Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశయం గొప్పదైనప్పుడు ఆలోచనలూ గొప్పగానే ఉంటాయి!! ఆశయానికి ఆలోచనలు తోడైతే నడిచే దారుల్లో విప్లవమెప్పుడూ వెన్ను తడుతూనే ఉంటుంది. అప్పుడు ప్రతి దారీ ఓ ఉద్యమ రహదారే!! ప్రతి మనిషీ ఓ విప్లవ బాట సారే!!! అలా నడిచినంత దూరం బతుకంతా పోరు మందారాలను పూయించిన వాడు చల్లా సీతారాంరెడ్డి. మిర్యాలగూడ తాలూకా రావులపెంట గ్రామంలో 1918 ఫిబ్రవరి 6న జన్మించిన సీతారాంరెడ్డి, ధనిక రైతు కుటుంబానికి చెందిన చల్లా అప్పారెడ్డి, అచ్చమ్మ దంపతుల ఎనిమిదిమంది సంతానంలో మూడవవాడు. మేనమామ ఊరైన మునగాల మండలం రేపాలలో 3వ తరగతి, స్వగ్రామం పక్క నున్న ఆగామోత్కుర్లో 5వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో ప్రాథమిక విద్యా భ్యాసం పూర్తిచేసాడు. బాగా చదువుతున్నాడని 5వ తరగతి పూర్తికాకుండానే 6వ తరగతి కోసం సూర్యాపేటలో చేర్పించారు. 7వ తరగతి వరకు సూర్యాపేటలో, 8 నుండి10వ తరగతివరకు నల్గొండలో చదివాడు. నల్గొండలో చదువుతున్నప్పుడు తన గ్రామం నుండి ఇందుగుల మీదుగా దాదాపు 25 కిలోమీటర్లు నడిచి నల్గొండ చేరేవారంటే ఆయనకు చదువంటే ఎంత ఆసక్తో అర్థం చేసుకోవచ్చు. చదువొక్కటే కాదు, సామాజిక రాజకీయాంశాలన్నా ఆయనకు ఆసక్తి. అందుచేతనే ఆయన విద్యార్థిగానే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నాడు. నల్గొండలో చదువుతున్నప్పుడే ఒకసారి సమ్మెలో పాల్గొన్నందుకు స్కూల్ నుండి తీసేయాలని నిర్ణయం జరిగినా, ప్రతిభావంతుడిగా అందరి మన్ననలు పొందినవాడు గనుక పైఅధికారుల జోక్యంతో చదువు పూర్తి చేసుకోగలిగాడు.
నల్గొండలో చదువుతున్న ప్పుడే ఆర్యసమాజం సమావేశాల కు హాజరవడం వల్ల ఆర్యసమాజ మంటే అభిమానం ఏర్పడి అందు లో చేరాడు. ఆ తర్వాత కాంగ్రెసు లో, సుభాస్ చంద్రబోస్ నాయక త్వంలో ఉన్నప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ తో ఉండేవాడు. 1936లో అంటే 18 ఏండ్ల వయసులో అమ్మ నవ ల, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో చదవ డంతో భవిష్యత్తు బాటలన్ని మారి పోయాయి. గమ్యం తెలిసింది.. గ మనం తెలిసింది... అప్పటినుండి భుజాన ఎర్రజెండా అతని ఎజెండాగా మారిపోయింది!! 1939లో చౌటుప్పల్ మండలం తంగళ్లపల్లి గ్రామంలో మొదటిసారిగా ఉపాధ్యాయునిగా చేరి, ఆ తరువాత మిర్యాలగూడ, సూర్యాపేటలో తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించినా మనసంతా మరో ప్రపంచానికి దారులేసే మార్క్సిజం వైపే! సూర్యాపేటలో చదువుతున్నప్పుడే అనేక ఉద్యమ పత్రికలు తెప్పించుకొని చదివేవాడు. పార్టీతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 1942లో దేవులపల్లి వచ్చి పార్టీ సభ్యత్వం ఇవ్వ డంతో తాను చేసే పనికి ఒక నిర్మాణ స్వరూపం వచ్చింది. చుట్టూ ఉద్యమం ఉన్న ప్పుడు కమ్యూనిస్టు చైతన్యమున్న మనిషి కండ్లుమూసుకొని కూర్చోలేడు కదా?! ఉద్యోగంలో కొనసాగుతూనే కమ్యూనిస్టుగా రహస్య కృషి ప్రారంభించాడు. 1944లో విజయవాడలో జరిగిన రైతు మహాసభలకు ప్రతినిధిగా వెళ్లాడు.
ఒకపక్క ఉద్యోగం.. ఇంకోపక ఉద్యమం.. చుట్టూ పోలీసుల నిఘా! జాగ్రత్త గా మసలుకుంటే ఉద్యోగం చేసుకుంటూనే ఉద్యమానికి తోడ్పడవచ్చు. కానీ అదం త సులభంగా తోచలేదు.. తన ముందు రెండు దారులు. ఒక దారిలో మంచి ఉ పాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉత్తమ పౌరులను తయారు చేయ వచ్చు. ఇందులో ఏ కష్టమూ లేదు కూడా. ఇంకో దారిలో సమాజానికే ఉపాధ్యా యుడై ఓ సుందర లోకాన్నే సృష్టించవచ్చు. కానీ ఇందులో అడుగడుగునా కష్టాల సుడిగుండాలే.. నిరంతరం వెన్నాడే ప్రమాదాలే.. విప్లవం ఎప్పుడూ పూల పాన్పు కాదు కదా!? అయినా ఆ కష్టాల కడలిలో ఈదడానికే తన అడుగులను ముందు కేసాడు. 1946లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు... అది సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలం.. రహస్య జీవితాన్నే పూలమాల గా ధరించి తానే ఒక ఆయుధమై అడవిబాట పట్టాడు. మునగాల ప్రాంతంలో తన పనిని ప్రారంభించాడు. అక్కడ తాత పర్తి వెంకటేశ్వరరావు అనే పార్టీ ఆర్గనైజ ర్ ఇతన్ని నడిగూడెం మండలం రామాపురానికి గెరిల్లా శిక్షణ కోసం పంపించాడు. దళ కమాండర్గా అనిరెడ్డి వెంకట్రెడ్డి ఉండేవాడు. ఆ శిక్షణకు దేవులపల్లి, దొడ్డా నర్సయ్య, ఓంకార్ వచ్చారు. శిక్షణ అనంతరం ఇతన్ని ఆర్గనైజర్గా నియమించా రు. కొత్త బాధ్యతలు నెత్తికెత్తుకున్న సీతారాంరెడ్డి.. మిర్యాలగూడ తాలూకాలోని అడవిదేవులపల్లి, కన్నెకల్లు, రాజారం, కొంపల్లి, వెంగన్నగూడెం, వెంపాడు తదితర అనేక గ్రామాలకు ఉద్యమాన్ని విస్తరింపజేసాడు. రాజవరం దొర వల్లభరెడ్డి భూములను దళంతో వెళ్లి పంచాడు. అనేక గడీలపై దాడులు చేసి విత్తనాలను పంచాడు. బంచరాయి, కౌలు భూముల పోరాటం చేసి కొన్ని వేల ఎకరాలను ప్రజలపరం చేసాడు. యలమంద నాయకత్వంలో వెంగన్నగూడెం దొర రామానుజంరెడ్డి తుపాకీతోపాటే గరిసెల్లోని ధాన్యాన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కాలంలో ఉప్పు దొరికేది కాదు. ధాన్యంతోపాటే ఉప్పునూ బండ్లకెత్తి ప్రతి ఇంటికి ఒక తవ్వెడు ఉప్పునూ పంచి ఇచ్చారు. నైజాం సైన్యం వెన్నాడుతున్నా తన ప్రతీ కదలికను అత్యంత జాగ్రత్తగా ఉద్యమ విస్తరణకు వినియోగించాడు. ప్రతి పల్లెనూ ఒక పోరాటకేంద్రంగా తీర్చిదిద్దాడు.
ఎక్కువకాలం నెల్లికల్లు చిట్టడవి ఆయన రహస్య స్థావరం. దాని చుట్టూ ఉన్న నందికొండ, చింతలపాలెం, చలకుర్తి, ఏళ్లాపురం గ్రామాల్లో పోలీసు క్యాంపులు. చుట్టూ పోలీసులున్నా సీతారాంరెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ప్రజలు. పోలీసు యాక్షన్ మొదలయ్యాక గాలింపు విస్తృతమైంది. ఇతను, ఓంకార్, అరిబండి లక్ష్మీ నారాయణ కలిసి ఒక దళంగా కొద్దీ కాలమున్నారు. వీరు కృష్ణానది అవతలి ఒడ్డునున్న తాళ్లపల్లి గ్రామానికీ ఇవతలి ఒ డ్డునున్న లంబాడీ తండాలకూ పదేపదే స్థావరాలు మారుస్తూ ఉండేవారు. రాజ్యంతో పోరాడడం ఎప్పుడూ అంత సులభం కాదు. సీతారాం రెడ్డిని పట్టుకోవాలని పైన విమానాలతో చక్కర్లు.. చుట్టూ మోహరించిన పోలీసు లు... ఎప్పుడు ఏమవుతుందో తెలియదు...ఈ క్షణమే తప్ప రేపటికి భరోసా లేని కాలంలో, చావు అంచుల్లో నిలబడి విప్లవాన్ని కలగనడం మామూలుగా సాధ్యమే నా?? కానే కాదు. మదినిండా మార్క్సిజాన్ని నింపుకొని, సాగే గాలికే ఊసులు చెప్పి ఉద్యమాన్ని నిర్మించగల చైతన్యమివ్వడం. వ్యక్తిగానే కాదు...తన చుట్టూ ఉన్న వారికి కూడా నిరంతరం మృత్యువును ముద్దుపెట్టుకోవడమే. అందుకే త్యాగమెప్పుడూ ఒంటరిగా ఉండదు.
1950లో సుందరయ్యగారు నాగేశ్వరరావు పేరుతో నల్లమల అడవుల్లో దళాలతో సమావేశమవుతున్నాడు. చుట్టూరా పోలీసులు మోహరింపు. దళాలకు భోజనానికి బియ్యం లేని పరిస్థితి...ప్రజలు పోలీసులను తప్పించుకొని వచ్చి బియ్య మిచ్చే పరిస్థితి లేదు..అలాంటి సమయంలో.. పోలీసులకు చిక్కకుండా గ్రామంలోకెళ్లి బియ్యం ఎవరు తెస్తారన్నప్పుడు నేనున్నానని లేచాడు సీతారాంరెడ్డి. మారు వేషంలో పోలీసులను ఏమార్చి కొన్ని గంటల్లోనే స్థానికుల సహాయంతో బియ్యం తోపాటే వంట సరుకులన్నీ తెచ్చాడు. అతని సాహసానికీ, చాకచక్యానికి ముచ్చట పడ్డ సుందరయ్య..'అసాధ్యుడివి కామ్రేడ్' అని భుజం తట్టినపుడు అతని ఆనందా నికి అవధుల్లేవు. ఈ ఒక్క సంఘటన చాలు, అనుకున్న పనిని సాధించడంలో ఆ యన ఎంత దిట్టో తెలుసుకోవడానికి. 1951లో పోరాట విరమణానంతరం 1952లో అరెస్ట్ చేసిన పోలీసులు 6 కేసులలో ఇరికించారు. అన్ని కేసులు కొట్టేసి నా, మొలకపట్నం భూస్వామి నిద్రిస్తున్నప్పుడు అతని ముఖంపై ఉన్న బట్టను ఇతను తొలిగించగా, గుంటి వెంకటనర్సయ్య తుపాకీతో కాల్చినట్లు కేసు నమోదు చేయగా, నల్గొండ సెషన్స్ జడ్జి ఇతనికి, గుంటి వెంకట నర్సయ్యకు ఉరిశిక్ష విధిం చారు. 18 నెలలు అంటే 1952 నుండి 1954 వరకు జైలులో ఉన్నాడు. న్యాయ వాది మనోహర్ జానకిరాములు తీవ్ర కృషి వల్ల హైకోర్టు శిక్షను రద్దు చేసింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఒ క హౌదాను కల్పించడం ప్రజల్లో మనం చూస్తున్నదే. పోరాట విరమణ తర్వాత సీతారాంరెడ్డికి అట్లాంటి అవకాశమే వచ్చింది. మిర్యాలగూడ నియోజకవర్గానికి 1957లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఇతన్ని కోరింది. ఆ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని తెలుసు.... నిలబడితే గెలుస్తాడని తెలుసు. సరేనంటే ఎమ్మెల్యే అవుతాడు. కానీ మరొకరికి ఆ అవకాశమివ్వమని పార్టీకి చెప్పి, పీడీఎఫ్ తరుపున సి.వెంకట్రెడ్డిని నిలబెట్టి గెలిపించాడు. పిల్లలను పెద్దోళ్లను చేసి ఎదిగితే చూసి మురిసే తండ్రిలాగ... పెంచిన చెట్లు విరగ్గాసినప్పుడు మురిసిన రైతులాగా.. తను బతుకంతా మోసిన ఎర్రజెండా జనం చేతుల్లో ఎగురుతుంటే తానూ ఒక జెండై మెరిసిపోయాడు... బతుకంతా మురిసిపోయాడు. 1954లో మిర్యాలగూడ తాలూకా కార్యదర్శిగా, 1964 నుండి సీపీఎం నల్గొండ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రాష్ట్ర నేతగా జీవితకాలం సేవలందించాడు. 1954 నుండి 1970 వరకు గ్రామ సర్పంచ్గా, 1959లో మిర్యాలగూడ సమితి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఏ పదవిలో ఉన్నా పార్లమెం టరీ భ్రమలకు లోనుకాకుండా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ చరణలో పెడుతూ ఉద్యమ ప్రతి మలుపులో తనో మైలురాయిలా నిలిచాడు.
అధికారం ప్రజల కోసమంటూ పోరాటా లు నిర్మించి బాబాసాహెబ్పేట, అడవి దేవులపల్లిలో 100 ఎకరాల తరి భూమి, 1200 ఎకరాల మెట్ట భూ మి ప్రజలకు చెందేలా పోరాడి సాధి ంచాడు. కాలికి బలపం కట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగాడు. సాయుధ పోరాటం తర్వాత జరిగిన కౌలుదారి పోరాటాల్లో 1955నుంచి 59వరకు జరిగిన ఈ పోరాటమే అతి పెద్దది. కౌలుదారీ చట్టం అమలు కోసం ఆ యన చేసిన నిర్విరామ కృషి.. పెద్ద దేవులపల్లి, అడవిదేవులపల్లిలో కొన్ని వందల ఎకరాల అటవీ భూములు, బంజరు భూములు ప్రజల చేతు ల్లోకి చేర్చింది. నిజాం పోయినా, దేశానికి స్వతంత్రం వచ్చినా పోరాట యోధులకు నిర్బంధాలు తప్పలేదు. చైనా యుద్ధం నేపథ్యంలో 1965లో మరోసారి అరెస్ట్ చేసి 1966 మార్చి వరకు ఆయనను జైలులో ఉంచింది ప్రభుత్వం. కొన్ని సంఘటనలు ఒక మని షిని అంచనా కట్టడానికి.. వచ్చే తరం విలువలు నేర్చుకోవడానికి పాఠాలవు తాయి. సీతారాంరెడ్డి తన జీవితాన్ని రాసుకున్న తీరు అతను ఎంత సున్నిత హృద యుడో తెలియజేస్తుంది. ఇతను సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఇతనితో కలి సి పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులు మిర్యాలగూడ సమితి దగ్గరకు వచ్చినప్పుడు, వారితో మనసు విప్పి మాట్లాడి, కనీసం టీ కూడా ఇవ్వలేకపోయానని, జైలులో ఉన్నప్పుడు సహాయం చేసిన నారాయణరెడ్డిని కలవలేకపోయానని బతుకంతా బాధపడ్డాడు. ఇవి మనకు చిన్న విషయాలుగానే కనిపించవచ్చు... కలవడానికి వచ్చిన ఆ ఉపాధ్యాయ మిత్రులు కానీ, సహాయం చేసిన వారు కానీ మర్చిపోయి ఉండొచ్చు... కానీ ఆయన మాత్రం అందుకు బతుకంతా బాధపడ్డాడు.
1962, 1967లో రెండుసార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డా కొద్ది ఓట్ల తేడాతో ఓడి పోయాడు. ఆయన దశాబ్దాల రాజకీయ జీవితంలో జీవిత సహచరిణిగా ఆది లక్ష్మమ్మ ప్రతి అడుగులో తోడు నీడగా ఉందే తప్ప ఎప్పుడూ ఆటంకమవ్వలేదు. వీరి కుటంబ సభ్యులను కలిసినప్పుడు, భార్య చల్లా ఆదిలక్ష్మమ్మ గారు, పిల్లలు అప్పారెడ్డి, రంగారెడ్డి, చంద్రారెడ్డి, వసుంధర, అరుణ, చంద్రకళలు సీతారాంరెడ్డి గురించి, వారు నేర్పిన జీవిత విలువల గురించి ఎంత ఆత్మీయంగా తమ అను భవాలను పంచుకున్నారో ...!! తండ్రి ఏం సంపాదించాడని గొడవపడుతున్న పా డు కాలంలో.. ఆయన ఆశయాల దారుల్లో సాగుతున్న పిల్లలుండడం అతని తర్ఫీ దు గొప్పతనం..! ఆ కుటుంబ సభ్యుల మంచితనం!! జీవితాన్ని నిర్దేశించుకునే టపుడు.. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సన్నటి సరళరేఖే అడ్డముంటుంది. ఆ రేఖపై నిలబడి తీసుకున్న నిర్ణయమే ఆ మనిషిని కాలపరీక్షకు గురిచేస్తుంది. ఆ కాలపరీక్షకు నిలిచినవాడు కనుకనే విలువల కాగితాల మీద సీతారాంరెడ్డి అనే అక్షరాలు గీటురాయిగా నిల్చిపోయాయి.. ఓ చరిత్రగా మిగిలిపోయాయి!!
- స్ఫూర్తి
సెల్ : 9490098694