Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మాగాంధీ... మన భా రతజాతికే కాదు, యావ త్ ప్రపంచానికీ పరిచయం అవసరం లేని పేరు. బ్రిటిష్ వారి కబంధహ స్తాల నుండి భారతదేశాన్ని ఎలా వి ముక్తి చేయాలో, విముక్తి పొందిన స్వ తంత్ర భారతదేశాన్ని ఎ లా అభివృద్ధి పథంలో నడిపించాలో దిశానిర్దేశం చేసిన మహౌన్నత వ్యక్తి. అటువం టి మహనీయుడు మతోన్మాదుల చే తుల్లో బలైపోయినరోజిది. స్వతంత్ర భారతదేశం సిద్దించడం లో హిందూ ముస్లిం, కృషి మరువలేనిదనీ వచ్చిన ఫలితం భారతదేశ పౌరులందరికీ దక్కాలనీ ఆశించి న లౌకికవాది ఆయన. దేశ విభజన సమయంలో మతం పేరుతో సరిహద్దులలో హిందూ- ముస్లింలు ఒకరినొకరు చంపుకోవడాన్ని తీవ్రం గా వ్యతిరేకించి కలకత్తాలో నిరాహార దీక్ష చేప ట్టారు గాంధీజీ. కానీ కరుడుగట్టిన మతోన్మాదా న్ని గుండెల్లో నింపుకొన్న నాథురం గాడ్సే గాంధీ ప్రాణాలను హ రించాడు. నేడు భారతదేశంలో గాంధీజీ ఆశయాలకు తగ్గ ట్టుగా పాలన జరు గుతుందా..? అంటే సమాధానం లేదనే చెప్పొ చ్చు. సంఫ్ు పరివార్ ఆదేశాల మేరకు నడుస్తు న్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గాడ్సేనే దేశభక్తు డిగా కొనియాడుతున్నది. బహిరంగంగా పార్ల మెంటులో, ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయ కురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. నాధురం గాడ్సే ను నిజమైన దేశభక్తుడని అంటుంటే బీజేపీ పెద్దలు చోద్యం చూడటం చూస్తూనే ఉన్నాం. ఒక వింత ఏమిటంటే అదే బీ జేపీ నా యకులు ఓట్లు, సీట్ల కోసం గాంధీజీ సంకల్పయాత్ర పేరుతో యాత్రలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే పరిణా మం. చరిత్ర ప్రకారం గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను, అతనిని ప్రేరేపించిన మతోన్మాద సంస్థను నిర్బం ధంలో ఉ ంచేల సర్దార్ వల్లభారు పటేల్ హౌంమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన సంస్థల వల్ల దేశం ఎంత వినా శనానికి గురవుతుందో గాంధీజీ మరణంతోనే తెలుసుకున్న అప్పటి నాయకత్వం ఆ సంస్థలకు సంబంధిం చిన అన్ని కా ర్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో క్రియా శీలపాత్ర పోషి ంచాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించే దేశం. అంటే ఈ దేశం అన్యమతం అనే తేడా లేకుండా అన్ని మతాలు పాలన లో వచ్చిన ఫలితాలలో పాలుపంచుకుం టాయి. ఈ విధం గా యావత్ ప్రపంచానికి మన మత సామరస్యాన్ని అందిం చడంలో గాంధీజీ పాత్ర కీలకం. గాంధీజీ ఆశయాలను కేవ లం స్వచ్ఛభారత్కే పరిమితం చేసి స్వచ్ఛ భారత్ పేరుతో వారే చెత్త తీసుకుని రోడ్డుపై పోసి ఊడ్చి ఫొటోలకు పోజులి చ్చే నాయకులు మనల్ని పాలిస్తున్నన్ని రోజులు గాంధీజీ ఆశ యాల సాధన వైపు దేశం వెళ్లగలదని ఎలా అనుకోగలం..! సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ల పేరుతో దేశంలో మతపరమైన మంటలు రేపి చలికాచుకుంటున్న బీజేపీ.. గాంధీజీ ఆశించి న మతసామరస్యం, మత సహనానికి తూట్లు పొడుస్తున్న ది. దేశద్రోహి అని ముద్ర వేసి వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నా రు. మతం పేరుతో మనుషులను విడగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి మెజారిటీ మతస్తుల ఓట్లు కొల్లగొట్టుకుంటు న్నారు. సంఫ్ు పరివార్ గాంధీజీని పొట్టనపెట్టుకుంది వాస్త వం. నేడు ఆయన ఆశయాలకు కూడా పాతరేయాలని చూ స్తున్నారు. మతం పేరుతో సృష్టిస్తున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివాళి.
- వెంకట్ నాయక్
సెల్ : 9505809488