Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్కటి ఓ రాజు గుర్కబెట్టి నిద్రబోతుండగా సడన్గ మెల్కబుట్టింది. ఏం సమజ్గాలే. జెరచేపు జుట్టుబీక్కుండు. గంతల్నే పులి పాలు తాగాలనే కోరిక బుట్టింది. అప్పటికప్పుడు సైనికులను, సేవకులను, అందర్నీ పిల్చిండు. తెల్లారేసరికి నాకు పులిపాలు తెచ్చిపెట్టాలని ఆర్డరేసిండు. ఒకలి మొకాన ఒకలు గుడ్లు ఎల్లబెట్టి జూసుకున్నరు. ఏం తోచక తలలు బట్టుకున్నరు. ఉరుకులాడ బట్టిండ్రు. అసలు పులికాడ్కి పోయేటోడెవడు? పాలుపితికి దెచ్చే మొనగాడెవరు? రాజు కోరిక తీర్చే గడ్సున్నోడెవరు అనుకున్నరేగానీ ఎవ్వరూ దిమాక్బెట్టి ఆలోచించలే. తెల్లారింది. ఐదు..ఆరు.. ఏడు...ఎనిమిది అవుతున్నది. పాలెవ్వరూ తేలే. రాజుకేమో కోపం నసాలానికెక్కుతున్నది. చిర్రుబిర్రులాడుతున్నడు. గప్పుడే ఓ పోరడు బర్రెపాలు పిండుకుని దెచ్చి రాజుకిచ్చిండు. గీడ్రా మొనగాడంటే అంటూ కితాబిచ్చుకుంట పాలుతాగిండు. గా పాలు పిండేటప్పుడు జూసినోళ్లు కూడా...నిజం జెప్పితే రాజు ఎక్కడ మమ్ముల్ని చంపుతడో? రాజ్యంల నుంచి తరిమేస్తడో అని గమ్ముగ ఉన్నరు. గా పోరడ్కి సప్పట్లు గొట్టిరు. అందరూ సప్పట్లు గొట్టేసరికి అబద్ధం నిజమైపోయింది. రాజేమో తన రాజ్యం గొప్పతనాన్ని పక్కరాజ్యాలకు జెప్పబట్టిండు. గీ కథ లెక్కనే తెలంగానల పరిస్థితి మక్కీకి మక్కీలా ఉన్నది. హరితహారం ఎట్లా ఉన్నది? ఓ చెట్లు పెరిగి కొత్త అడవులే పుట్టుకొచ్చినరు.. పల్లెప్రగతి ఎట్లాగున్నదంటే..? ఊర్లన్నీ ధగధగలాడిపోతున్నరు.. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండి నీళ్లతోని కళకళలాడుతున్నరు.. చేపలు దుముకుతున్నరు.. మిషన్ భగీరథతోని ఆడబిడ్డలు నడుసుడు తప్పింది.. ఇంటింటికీ నల్లా నీళ్లొస్తున్నరు.. జీతాల్లేక కార్మికులు ఎన్ని బాధలు పడ్తేనేమి పరిశ్రమల యాజమాన్యాలు మస్తుగున్నరు... అంటూ మంత్రు లంతా సార్ చుట్టూ చేరి చెబుతుంటే...అబద్ధాలన్నీ నిజమైపోయి...ఆహౌ..ఓహౌ అంటూ పెద్దసారు కితాబివ్వడం పరిపాటైంది. అబద్ధాలన్నీ బద్ధలైన ప్పుడు రాజ్యం పేకమేడలా కూలిపోవడం ఖాయం.
- అచ్చిన ప్రశాంత్