Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలోనే 2వ పెద్ద యూనివ ర్సిటీగా ఉన్న వరంగల్ కాకతీయ యూని వర్సిటీ (కేయూ) ఎంతోమంది మేధావులను అందిం చింది. 1976లో ఏర్పడిన కేయూ చరిత్ర దేశ నలుమూలలా విస్తరించిందనటంలో సందేహం లేదు. ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం పరిస్థి తి నేడు రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే మెజారిటీ సంఖ్యలో విద్య అభ్యసిస్తుంటారు. ఎన్నో ఆశలతో చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు సమస్యలే ''వెల్ కమ్'' చెప్పే పరిస్థితి నెలకొందంటే అతియోశక్తి కాదు. జ్ఞా నానికి, విభిన్న సంస్కతుల కలయికకు, చైతన్యానికి నిలయంగా చెప్పుకునే విశవిద్యాలయం పట్ల పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా ర్థులను అడుగడుగునా సమస్యలే అతలాకుతలం చేస్తున్నాయి. ఏమాత్రం నాణ్యతలేని ఆహారం, అపరిశుభ్రమైన వసతి గహాలతో విద్యార్థులకు ఇక్క ట్లు తప్పడం లేదు. ఇక 24గంటలు అందుబాటులో ఉంచాల్సిన వైద్యసేవ ల ఊసేలేదు. ఫలితంగా విద్యార్థులు అనారోగ్యం పాలైనప్పుడు గాని, అ త్యవసర పరిస్థితులలో విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన టంలో సందేహం లేదు. మరోవైపు తరగతి గదులకు విద్యార్థులు రాక, అ టు పర్మినెంట్ ప్రొఫెసర్లు లేక తరగతి గదులు వెలవెలబోతున్నాయి. సరై న రోడ్ల నిర్మాణం లేక, ఉన్న రోడ్లు చెత్త కుప్పలతో కమ్ముకుపోయిన పరిస్థి తి కనబడుతోంది. విద్యుత్ స్తంభాలు కదిలిస్తేనే వెలిగే దీపాలవల్ల విద్యార్థు లు రాత్రివేళల్లో బయటికి రావాలంటే జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నా యంటే కేయూ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వసతి గృహాల చుట్టూ ప్రహరీ గోడలు లేక పందులు, కుక్కలు, పశువులు, స్వైరవిహారం చేయడం సర్వ సాధారణంగా మారింది. విద్యార్థులకు ఏమాత్రం ఉప యోగపడని గ్రంథాలయంలోని ఓల్డ్ వర్షన్ పుస్తకాలు తప్ప లేటెస్టు ఎడి షన్ పుస్తకాలు అందించటంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్టస్థ్రాయి క్రీడారంగానికి మూలబిందువుగా నిలిచే విశ్వవిద్యాలయ క్రీడా కారులు ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారం అందక స్టీమ్ రైస్ అన్నం తినడం వల్ల, అన్నం జీర్ణం కాక అనారోగ్యానికి గురవుతున్న పరిస్థి తులున్నాయి. కనీసం ఉదయం టిఫిన్ చేయాలన్నా గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. పీజీ, పీహెచ్డీ, బీపీఈడీ తదితర డిపార్ట్మెంట్ విద్యార్థులందరికి ఒక్కటే కామన్ మెస్ కావటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్వించదగ్గ కళా, సాంస్కృతిక రంగాలలో ముందుండే విశ్వవిద్యాలయ విద్యార్థుల ఊసే కనపడట్లేదు. రాష్ట్ర అభివృద్ధికి, బలమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడే కొత్త కోర్సులు చేర్చడం చాలా అవసరం. ఇప్పటికైనా కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రొపెసర్ల కొరత లేకుండా చూడాలి. ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీచేెయాలి. శాశ్వత వైస్ ఛాన్స్లర్ని నియమించాలి. అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు తగినన్ని నిధులు వెచ్చించాలి. కేయూలోని సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
- చెల్పూరి శ్రీకాంత్
సెల్ : 8297975713