Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ పార్టీని నమ్మినా ఏమున్నది ప్రయోజనం?. మన సమస్యలను ఎవరూ పట్టించుకోరు. ఎన్నికలప్పుడు హామీలివ్వడమే తప్ప చేసేదేముండదు. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతారు. ఆ తర్వాత కలుద్దామన్నా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఇలాంటి వాళ్లకు మనం ఓటు వేయడం అవసరమా?. వద్దే ... వద్దు... నోటాకు ఓటు వేసి నిరసన తెలుపుదాం. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తున్నారు కదా.. అందులో మన డిమాండ్లను కూడా రాసి స్లిప్పులో వేస్తే సరి. ఇది సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ. ఆయా కేడర్ల ఉద్యోగులు, ముఖ్యంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో నెలకొన్న నైరాశ్యానికి దర్పణం. దీర్ఘకాలంగా తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో మున్సిపల్ ఎన్నికలను మార్గంగా నిరసన తెలిపితే ఎలా ఉంటుందనే చర్చ సాగిస్తున్నారు. నోటాకు ఓటేస్తేనన్న ప్రభుత్వం దిగి వస్తుందేమో అని ఆశిస్తున్నారు.
- ప్రియకుమార్