Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏలతో భారత ప్ర జల మధ్య విచ్ఛిన్నాన్ని రగిలించింది. ఆర్ఎస్ఎస్ అధికార బీజేపీని అ డ్డం పెట్టుకొని, మనం ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవాల్సిన దుస్థితి తెస్తో ది. చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగానికి విరుద్దంగా మోడీ ప్ర భుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలిస్తుంది. విభజించి పాలించాలనే భ్రిటిషు వారి కుట్రను ఆచరిస్తున్నది. మొదట ముస్లిం తర్వాత క్రిష్టియన్లు ఇతరులను ఒం టరి చేసే పన్నాగంలో ఉన్నారు మోడీ, అమిత్ షాలు. దేశంలో కేరళ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయబోమంటూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రధేశ్, త్రిపురతో సహ అనేక రా ష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ చట్టం అమలు చేయలేం అ ంటూ తెగేసి చెబుతున్నారు. వామపక్ష ప్రభుత్వమైన కేరళ.. సుప్రీం కోర్టును ఆ శ్రయించింది. వీరంతా గతంలో అస్సాంలో ఈ చట్టం తీరుతెన్నుల వల్ల స్థానిక ప్రజలు పడ్డ ఇబ్బందులు, సైనికుడి కుటుంబానికి పౌరసత్వం నిరాకరించడం, మాజీ రాష్ట్రపతి బంధువులకు తప్పని ఇబ్బందులు, 19లక్షల మందికి పౌరసత్వం రాకపోవడం, శరణార్ధ శిబిరాల పేరుతో జైళ్లకు పంపడం ఈ దారుణాల ను అధ్యయనం చేసి దేశమంతా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే, వెయ్యి మంది మేధావులు ఈ చట్టాన్ని వ్య తిరేకిస్తూ ఉత్తరం రాస్తే, కాషాయవాదులు మాత్రం చిలకపలుకులు పలుకుతూ ప్రజలను నమ్మించే ప్ర యత్నం చేస్తున్నారు. ఈ దేశంలో వీరి పాలనను ప్రశ్నించేవారిని దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు. నిర సన తెలిపితే కాషాయ మూకతో దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారు. జేఎన్యూ లాంటి విశ్వవిద్యాల యాల్లో ఇదే జరుగుతుంది. కాషాయ కుట్రలను తిప్పికొట్టకపోతే చరిత్ర మనలను క్షమించదు.
గతంలోఉన్న 1955 చట్టానికి సవరణలు చేసి పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ల నుండి మత ప రమైన అణిచివేతకు గురై భారతదేశానికి వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు కొన్ని ర కాల షరతులో పౌరసత్వం ఇస్తారు కాని ముస్లింకు మాత్రం పౌరసత్వం ఇచ్చేది లేదు. గతంలో దేశ పౌ రసత్వం పొందాలంటే 11 ఏండ్లు ఇక్కడ నివాసం ఉండి అందులో చివరి 12నెలలు దేశం విడిచి ఎక్క డికి వెళ్లకుండా ఉన్నట్టు ధృవీకరణ పొందితే పౌరసత్వం లభించేది. నేడు ఆ 11ఏండ్లను 5ఏండ్లకు తగ్గి ంచారు. వాస్తవంగా ఈ బిల్లును 2016లో ప్రవేశపెడితే వ్యతిరేకత రావడంతో 2016 ఆగస్టు 12న స ంయుక్త పార్లమెంటరి కమిటికి పంపింది. ఈ కమిటి సమస్యను తీవ్రంగా గుర్తించలేదు కాని చివరి 10 రోజుల్లో మాత్రం సమావేశం జరిపి 2019 జనవరి 7న నివేదిక సమర్పించింది. మరునాడు బిల్లును ఆ మోదించింది కాని వెంటనే ఎన్నికలు రావడం, రాజ్యసభ కాలం చెల్లిపోవడం వల్ల ముందుకు రాలేదు.
లోక్సభలో పూర్తి మెజారిటి రావడంతో 2019 డిసెంబర్ 4న మంత్రివర్గం ఆమోదం, డిసెంబర్ 9న లోక్సభలో అమిత్షా ప్రవేశపెట్టడం, డిసెంబర్ 10న లోక్సభ, డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదం పొందడం, వామపక్షాలు, రాష్ట్రాల స్థానిక పార్టీల ఎంపీలు వ్యతిరేకించినా డిసెంబర్ 12న రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.
అమిత్షా మాట్లాడుతూ ఇతర దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న వారిని ఆదుకునేందు కు ఈ చట్టం అంటున్నారు, అదే నిజమైతే ఈ మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాలి. గతంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనలో భాగమైన మయాన్మార్, శ్రీలంకలో ప్రజలు తీవ్రమైన హింసను ఎదు ర్కొంటున్నారు. ఎందుకు ఈ దేశాలను చేర్చలేదు? కేవలం 3 దేశాల వారికే ఎందుకు అవకాశమిచ్చారం టే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. భారతదేశం అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందంలో భాగ స్వామి. ఐక్యరాజ్యసమితి ప్రాదేశిక ప్రకటనలో సంతకం చేసింది భారత ప్రభుత్వం. దీనిని అనుసరించి 1996లో సుప్రింకోర్టు జడ్డి జస్టిస్ పిఎన్ భగవతి తీర్పునిచ్చారు. తీర్పు సారాంశం: భారత రాజ్యాంగం 21వ అధికరణాన్ని అనుసరించి శరుణార్ధులను బలవంతంగా వారి దేశాలకు పంపకుండా శరణార్ధి విధానం ఎలా ఉండాలో చెప్పారు. కాని నరేంద్రమోడీ అమలు చేస్తున్న విధానం దానికి భిన్నంగా ఉంది.
ఎన్ఆర్సీ వల్ల హిందువులు, క్రైస్తవులు ఇతర ముస్లింలు కాని మతాల వారికి నష్టం రాకుండా పౌరసత్వ సవరణ చట్టం తెచ్చినట్టు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా అబద్దం. దేశవ్యాపితంగా విస్తరిస్తే ముస్లింలతో పాటు అన్ని మతాలవారు నష్టపోతారు. ఎందుకంటే ఇది చట్టం. చట్టం ప్రకారం అందులో నిర్ధేశించిన వివరాలు ఖచ్చితంగా కావాల్సిందే. గతంలో మనం దేశ పౌరులమని గుర్తించాల్సిన బాధ్యత నేటి వరకు ప్రభుత్వాలది. కాని ఇప్పుడు ఆ బాధ్యత ప్రజలది. ఇది మోడీ కల్పించిన ప్రమాదం. ఈ దేశ పౌరులుగా నిరూపించుకోవాలంటే ఆర్హత 26.1.1950 నుండి 1.7.1987లోపు పుట్టిన ప్రతి వ్యక్తి అర్హుడవుతాడు, కాబట్టి ఈలోపు పుట్టినట్టు ఆధారాలు సమర్పించాలి. 2003లో చట్ట సవరణ జరిగింది. దీని ప్రకారం 1987 నుండి 2003 నాటి మధ్యకాలంలో భారతదేశంలో పుట్టిన వ్యక్తి తల్లితండ్రులలో ఒకరైనా భారతీయ పౌరులై ఉన్నట్టు నిరూపించుకోవాలి. లేదా 2003 సవరణ తర్వాత ఈ దేశంలో పుట్టిన వ్యక్తి తల్లితండ్రులలో ఒకరు ఈ దేశ పౌరుడై ఉండి రెండో వారు పౌరులు కాకపోయినా, ఈ దేశంలోకి చట్ట సమ్మతంగా వచ్చి ఉంటే అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన వారికి కూడా పౌరసత్వం లభిస్తుంది, తగిన ఆధారాలు చూపాలి. అంటే 1950 నుండి ఈ దేశంలో నివసిస్తున్నట్టు రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది. 130కోట్ల మంది జనాభాలో ఎంతమంది దగ్గర ఇవి ఉన్నవి? నివాస స్థల దృవపత్రాలు లేవు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో రికార్డులు లేవు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత 30ఏండ్ల క్రితం వరకు చదువేలేదు, ఒకవేళ సర్కారు దవాఖానాల్లో పుట్టి ఉంటే ఇప్పుడు ఆ పత్రాలు ఎవరిస్తారు.
ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రజలను మతాలవారిగా చీలుస్తుంది, వివక్షను పాటిస్తుంది, మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది, నాడు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశాన్ని నేడు పాలకులు లౌకికత్వానికి తిలోదకాలు ఇచ్చి పాలించాలని మతం పేరిట ప్రజలను విచ్ఛిన్నం చేసి హిందూరాజ్యంగా చేయాలని మనుధర్మాన్ని రాజ్యాంగంగా అమలు చేయాలనీ అనుకుంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, హక్కుల కోసం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, పోరాటాలు జరుగుతుంటే కాషాయ ప్రభుత్వం దాడులు, దౌర్జనాలు చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో 20 మందిని పోలీసు కాల్పులతో హతమర్చింది. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్న విశ్వవిద్యాలయాలపై దాడి చేస్తున్నది. హిందుస్థాన్లో హిందువులే ఉండాలన్న ఆర్ఎస్ఎస్ సిద్దాంతవేత్త హెడ్గేవార్ లక్ష్యాన్ని సాధించడానికి గతం నుండి ప్రయత్నిస్తున్న ఆర్ఎస్ఎస్ నేడు వేగం పెంచి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీని ఈ రూపంలో ఆడిస్తుంది. డా||బాబా సాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరించిన లౌకికదేశాన్ని కాపాడుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, లౌకికవాదులు, అభ్యుదయవాదులు, దేశ ప్రజలందరి బాధ్యత. ఆర్ఎస్ఎస్, బీజేపీ పనిగట్టుకొని రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి. దేశంలో పెరిగిపోయిన దారిద్య్రం, పేదరికం, నిరుద్యోగం, సంక్షోభాలు, జాతీయ స్థూల ఆదాయం పడిపోవడం, వీటన్నింటి వల్ల ప్రజలనుండి ఎదురయ్యే వ్యతిరేకతను దృష్టిమళ్లించేందుకు ఒకదాని తర్వాత ఒకటి సృష్టించి ప్రజలను మభ్య పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. రాజ్యాంగం మాత్రమే మనకు రక్ష...!
- అలువాల రవికుమార్
aluvalaravi1984@gmail.com