Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మార్గాన్ని దాటేవాడు స మర్ధుడు.. మార్గం చూపేవాడు నాయకుడు' అంటారు పెద్దలు. సృష్టి పుట్టినప్పటి నుండి నాయకత్వం కోసం ఏదో మార్గంలో పోరాటం జరుగుతూనే ఉంది. సహ జ నాయకత్వ లక్షణాలతో ప్రజల మ ధ్య పుట్టి, ప్రజలలో మమేకమై వారిచే నాయకులుగా ఎన్నుకోబడ్డవాడు నిజ మైన నాయకుడిగా పిలవబడతాడు. కానీ వ్యాపార వారసత్వంలా, రాజ కీయ వారసత్వం ఈ రోజు దేశ రాజ కీయాలలో పరిపాటిగా మారింది. వందల సంవత్సరాల క్రి తం ప్రారంభమైన పార్టీలు మొదలు నిన్న మొన్న పుట్టిన ప్రా ంతీయ పార్టీల వరకు 'వారసత్వాన్ని' ఆలంబనగా చేసుకుని నడుస్తున్నాయి. దీనిలో సమర్ధతకు, ప్రజా సంక్షేమా భిలాషణలకు తావు ఉండ టం లేదు. ఇది దేశానికి అ త్యంత విషాదాన్ని మిగులు స్తోంది. మహాత్మాగాంధీ చె ప్పినట్టు.. నీ చేతల వల్ల ఎ లాంటి ఫలితాలు వస్తా యో నీకు తెలియదు కాని, నువ్వేమీ చేయకపోతే ఎలా ంటి ఫలితాలు రావు. ప్రజా సంక్షేమం కోసం చేసే ఏ పనైనా సత్ఫలితాన్ని ఇస్తుం ది. దానినుండే నాయకత్వానికి పరిపూర్ణత వస్తుంది.
నాయకత్వం అంటే దారి పొడవునా నడవటం కాదు.. బాట వెయ్యటం.. తోవ చూపటం. అభివృద్ధి వైపుగా ప్రాం తాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించగలిగే దూరదృష్టి, నిబద్ధ త, నిజాయితీ, నైతిక విలువలు ఉన్నవాడే నాయకుడిగా పి లవుబడతాడు. కీర్తింపబడతాడు. కాని, 30 సంవత్సరాలుగా దేశ రాజకీయ వ్యవస్థ కులం, మతం, ప్రాంతం, వర్గం ము ఖ్యంగా ధనం మీద ఆధారపడి నడుస్తోంది. బహిరంగంగా మద్యం, ధనం పంపిణీ చేస్తూ ఎన్నికల భారతాన్ని అపహా స్యం చేస్తున్న తీరు గర్హనీయం. రోజురోజుకీ నాయకులకు ప్ర జలకు మధ్య దూరం పెరుగుతోంది. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించిన నాయకులు గెలుపు అనంతరం అదే ప్రజలకు కనీసం దర్శన భాగ్యం ఇవ్వకపోవడం, సమస్య పట్ల ఏ మా త్రం స్పందించకపోవడంతో అసలు ఎవరికి తమ కష్టాలు, బాధలు చెప్పుకోవాలో తెలియక ఎందుకు ఓట్లు వేసామా అ నే బాధను వ్యక్తం చేస్తున్న స్థితి. ఎన్నికలంటే వెగటు కలిగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా డబ్బుకు ప్రజలు 'ఓటు' అ మ్ముకునే స్థితి, నాయకులు కొనుగోలు చేసే పరిస్థితి దాపురి ంచింది. 1947 నుండి ప్రారంభమైన భారతదేశ రాజకీయ ప్రస్థానం సచ్చీల, సౌశీల్య, నిజాయితీ గల నాయక గణం ని స్వార్ధ సేవాతత్పరత నుండి ఈరోజు ఏ స్థితికి వచ్చిందో సు స్పష్టం. మహాత్మా గాంధీ, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ది గంతుల చేతనను చూసిన దేశం సమకాలిన రాజకీయాలలో అరుదైన నాయకుల కోసం తపించవలసి వస్తుంది. ఇదిలా కొనసాగితే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేయాలేమో అన్న భావనకు యువత వచ్చేస్తుంది. ఇది ఆత్మహత్యా సదృశ్యం.
నాయకులారా! ప్రజలారా! ఓటరులారా! త్వరితగతిన ఈ స్థితికి చరమగీతం పాడండి. 'ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క' అనే రాజ్యాంగ స్ఫూర్తి మీలో నింపుకోండి. నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు. బాధ్యత తీసుకుం టే ఓడిపోవు అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలు గుర్తు చే సుకోవాలి. నాయకత్వమంటే బాధ్యత. తనను గెలిపించిన వారిపట్ల కృతజ్ఞత. గెలవటానికి కావలసింది నాయకుని పట్ల ప్రజలకుండే అభిమానం, నమ్మకం తమకు సేవ చేయ గలడనే విశ్వాసం. ఇవి మాత్రమే ఒక నాయకున్ని గుర్తించే అంశాలు. కాని, దురదృ ష్టవశాత్తూ ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ వ్యవస్థ దేశం లో వేళ్లూనుకుంటుం దేమో అన్న భావన కలు గుతోంది. ఆర్థిక, రాజకీ య అండదండలు లేకు ండా సామాన్యులెవరూ రాజకీయ రంగంలో అడు గుపెట్టే పరిస్థితి లేదంటే అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో ముగిసిన పురపాలక ఎన్నికలు కూడా పై పరిస్థితులకు అతీతమై నవి కావు. కులాల రిజర్వేషన్ల తో మొదలై వివిధ దశలలో ఎ న్నికల తీరు ఆందోళన కలిగిస్తో ంది. పని మొదలు పెడితే ఆప వద్దు.. మధ్యలో వదలిపెట్టవ ద్దు.. ఫలితం గురించి ఆలోచి ంచకుండా పని పూర్తి చేయడ మే మనిషి పని అని చాణుక్యు డు చెప్పారు. అసలు సేవకుడి గా ఉండాల్సిన వ్యక్తి ప్రజాసే వ అనే అసలు పని వదలిపెట్టి స్వా ర్ధం అనే ఫలితం కోసం మాత్రమే రాజకీయ నాయకు లు ప్రభుత్వ పాలనలోకి అడు గుపెట్టడం వల్ల సంక్షేమం అనే ది మృగ్యమవుతోంది. దీనిని మార్చాల్సింది ప్రజల చైతన్యమే.
- అట్లూరి వెంకటరమణ
సెల్ : 9550776152