తం తెల్లదొరలతో పోరాడుతుంటే.. తెలంగా ణ నిజాం రాచరికంపై తిరగబడుతోంది. ఆంధ్ర మహాసభ వెలుగులో కమ్యూనిస్టుపార్టీ సాయు ధ పోరాటం సాగిస్తోంది. ఒకవైపు నిజాం పోలీ సులతో రజాకారు ముష్కరులతో మరోవైపు భూస్వాములైన దొరలు, జాగీర్దార్లతో హౌరాహౌరీగా తలపడుతోంది. మరో తలంపే లేకుండా ఆ భూపోరాటంలోకి దూకాడాయన!. జమిం దారీ కుటుంబంలో జన్మించిన సర్వదేవభట్ల.. పోరాటం తన ఇంటినుంచే ప్రారంభించాడు. తనకున్న రెండువేల ఎకరాలకు పైగా భూమిని ప్రజలకు పంచిపెట్టాకే మిగిలి న భూస్వాములపైకి దండెత్తాడు. సంపన్న కుటుంబంలో పుట్టి కూడా సామాన్యుల కోసం తన జీవితాన్నే ఓ యుద్ధ రంగంగా తీర్చిదిద్దుకున్న సామ్యవాద పోరాట మతడు..! సాయుధ రై తాంగ పోరుకు సరికొత్త నడకలు నేర్పిన అసమా న సాహసమతడు..!
ఎప్పుడైతే తను చది విన న్యాయశాస్త్రంలో లే ని న్యాయమూ సత్యమూ మార్క్సిజంలో ఉన్నాయ ని గ్రహించాడో అప్పటి నుంచీ ఆ సత్యానికే ని త్యం నిబద్ధుడై పరితపించాడు. పార్టీ ఆదేశాన్నందుకుని ఆ యన సింగరేణిలో అడుగు పెట్టే నాటికి కోల్బెల్టు చుట్టూ ఎటు చూసినా అన్యాయపు చీకట్లే కమ్ముకొని ఉన్నాయి. బొగ్గు బావుల్లో కార్మికులు దారుణ శ్రమదోపిడీకీ గురవు తున్నారు. నిజాం ఫ్యూడల్ దొరలను మించి బొగ్గుబాయి దొరల ఇష్టారాజ్యం నెలకొని ఉంది. ప్రభుత్వ అండదం డలతో మాఫియా రాజ్యం సాగుతోంది. ఇరుకు మురికి వాడలలో కార్మికులకు మంచినీళ్లకు కరువున్నా సారా కొట్ల కు మాత్రం కరువు లేకుండేది. నిజాం ప్రభువుల ఉదాసీన త, పోలీసుల అండదండలతో గూండాయిజం పెచ్చరిల్లి కార్మికుల బతుకులు నిత్యం భయభ్రాంతుల్లోనే..! స్త్రీల మాన, ప్రాణాలకు రక్షణ లేదు. గూండాల అరాచకాలు, హత్యల గురించిన వార్త వినని రోజే ఉండేది కాదు. అది గో అటువంటి చీకటిలోకి ఓ వేకువలా ప్రవేశించాడు సర్వ దేవభట్ల. నైజాం సర్కార్ యూనియన్ల నిర్మాణంపై తీవ్ర నిర్బంధాలు కొనసాగిస్తున్న ఆ రోజుల్లో.. కామ్రేడ్ శేషగిరి రావుతో కలసి అత్యంత రహస్యంగా తన పని ప్రారంభిం చాడు. ఓ మేడే పర్వదినాన హేమచంద్రాపురం అడవుల్లో ఓ సమావేశం ఏర్పాటుచేశాడు. కామ్రేడ్ శేషగిరిరావుతో కలిసి అతి రహస్యంగా నిర్వహించిన ఆ సమావేశానికి.. నిఘా నీడలను ఛేదించుకుని.. ఒకరికి తెలియకుండా ఒకరు రెండు వందల మంది కార్మికులు వచ్చారు..! అక్కడే తొలి ''సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్'' ఆవిర్భవించింది. సర్వదేవభట్ల రామనాథం అధ్యక్షుడిగా, డి.శేషగిరిరావు కార్యదర్శిగా అరుణపతాకమై రెపరెపలాడి ంది. 1942 ఫిబ్రవరిలో రహస్యంగా ఏర్పడిన ఈ యూని యన్ మోగించిన సైరన్ గోదావరీ అంచుల పోడవునా.. సింగరేణి గనుల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. సంఘం నీడలో అనేక పోరాటాలలో కార్మికవర్గం విజ యం సాధించింది. యాజమాన్యం దిగివచ్చింది. గూండా యిజం తోక ముడిచింది. మేడే స్ఫూర్తితో ఏర్పడిన సం ఘం అదే స్ఫూర్తితో కాంట్రాక్టు కార్మిక విధానం ఎత్తివేత, జీతాల పెంపుదల, బావిలో రక్షణ సదుపాయాలను పోరా డి సాధించుకుంది. 1945 జూన్ 16న కొత్తగూడెంలో జరిగిన మహాసభల్లో యూనియన్ బహిరంగంగా ప్రకటి ంచబడింది. నిత్య నిర్బంధాల మధ్య సర్వదేవభట్ల, శేషగిరి రావుల నాయకత్వంలోని ఈ ప్రారంభమే నేటి సింగరేణి గనికార్మికోద్యమానికి ఆది, ఆలంబన. అయితే ఆ కృషి అంతటితోనే ఆగిపోతే ఈ చరిత్ర ఇంతటితోనే ముగిసేది. కానీ అలా జరుగలేదు. సర్వదేవభట్ల, శేషగిరిరావుల నా యకత్వంలో కార్మికవర్గం కమ్యూనిస్టు చైతన్యాన్ని సంత రించుకుంది. ఆ చైతన్యమే భయం భయంగా బతికే బొగ్గు గని కార్మికులను అన్ని రకాల అణచివేతలకు, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడే వీరులుగా తీర్చిదిద్దింది. నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటానికి గెరిల్లా యోధులను తయారుచేసి అందించింది. అసలే యూనియన్ కార్యక్రమాల పట్ల అగ్రహంతో ఉన్న నైజాం ప్రభుత్వం దీనితో బెంబేలెత్తింది. తమ పోలీసు మూకలతో కామ్రేడ్ సర్వదేవభట్ల రామనాథ అంతానికి కుట్రలు ప్రారంభించింది. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు ప్రయివేటు సైన్యాల నిర్బంధం మధ్య ఆయన ఆజ్ఞాతంలో ఉండే కార్మికోద్యమ వ్యాప్తికి కృషి చేశాడు.
నగరాల్లో కార్మికోద్యమాన్ని నిర్మించాలన్న పార్టీ ఆదేశాల మేరకు చిర్రావూరితో కలిసి వరంగల్లో కార్మిక సంఘం నిర్మాణానికి పూనుకున్నారు. నిర్బంధం అంతకం తకూ తీవ్రరూపం దాల్చిన ఆ కాలంలో ఏ ఇద్దరు నాయ కులు మాట్లాడుకోవాలన్నా అర్ధరాత్రి సమావేశం కావడం తప్ప మరో దారి లేదు. అలాంటి తరుణంలో చిర్రావూరిని కలుసుకునేందుకు వెళ్తున్న రామనాథాన్ని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేసారు. కాళ్లకు చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. ఆ తరువాత చిర్రావూరినీ అరెస్టు చేసి అదే జైలులో నిర్బంధించారు.
అది వరంగల్ సెంట్రల్ జైలు.. మే ఒకటి.. తూరుపు తెలతెలవారుతుండగా ఓ బ్యారక్ తెరచుకుంది... ఎంత వేగంగా తెరుచుకుందో అంతే వేగంగా మూసుకుంది. ఆ రెప్పపాటు వ్యవధిలోనే జైలు నడిబొడ్డునుండి ఆకాశానికె గసిన అరుణపతాకం వరంగల్ నగర నలుదిక్కులనూ వెలిగించింది. క్షణాల్లో విషయం సూపరింటెండెంట్కి తెలిసింది. నిమిషాల్లో పోలీస్ పటాలామంతా కదిలింది.. వారికితోడు అదనపు రిజర్వ్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆగమేఘాల మీద స్టేట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తన బలగాలతో వచ్చి వాలాడు. అనుమానంతో ఆ బ్యారక్లో ఉన్న ముగ్గురు ఖైదీలనూ జైలు అధికారులు ఆయన దగ్గ రకు తీసుకొచ్చారు. వారితో ఆ ఆఫీసర్ మాట్లాడుతు ండగానే ఒక్కసారిగా అన్ని బ్యారక్లపై ఎర్రజెండాలు ఎగి రాయి... మేడే వర్ధిల్లాలన్న నినాదాలతో జైలు దద్దరి ల్లింది!. చేసేదేమీలేక చేష్టలుడిగిన పోలీసు పటాలం.. ఆ జెండాలను తొలగించే సరికి చీకటి పడిందిగానీ అర్ధరాత్రి దాటినా వరంగల్ నగరమంతటా అదే పెద్ద చర్చ..! ఆ పతాకావిష్కరణల సూత్రధారులూ పాత్రధారుల్లో సర్వదేవభట్ల రామనాథం ఒకరైతే మిగతా ఇద్దరు చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, మంచికంటి రాంకిషన్రావు.
1943లో ఆంధ్రమహాసభ పాలేరు పరిధిలోని చెన్నా రం గ్రామంలో నిర్వహించాలని నాయకులు భావించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి తీవ్ర కరువొచ్చింది. అప్పటికి ఖమ్మం, వరంగల్ జిల్లా పరిధిలోనే ఉండటంతో వరంగల్ జిల్లా కలెక్టర్కు శిస్తు మాఫీ చేయమని నాయకు లు వినతిపత్రం అందించారు. శిస్తులు మాఫీ చేయాలం టే రైతులెవరూ ఆంధ్రమహాసభకు వెళ్లకూడదని కలెక్టర్ షరతు విధించాడు. వెళితే శిస్తు మాఫీ చేయకపోగా కేసు లు పెడతామని ప్రభుత్వం రైతులను బెదిరించింది. అయి నా రైతులు ఆగలేదు... ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకుని మరీ ఊరువాడా ఏకమై కదిలారు. ఆంధ్రమహాసభ విజయం అందించిన స్ఫూర్తితో శిస్తుల మాఫీకై రైతులు పెద్దయెత్తున పోరాటానికి దిగడంతో చివరికి ప్రభుత్వమే దిగివచ్చి శిస్తు మాఫీ చేయక తప్పలేదు. ఈ పోరాటాన్ని ముందుండి నడిపింది కూడా సర్వదేవభట్ల రామనాథమే.
అలా ఆయన జీవితమంతా ప్రజల కోసమే..! వరం గల్ జిల్లా హసన్పర్తి శాసనసభ్యునిగా గెలుపొందినా, హన్మకొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపో యినా ప్రజలతో ఆయనది జయాపజయాలకు అతీతమైన బంధం. బతికినంత కాలం ప్రజలతో మమేకమైన బడుగు జన బాంధవుడాయన. తనకంటూ ఏమీ మిగుల్చుకో కుండా ఉన్నదంతా ప్రజలకే అర్పించి... కూతురి పెండ్లి ప్రజల సహాయంతో చేసిన త్యాగమూర్తి. చివరి రోజుల్లో ప్రజాశక్తి పత్రిక కొనుక్కోవడానికి పావలా పైసలు లేక రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లి పత్రిక చదువుకుని వచ్చిన విలువల స్ఫూర్తి. 'పత్రిక మీ ఇంటికే పంపిస్తాం.. మీరు ఈ వయసులో ఇంత కష్టపడవద్దు' అని పార్టీ సూచిస్తే... 'నా వల్ల పార్టీకి రూపాయికూడా నష్టం జరగకూడదు' అని చెప్పిన ఎర్రెర్రని కీర్తి.
ఓరుగల్లుకు పోరు కాంతులద్దిన సింధూరం..!
ఖమ్మం కమ్యూనిస్టు మాగాణంలో విరిసిన మందారం..!
మానుకోట తాలూకా పిండిప్రోలులో జన్మించి.. వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమమై విస్తరించిన విప్లవ జీవితం..!!! 'మనిషి ఆస్తిలోకెల్లా ప్రియమైనదీ విలువైనదీ జీవితమే. అటువంటి జీవితం మనిషికి ఒకేసారి లభిస్తుంది. ఆ ఒక్క జీవితాన్నీ మానవజాతి విముక్తి కోసం వినియోగించానని సంతృప్తి చెందగల జీవితాన్ని మానవుడు గడపాలి' అన్న లెనిన్ మహాశయుడి మాటలకు నిలువెత్తు రూపం సర్వదేవభట్ల రామనాథం. కొన్ని జ్ఞాపకాలు మనకు నిట్టూర్పులు...! మరికొన్ని జ్ఞాపకాలు మధురానుభూతులు...! కానీ ఆయన జ్ఞాపకాలు నిత్య చైతన్య దీపికలు. నిరంతర ఉత్తేజాలు.. ఊహ తెలిసిన నాటి నుంచీ ఉద్యమాల దారుల్లోనే సాగిన ప్రయాణమాయనది. నిత్య పోరాటమై వెలిగిన జీవితమాయనది. కష్టాలకు వెరవని ధీరత్వంతో, కమ్యూనిజమై ప్రకాశించే వ్యక్తిత్వంతో ఈ నేలకు గర్వకారణమై నిలిచాడు సర్వదేవభట్ల.
సెల్ : 8897765417