Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరాచకానికి ఆమడదూరం బీజేపీ అంటూ జనవరి 7న ఓ దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వ్యాసం మొత్తం చదివిన తర్వాత ఇది 'అసత్య కాలమ్' అని బోధపడింది. జాతిపితను కాల్చి చంపిన అరాచకత్వం, హత్యా రాజకీయం, ఉన్మాద సిద్ధాంతం బీజేపీది. ఆరెస్సెస్, జనసంఘ్, బీజేపీ చారిత్రక క్రమం తెలిసిన వారికెవ్వరికైనా తెరిచిన పుస్తకమే. 'సత్యమే వజయతే' అని నినదించిన జాతిపిత మహాత్మాగాంధీని చంపిన హత్యాకారుల వారసులు ఇవ్వాళ ''సత్యకాలమ్'' అని మాట్లాడటం హస్యాస్పదం. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష శక్తులు తుడుచుకుపోయాయనీ, మన దేశంలో బెంగాల్, త్రిపురలో కూడా కనుమరుగయ్యాయనీ, అక్కడి ప్రజలు వారిని బహిష్కరించారనీ వ్యాసం ప్రారంభంలో ప్రస్తావించిన వ్యాసకర్తకు రూపు రేఖలు లేకుండా బహిష్కరించిన వారి గురించి ఇంత భయమెందుకో అర్థం కావడం లేదు. పైగా జేఎన్యూలో కాలం చెల్లిన వాతావరణం కొనసాగుతున్నదని అన్నాడు. కానీ అదే జేఎన్యూలో కాలం చెల్లిన వారిని అఖండ మెజార్టీతో ఎలా గెలిపించారనేది మరువరాదు. ఆయన దృక్పథం ప్రకారం జేఎన్యూలో అరాచక విద్యావ్యవస్థ కొనసాగితే ప్రపంచస్థాయి మేధావులు, దేశంలోనే అత్యధిక మంది సివిల్ సర్వెంట్లను ఎలా అందించగలుగుతోంది?, ఈ దేశానికి నోబెల్ బహుమతి తెచ్చిన అమర్థ్యసేన్, అభిజిత్ బెనర్జీలు జేఎన్యూ విద్యార్థులేనని మరిచారా? ఎం తోమంది దేశం గర్వించదగ్గ మేధావులను జేఎన్యూ అందించింది. జేఎన్యూ విద్యార్థులు నామమాత్రపు ఫీజులతో చదువు పేరుతో కాలక్షేపం చేస్తున్నారని వ్యా సకర్త ప్రస్తావించడం ఆక్షేపణీయం. దేశంలో కూలీ కుటుంబాల నుంచి వచ్చి చదు వు పట్ల ఎంతో అంకితభావంతో జ్ఞాన సమూపార్జన కోసం కన్నవారికి దూరమై చదువు కొనసాగిస్తున్న అణగారిన పేద, నిరుపేద బిడ్డలను 'కాలక్షేపం చేస్తున్నారు' అని పేర్కొనడం వ్యాసకర్త కులీనవర్గ సంస్కృతిని తెలియజేస్తుంది. జేఎన్యూ నుంచి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల దాకా అరాచక శక్తులు సిద్ధాంతాల పేరుతో నినాదాలు చేస్తూ హింసాత్మక పరిస్థితులను సృష్టిస్తారని వ్యాసంలో అక్క సు వెళ్లగక్కారు. కానీ ఇదే యూనివర్సిటీలలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి విద్యార్థులు నడుం కట్టారన్న చరిత్రను మరువరాదు. ఈ యూనివ ర్సిటీల విద్యార్థులే ప్రశ్నలతో ప్రగతిని, దేశాభివృద్ధిని పదునెక్కించారు. అదే జేఎన్యూ దేశంలో ఎమర్జెన్సీ సమ యంలో ఇందిరాగాంధీని ప్రశ్నించి, నియంతృత్వాన్ని ఎదిరించి ఛాన్స లర్ పదవి నుంచి తప్పుకునేలా చేసి ంది. అప్పుడు జేఎన్యూ అధ్యక్షుడు సీతారాంఏచూరీ, నాటి జేఎన్యూ విద్యార్థులు ప్రదర్శించిన తెగువ, పో రాటం ఈ దేశానికి ఉపయోగపడేది కాదా? ఈ చరిత్రను మరుగునపెట్టే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం పట్ల, ప్రభుత్వాల పట్ల, చట్టాల పట్ల యూ నివర్సిటీ విద్యార్థులకు గౌరవం ఉండదని ''అసత్యపు వచనాలను'' ఈ కాలమ్ ప్రవ చించింది. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది కాబట్టే రాజ్యా ంగ నిర్దేశిత వ్యవస్థలను గౌరవించే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజ్యాంగ రక్షణకు, దేశ రక్షణకు కంకణబద్దులై ''మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కాని వ్వం'' అని ప్రాణాలను బలిపెడుతున్నారన్న నిజాన్ని విస్మరించరాదు. ఎంతోమంది అక్కడి నుండి రాజ్యాంగబద్ధమైన పదవుల్లోకి, సివిల్ సర్వెంట్లుగా, ఇతర ఉన్నతా ధికారులుగా అందివస్తున్నారు. బీజేపీ భావజాలపు సంస్థల అరాచక చిట్టాను కప్పిపెట్టి మాట్లాడుతున్నారనేది తేటతెల్లమైంది. ఈ కింది విషయాలను గమనిస్తే అరాచకాన్ని సృష్టించేవారెవరో తెలుస్తుంది. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సి టీలో రోహిత్ వేముల మరణానికి కారకులెవరు? జేఎన్యూలో నజీబ్ అనే విద్యార్థిపై దాడి చేసి అతని ఆచూకీ ఇప్పటికీ లేకుండా చేసింది ఎవరు? జాదవ్పూర్ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడికి కారణం ఎవరు? 2015 జనవరిలో అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై తుపాకితో దాడికి పాల్పడింది ఎవరు? సాక్షాత్తూ యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన జేఎన్యూ అధ్యక్షురాలైన అయిషీ ఘోష్పై దాడి చేసింది ఎవరు? సంఘ్ పరివార్ శక్తులు కాదా? ఈ అరాచకం లోకానికి తెలియదా? కమ్యూనిస్టు భావజాలం, ముస్లిం భావజాలం కలిగిన యూనవిర్సిటీలలోనే విధ్వంసకాండ జరుగుతుందని వ్యాసకర్త చెప్పుకొచ్చారు. ఇది నిషేధిత ఉగ్ర సంస్థలతో కమ్యూనిస్టు భావాజాలం కలిగిన సంస్థలను కలిపి పోల్చడం కావాలనే ప్రస్తావించే కుట్రగా చూడాలి. ఎందుకంటే తను ప్రస్తావించిన పాపులర్ ఫ్రంట్ చేతిలో కేరళ మహారాజ కళాశాల కమిటీ ఎస్ఎఫ్ఐ నాయకుడు అభిమన్యు హతమవడం లాంటి అనేక సంఘటనలున్నాయి. అయినా భారత రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించే కమ్యూనిస్టులపై దుమ్మెత్తి పోయడానికి సంఘ విద్రోహ శక్తులని అసత్య ప్రచారం చేయడానికి ఈ వ్యాసంలో ప్రయత్నం చేశారని అర్థమవుతోంది. గతంకంటే యూనివర్సిటీలను బీజేపీ ఏదో ఉద్దరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవన్నీ అభూత కల్పనలు మాత్రమే. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి రూ.3వేల కోట్లు తగ్గించారు. రీసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్లు నిలిపివేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారాలను నీరుగార్చారు. అధ్యాపక ఖాళీలను భర్తీ చేయలేదు. యూనివర్సిటీలలో కొత్త రిక్రూట్మెంట్స్ ఎక్కడా చేయలేదు. కనీసం యూనివర్సిటీల నిర్వహణకు సరిపడా నిధులు కూడా విడుదల చేయలేని దుస్థితి ఈ దేశంలో నెలకొంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగానే యూనివర్సిటీల ప్రామాణికత దెబ్బతిని నైపుణ్యాలు పడిపోయాయి. పైగా ఇది చాలదన్నట్టు కార్పొరేట్లకు సాగిలపడి లేని అంబానీ జియో యూనివర్సిటీకి రూ.1వెయ్యి కోట్లు కేటాయించిన మహా ప్రభువులు నైపుణ్యాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తాజాగా జేఎన్యూలో జరిగిన హింస గురించి బీజేపీ, దాని అనుబంధ విద్యార్థి సంఘాలను నిందిస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు. కానీ పౌరసత్వ చట్టంపై రగులుతున్న ఆందోళనల వల్ల జేఎన్యూలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఐసిస్ ఉగ్రవాదుల వలే 100మంది ముసుగులు ధరించి, కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులు, హకీ స్టిక్స్, క్రికెట్ బ్యాట్లాంటి మారణాయుధాలను చేతబట్టి మార ణహౌమం సృష్టించింది ఎవరన్నది జగమెరిగిన సత్యం. ఇవే కాదు బీజేపీ అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి వామపక్ష, అభ్యుదయ భావజాలానికి మేధావులకు జేఎన్యూ కేంద్రంగా ఉందనీ, భావ సంఘర్షణ తప్ప భౌతిక ఘర్షణ లేని జేఎన్యూని మూసివేయాలనీ బీజేపీ కుట్ర చేస్తున్నది. దేశంలో తాజా పరిస్థితులను గమనించినా ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలను గమనించినా జేఎన్యూలో 2016 తర్వాత ఆరెస్సెస్ భావజాలం కలిగిన వ్యక్తిని వీసీగా నియమించినప్పటి నుంచి జరుగుతున్న దాడి వంటి వాటిని పరిశీలించినా బీజేపీ దేశానికి ఎలాంటి సేవ చేస్తుందో అర్థమవుతుంది. ఈ ఏడాది యూనివర్సిటీలో జరిగిన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత యూనియన్ ఆఫీస్ను మూసివేయడాన్ని, ఫీజులను పెంచడాన్ని, ఇప్పుడు ముసుగులు వేసుకొని హాస్టల్లోకి చొరబడి దాడులు కొనసాగించిన వారెవరో తెలిసినా కనీసం వీసీ గానీ, బీజేపీ పెద్దలు గానీ నోరు విప్పకపోవడాన్నీ ఏమని అర్థం చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపుల్లో దాడి ఎలా చేయాలనే వ్యూహాన్ని స్క్రీన్షాట్ రూపంలో సోషల్ మీడియాలో చర్చ జరిపింది ఎవరు? పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ నాయకులు ఉన్నారనేది వాస్తవం కాదా? దేశంలో ఆర్థిక పరిస్థితి గురించి, ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్న నిరుద్యోగం గురించి, విద్యార్థుల ఫీజుల గురించి ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ విధానాన్ని వ్యాసకర్త బహుషా మరిచారేమో..! భారత్ మాతాకీ జై అంటూ భారతమాత లాంటి మహిళపై హత్యాయత్నం చేయడం ఏవిధంగా దేశభక్తో సెలవివ్వాలి.
- టి.నాగరాజు
సెల్ : 9493063626