Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారతదేశంలో 'భారతదేశం నా మాతృభూమి' అనే ప్రతిజ్ఞ ద్వారా కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతనూ, సమగ్ర తనూ చాటిన తెలుగు తేజం పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారత స్వతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం అనే పాట ఎలా భారతీయుల్లో దేశభక్తిని, స్వతం త్య్ర కాంక్షను పెంచిందో స్వతంత్య్రానంతరం పైడిమర్రి భారత జాతీయ ప్రతిజ్ఞ భారతీయుల ఐక్యతను, దేశభక్తిని, జాతీయతను భవిష్యత్ తరాలకు చాటేలా ఉంది. 10 జూన్ 1916లో నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించిన పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో ఉద్యోగం చేశాడు. పుస్తక పఠనం, పుస్తక సేకరణ, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెట్టిచాకిరీ, భూస్వా మ్య వ్యవస్థపై పలు రచనలు చేశారు. ఆయన తన 18వ ఏటనే 'కాలభైరవుడు' పేరున చిన్న నవల రాశారు. 1945లోనే 'ఉషస్సు కథలు' సంపుటిని రచించి తొలితరం కథా రచయితగా నిలిచారు. దేవద త్తుడు, తులసీదాస్, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, స్త్రీ ధర్మం, ఫిర దౌసి, శ్రీమతి అనే నాటకాలు రాశాడు. అనేక అనువాద రచనలు చేశారు. 1945-46లో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలో ప్రముఖ పాత్ర వహించారు.'భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహౌదరులు, నేను నా దేశమును ప్రేమి ంచుచున్నాను'' అంటూ సాగే ప్రతిజ్ఞ నేడు దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలోని పసిహృదయాలలో గుండెల నిండా దేశభక్తిని పాదుకొల్పుతు న్నది. ఈ ప్రతిజ్ఞ 1962లో పైడిమర్రి కలం నుండి పురుడు పోసుకు న్నది. ఆ రచనను చదివి ఉప్పొంగి న సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లి ప్రతిజ్ఞ ఔన్న త్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తరువాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్ర విద్యా సల హా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించారు. 26జనవరి 1965న ఆమోదించిన నాటి నుంచి ప్రతి పాఠశాలలో ఈ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలై నేటికీ 55 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. భారతదేశ జాతీయ సమైక్యతను తెలియజేసే ప్రతి జ్ఞ రచయిత పేరు తగిన ప్రాచుర్యంలో లేకపోవడం పెద్ద చారిత్రక తప్పిదంగా నేటి తరం రచయితలు, మేధావులు పరిగణించారు. దీన్ని మొద టగా గుర్తించిన ఎలికట్టి శంకర్రావు 2011లో ఒక మహనీయుడి మూలాలను ప్రపంచానికి తెలియజే యాలని కొంతమంది తెలంగాణ సాహితీ మిత్రులతో కలిసి 'ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి' అనే పేరుతో ఒ క ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకా లలో ముద్రింపచేయాలని 'ఉత్తరాం ధ్ర రక్షణ', 'తెన్నేటి ఫౌండేషన్' ప్రయత్నించాయి. ఈ పరంపర కొన సాగుతున్న తరుణంలో జన విజ్ఞాన వేదిక అనే ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థ ప్రతిజ్ఞ అంశాన్ని తమ భుజస్క ంధాలపై వేసుకుని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ జిల్లాల లో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగా హన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడి న కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. ఎట్టకేలకు జనవిజ్ఞాన వేదిక, పలు అభ్యుదయవాదుల కృషి ఫలించి తెలుగు రాష్ట్రాల్లో నూతనం గా ముద్రించిన పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చారు. పైడిమర్రి వెంకట సుబ్బారా వు జీవిత చరిత్రను 'భారతదేశం నా మాతృ భూమి' పేరుతో ఆంగ్ల లో 'దీ పార్గాటెన్ పేట్రియాట్' పేరు తో రాసి పైడిమర్రి గొప్పదనాన్ని పాఠకులకు తెలియజేశారు.
- సంపతి రమేష్
సెల్ : 9959556367