Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మేడిపండు చూడ మేలిమై ఉండు- పొట్ట విప్పి చూడ పురుగులుండు'', అన్నట్టుగానే ఉంది బీజేపీ పాలన. ''చారువాలా అయిన నేను దేశానికి ప్రధానమంత్రిని అయ్యానంటే దానికి కారణం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం గమే'' అంటూ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగాలు మరిచారేమో. ఇప్పు డు అదే గణతంత్ర రాజ్యాంగాన్ని ఉల్లం ఘిస్తూ చట్టాలు రూపొందిస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూ త్రాలను ఉల్లంఘించడమే కాదు, దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీసే విధంగా చట్టాలు సవరించడం, నూతన చట్టాలు రూపొందించ డం విచారకరం. ఇప్పటివరకూ కాషాయ ప్రభుత్వం రూపొం దిచిన చట్టాలన్నింటినీ పరిశీలిస్తే ఏ ఒక్కటైనా సామాన్యులకు ఉపయోగపడేవిగా ఉండకపోవడం గమనార్హం. మరి ఎవరి కోసం ఈ చట్టాలు! నూతన చట్టమైనా, సవరణ చట్టాలైనా కమ లనాథుల రాజకీయ లబ్ది కోసం, తన ఆప్తమిత్రులైన అదాని, అంబాని, టాటా, బిర్లాలకూ ఇంకా దేశంలో ఉన్న 63 మంది బ డా బాబుల కోసమే అనడానికి గత ఆరేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే నిదర్శనం. దేశంలో 70 శాతంగా ఉన్న రైతులకు పంట పెట్టుబడికి రుణాలందక, సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల బాధతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వారి గోస పట్టని ఏలికలకు కొంత మొత్తంలో ఉన్న పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ రంగంలోని బడాబాబుల అవసరాలు కనిపించాయి. ఆర్థికమాంద్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారంటూ, నిర్మాణ రంగాన్ని కాపాడాలంటూ కేవలం కొంతమంది కోసమే రూ.లక్షల కోట్లను నజరానగా ప్రకటించడం, వారికి పన్ను మినహాయింపులివ్వడం చూస్తుంటే పాలకులు ఎవరికోసం పనిచేస్తున్నారో అర్థమవుతోంది.
''దేశాభివృద్ధి మావల్లనే సాధ్యం'' అంటూ మాయమాటలు చె ప్పి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అభివృద్ధి సాధించకపోగా దే శాన్ని ఆర్థికమాంద్యం వైపునకు నెట్టేసింది. 'దేశంలో పేదరికాన్ని పారదోలతాం - నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం' అంటూ ఇచ్చిన ని నాదాల్ని గాలికొదిలేసింది. కానీ పేదరికం పెరిగిపోయింది. నిరు ద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. 2019-20 ఆర్థిక సం వత్సరంలోని మూడో త్రైమాసికానికి (సెప్టెంబర్ - డిసెంబర్) గానూ ఇది 7.5 శాతంగా నమోదైంది. ఇదిలా ఉండగా కార్మి కులకు కనీస వేతనాలు ప్రకటించాల్సింది పోయి కార్మికుల సం క్షేమం కోసం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా కుదించింది. దీన్ని బట్టి చూస్తే కార్మికుల పట్ల కమలనాథులు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది.
పార్లమెంటులో తమకున్న మందబలంతో జమ్మూ కాశ్మీర్కున్న స్వతంత్ర హోదా (ఆర్టికల్ 370)ను ఏకపక్షంగా రద్దు చేసి గత పాలకులెవరూ చేయలేని పని తామే చేయగలిగామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వంటి వివాదాస్పద చట్టాలతో దేశ సమైక్యతా, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే రీతిలో చట్టాలు రూపొందిస్తున్నారు. ఈ వివాదాస్పద చట్టాలతో నేడు దేశంలో ఎన్నడూలేని రీతిలో పాలక ప్రభుత్వాలపై సామాన్యులు, విద్యార్థులు సైతం నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సీఏఏ చట్టాన్ని సవరించి ముస్లింల మనోభావాలతో ఆడుకుంటోందీ ప్రభుత్వం. మతతత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది బీజేపీ. దేశాన్ని మత కల్లోలంలోకి నెట్టేస్తోంది. మతాన్ని ఆసరాగా చేసేకొని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోంది. 2017 జూలై 1న జీఎస్టీని రూపొందించారు. ఈ ఒక్క చట్టంతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది, దేశ భవితవ్యమే మారుతుందని రాష్ట్రాలకు మాయమాటలు చెప్పారు. కానీ తాము రూపొందించిన చట్టాన్ని తామే నియంత్రించలేని స్థితిలో ఏలికలున్నారు. జీఎస్టీ నుంచి ఆశించిన స్థాయిలో పన్నులు వసూళ్లు చేయలేకపోయారు. జీఎస్టీ చట్టం పైన పటారం లోన లొటారం అన్న చందాన పేలవమైన ఫలితాల్ని ప్రదర్శించింది.
సంఘటిత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వానికి బంగారు బాతుగుడ్లనందించే ఎయిరిండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి మహారత్నా, నవరత్న కంపెనీలను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నది. ఆ ఉద్దేశంతోనే తొలుత కొన్ని వాటాలను విక్రయించింది, ఆ తరువాత పెట్టుబడుల ఉపసహరణ పేరుతో మిగిలిన వాటాలను బూర్జువా వర్గానికి కట్టబెడుతోంది. ఇప్పుడు పూర్తిగా సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయనే పేరుతో తప్పుడు నివేదికలు సృష్టించి కార్పొరేట్లకు కట్టబెట్టాలని యోచిస్తోంది. నిజానికి ఆ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయుంటే కేంద్ర ప్రభుత్వమే పూడ్చలేని నష్టాలను ప్రయివేటు వ్యక్తులు ఎలా పూడ్చగలుగుతారు?. ఇదంతా చూస్తుంటే తన ఆప్త మిత్రులకు కట్టబెట్టే ప్రయత్నమేనని స్పష్టంగా తేలిపోతోంది. ''ప్రజల పిలుపుమేరకే, వారి ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం'' అంటూ రెండోసారి అధికారంలోకి వచ్చాక కమలనాథులు నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు. దీంతో తమను ఆశీర్వాదించిన ప్రజలే ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు, నిరసనలకు, ఆందోళనలకు దిగారు. ఇప్పడికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు.
- వెంకటేష్
సెల్ : 9985129121