Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి అడుగుల్ని
అక్షరాలుగా మార్చాలనిపిస్తుంది..
కొందరి జీవితాన్ని
కాగితాలపైకి ఎక్కించాలనిపిస్తుంది..
ఎందుకంటే.... వాళ్లు,
చరిత్రను నిర్మించినవాళ్లు.. చరిత్రను నడిపించినవాళ్లు.
అలాంటివారిలో ఓ కమ్యూనిస్టు ముత్యం రావెళ్ల సత్యం. ''ఎవడబ్బ సొమ్మని కులికెదవు నీవు'' అని ప్రభువులను ప్రశ్నించిన నేలకొండపల్లి వారసత్వం కామ్రేడ్ సత్యం. చారెడు నేల కోసం, చాకిరీ రద్దు కోసం నిలుత్తు పోరాటమై నిజాం పాలకులను పరుగులు పెట్టించిన ముదిగొండ అమరత్వం కామ్రేడ్ రావెళ్ల సత్యం.
1927 జనవరిలో ఖమ్మం జిల్లా గోకినెపల్లి గ్రామంలో జన్మించాడు. సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న సత్యం చిన్నతనంలో మామిడిచెట్టు మీదనుంచి జారిపడటంతో ఒక చేతిని కోల్పోవాల్సి వచ్చింది. అయినా అధైర్యపడక.. ఒంటి చేతితోనే ఎర్రజెండాను మోసుకుంటూ జనం కోసం రణరంగమైనాడు. బువ్వపెట్టే భూమికోసం, బానిసలను మనుషులుగా మార్చడం కోసం సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రారంభ కాలంలో.. కామ్రేడ్ రావెళ్లది నూనూగు మీసాల నూత్నయవ్వనం. వయసు చిన్నదైనా మనసు పెద్దది కదా..! అందుకే ఆ సాయుధ పోరాట మార్గమే ఎంచుకున్నాడు. శారీరక వైకల్యాన్ని మార్క్సిజం అనే మానసిక సంకల్పంతో అధిగమించాడు. తుపాకీ తూటాలను నిజాం కోటలకు ఎక్కుపెట్టి సాయుధ సమరాంగణంలోకి సాగి పోయాడు. 1948-49లో కృష్ణా జిల్లాలోని మలకాపురం సరిహద్దు క్యాంపులో సాయుధ శిక్షణ పొంది, కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు తన సాయుధ దళంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. దొరల గడీలకు వణుకు పుట్టించాడు. సామాన్యుల సాహసమై వెలుగొందాడు. ఊరూరికి ఓ పోరాటమై విస్తరిస్తుండగానే కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఆయనను అరెస్టు చేసింది నిజాం ప్రభుత్వం. రావెళ్లను ఓ కరుడుగట్టిన కమ్యూనిస్టు కార్యకర్తగా గుర్తించి, ప్రమాదకరమని భావించి మద్రాసులోని కడలూరు జైలులో నిర్బంధించింది. అప్పటికే ఆ జైలులో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మోటూరు హనుమంతరావు ఉన్నారు. ఆయన సాంగత్యం అంతర్జాతీయ, జాతీయాంశాల నుంచి స్థానికాంశాల వరకూ రాజకీయంగా, సామాజికంగా, సైద్ధాంతికంగా గొప్ప అవగాహననందించింది రావెళ్లకు. ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీని ఎలా నిర్మించాలో, ఎలా విస్తరించాలో నేర్చుకున్నాడు. మానవాళి విముక్తికి మార్క్సిజం తప్ప మారో మార్గం లేదని తెలుసుకున్నాడు. అలా పెద్దగా చదువుకోని రావెళ్లకు కడలూరు జైలు ఓ ప్రాపంచిక జ్ఞానాన్నిచ్చింది. కమ్యూనిస్టు పాఠాలు నేర్పింది. కష్టాలు, కన్నీళ్లే తప్ప కంటికి నిద్ర, వంటికి సుఖం ఎరుగని అభాగ్యులకు అరుణ పతాకాన్ని అందించమంది. విసిరేసిన వెలివాడల గోడలపై సుత్తి కొడవలై మొలవమంది.
1951 డిసెంబర్ నెలలో విడుదలైన దేశవ్యాప్త సాధారణ ఎన్నికల ప్రకటన, జైలునుంచి రావెళ్ల సత్యం విడుదలకూ కారణమైంది. విడుదలైన సత్యం పార్టీ ఆదేశం మేరకు సరాసరి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాడు. భుజానికి సంచి వేసుకొని, సుమారు రెండు నెలలపాటు ఊరూరూ తిరిగాడు. కమ్యూనిస్టు పార్టీపైన నిషేధం ఉండటం, వందలాది మంది కార్యకర్తలు ఇంకా జైళ్లల్లోనే మగ్గుతుండటం పార్టీ ప్రచారానికి ఆటంకాలుగా మారిన నేపథ్యంలో.. ఆయన కొత్త కార్యకర్తలను గుర్తించి వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. వారి ద్వారా ఎన్నికల కర్తవ్యాన్ని జయ ప్రదంగా నిర్వహించాడు. కమ్యూనిస్టు పార్టీకి అఖండ విజయం చేకూర్చి.. భూస్వాములకు చెమటలు పట్టించాడు. ఖమ్మం ద్విసభ్య నియోజకవర్గం నుండి పీడీఎఫ్ తరుపున పోటీ చేసిన కమ్యూనిస్టులిద్దరూ గెలిచారు. రిజర్వు అభ్యర్థిగా నామవరపు పెద్దన్న, జనరల్ అభ్యర్థిగా కర్ణాటి కృష్ణయ్యలకు భారీ మెజార్టీ లభించింది. పార్లమెంటరీ విజయాలను వర్గ పోరాటాల నిర్వహణకు ఉపయోగించాలని పార్టీ పిలుపును అక్షరాల ఆచరణలో పెట్టాడు రావెళ్ల. గ్రామాలలో భూస్వామ్య విధానా లపై, కుల పీడనలపై దృష్టి పెట్టాడు. ఆనాడు ఓటర్ల జాబితాలో దళితుల పేర్ల చి వరన 'గాడు' అనే పదం చేరుస్తూ 'ఎల్లిగాడు సన్ఆఫ్ మల్లిగాడు' అంటూ ఓటరు లిస్టులు తయారు చేసేవారు. ఈ దుర్మార్గాన్ని సహించని రావెళ్ల పెద్ద పోరాటమే చేసాడు. అందుకు కారణమైన అధికారులకు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరే కంగా యువతను పెద్దయెత్తున సమీకరించాడు. ప్రజల ఆందోళనను, ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం దిగొచ్చి 1959 తర్వాత ఓటర్ల జాబితాలో 'గాడు' అనే పదాన్ని తొలగించి కొత్త ఓటర్ల జాబతాను తయారు చేయాల్సివచ్చింది. దీంతో కామ్రేడ్ రావెళ్ల సత్యం అణగారిన ప్రజల ఆత్మ గౌరవ పతాకమయ్యాడు. చేతులు ముడుచుకు కూర్చోవడం కాదు, పోరాడితేనే పీడన పోతుందని, ఆత్మగౌరవం అందుతుందని ప్రజలకు ఆచరణలో తెలియజేసాడు.
ఓవైపు గ్రామాలలోని భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ నే మరోవైపు ముందుకొచ్చే ఎన్నికలను ఆయన ఎదుర్కొనేవాడు. భూస్వామ్య శక్తులను నిలువరించేందుకు 1959లోనే జరిగిన పంచాయతీ ఎన్నికల ను ఓ సవాలుగా తీసుకున్న సత్యం ముదిగొం డ, నేలకొండపల్లి మండ లాల బాధ్యతను భుజాన వేసుకున్నాడు. యువతను సమీకరించడాని కి, వారిని కార్యకర్తలుగా, నాయకులుగా తీర్చిదిద్దడానికీ ఆయన ఈ ఎన్నికలనొక సాధనంగా చేసుకున్నాడు. అమరజీవి గండ్లూరి కిషన్రావు వంటి యువకులెందరినో పార్టీలోకి తీసుకొచ్చి, వారికి సభ్యత్వం ఇచ్చి గ్రా మీణ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా ఎన్నికలలో నిలబెట్టాడు. నిలబెట్ట డమేకాదు, సర్పంచులుగా గెలిపించాడు. దీంతో భూస్వామ్య శక్తులు ఉలిక్కిప డ్డాయి. ప్రజలు ఎర్రజెండాను గుండెలకు హత్తుకోవడాన్ని చూసి కంగారుపడ్డా యి. రావెళ్ల అకుంటిత దీక్ష, పట్టుదల, కమ్యూనిస్టు కృషి ఊరూరా విజయదుందు భి మోగించింది. ఎన్నికల విజయాలను దోపిడీ వ్యతిరేక ఉద్యమాలకు ఉపయోగిం చాలన్న కమ్యూనిస్టు అవగాహనతో కామ్రేడ్ రావెళ్ల వర్గపోరాటాలను నిర్మించాడు. భూస్వా ముల చెరలో ఉన్న భూములను, ప్రభుత్వ బంచరాయి భూములను ప్ర జాపరం చేయడానికి అనేక పోరాటాలను రాజేశాడు. వందలాది ఎకరాలలో ఎర్ర జెండాలు పాతి భూముల్ని ప్రజలకు స్వాధీనం చేశాడు. కూలి రేట్ల పెంపుకోసం, తప్పుడు కొలతల రద్దుకోసం కొట్లాడాడు. రైతుల ఎరువులను తీసుకెళ్లే తప్పుడు కొలతల బండి జల్లలపై విరుచుకుపడ్డాడు. చంకాపురంలో రాజుకున్న ఈ పోరాటం ముదిగొండ, కొండపల్లి పల్లెలన్నిటికీ పాకింది. ప్రజలు ఉవ్వెత్తున కదిలారు. ఖమ్మం జిల్లా మొత్తాన్నీ కదిలించిన ఈ రైతుకూలీ పోరాటాలకు రావెళ్ల నాయకత్వం వహించాడు. ప్రజలను వీరులుగా మలుచుకుని విప్లవలను రగిలించాడు. ఫలితంగా ప్రజలకు భూములు అందాయి. కూలీ రేట్లు పెరిగాయి. పిచ్చి మానికలు, తప్పుడు కొలతల బండి జల్లలు రద్దయ్యాయి.
కానీ ఇది భూస్వాములకు కంటగింపుగా మారింది. కమ్యూనిస్టు కార్యకర్తలను అంతం చేస్తే తప్ప తమ మనుగడ కష్టమని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆణి ముత్యాల్లాంటి కమ్యూనిస్టులనేకులను పొట్టన పెట్టుకున్నారు. గండ్లూరి కిషన్ రావు, మక్కా చిన నర్సయ్య, బొల్లెద్దుల రామనాథం, గండ్ర వీరభద్రారెడ్డి, పాపినేని నారాయణ, గుడవర్తి రామయ్య, పెరుమళ్ల చంద్రయ్య వంటి ప్రజా నాయకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. మనుషులను చంపి మార్క్సిజాన్ని అంతం చేయాలని ప్రయత్నించారు. కమ్యూనిస్టు పార్టీని, రావెళ్ల వంటి నాయకుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. ఈక్రమంలో ఆయనపై ఎన్ని దాడులు... ఎన్ని దౌర్జన్యాలు.. కానీ కలవరపడి వెనుకడుగేయడానికి రావెళ్ల సాధారణ మానవు డా..? కమ్యూనిస్టు యోధుడు..! వర్గశత్రువుతో పోరాడేటప్పుడు రావెళ్ల సత్యం కార్యకర్తలకు శిఖర సమానుడు. ఆ శిఖరాన్ని కదిలించాలని భూస్వాములు శత విధాలా ప్రయత్నంచి ఓడిపోయారు.
పనిలో కచ్చితత్వాన్నీ, కఠినమైన క్రమశిక్షణనూ ముందు తను పాటించి తరు వాత కార్యకర్తలకు బోధించేవాడు. ఎన్ని సంక్షోభాలెదురైనా ఇంచు కూడా సడలని రావెళ్ల తన ప్రియ యువ కామ్రేడ్ గండ్లూరి కిషన్రావు హత్యకు చలించిపోయా డు. ఎన్నడూ కన్నీరన్నదే ఎరుగని రావెళ్ల.. చితిపై కాలిపోతు న్న గండ్లూరిని చూసి బోరున విలపించాడు. నికార్సయిన వర్గ పోరాట వీరులుగా మారడం ఎంత కష్ట మో ఆయనకు తెలుసు. కామ్రేడ్ కిషన్రావు అలాంటి వీరుడు క నుక ఆయన అంతగా చలించిపో యాడు. వెంటనే తేరుకుని సహచర కామ్రేడ్స్ను దగ్గరికి తీసు కుని ధైర్యం చెప్పాడు. ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యతను గు ర్తు చేసుకున్నాడు. గండ్లూరి కిషన్రావు అమరత్వ ంపై శపథం చేశాడు. కర్తవ్యానికి పునరంకిత మయ్యాడు.
1964 ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక సంద ర్భంలో 1968 నక్సలైట్ ఉద్యమ సమయంలో కా మ్రేడ్ రావెళ్ల మార్క్సిస్టు పార్టీవైపు నిలబడ్డాడు. 1971-72లో వచ్చిన అంతర్గత సంక్షోభంలో సై తం ఆయన మార్క్సిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపా డుకు న్నాడు. ఓవైపు భూస్వామ్య కాంగ్రెస్ గూండాల దాడులు, మరోవైపు పోలీసు నిర్బంధకాండ, ఇంకో వైపు పార్టీపై విచ్ఛిన్నకు ల కుట్రలు... ఈ అన్ని రకాల దాడులనూ రావెళ్ల ధీటుగా ఎదుర్కొన్నాడు. పోలీసు ని ర్బంధాల నుండీ, భూస్వా ముల దా డుల నుండీ కార్యకర్తలను చాకచక్య ంగా కాపాడుకుంటూ వచ్చాడు. కార్యకర్త తప్పు చేస్తే ఎంత కఠినంగా వ్యవరించేవాడో, ఆ తప్పును స రిద్ది దడంలో, రక్షించకోవడంలో అంత సున్నితంగా వ్యవహరించేవాడు. కా ర్యకర్తలు ఆఫీసుల్లో ఖాళీగా కూర్చో వడాన్ని ఆయన ఎన్నడూ సహించే వాడు కాదు. నిత్యం ప్రజల్లోనే ఉండా లని ఆదేశించేవాడు. ఆదేశాలు ఇవ్వడమే కాదు. ఆచరణలో అందరికంటే ముందు ండేవాడు. జనం ఎక్కడుంటే రావెళ్ల స త్యం అక్క డుండేవాడు. అందుకే, రావెళ్ల సత్యం ఎక్కడుంటే జనం కూడా అక్కడే ఉండేవారు. కోడి చుట్టూ పిల్లల్లా, రావెళ్ల చుట్టూ ప్రజలూ పార్టీ కార్యకర్తలూ పోగయ్యేవారు. అలాంటి 'కామ్రేడ్ రిలేషన్ షిప్'ను ఆచరించాడు కాబట్టే అచ్చమైన ప్రజా నాయకు డయ్యాడు. పార్టీ రాష్ట్ర క మిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. ప్రజల ఆదరణతో అనేక బాధ్యతలు చేపట్టాడు. 1960లో ఖమ్మం జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా సహ కార ఉద్యమానికి వన్నె తెచ్చాడు. 1980లో ఖమ్మం తాలూకా సమితి అధ్యక్షుడిగా సేవలందించాడు. నిత్యం ప్రజలకోసం, పార్టీకోసమే ఆయన పరితపించాడు. ప్రజా నాయకుడిగా రావెళ్ల ప్రయాణంలో ఆయన సతీమణి భార తమ్మ కృషి ప్రశంసనీయం.ఆయన కుటుంబసభ్యుల సహకారం అభినందనీ యం. ఎప్పుడూ ఊర్లు పట్టుకొని ఉద్యమాల దారుల్లో సాగే ఆయనను వారెప్పు డూ వారించలేదు. కాకపోతే ఆరోగ్యం జాగ్రత్తంటూ హెచ్చరించేవారు. కానీ ని త్యం తీరికలేని పనుల్లో తల మునకలయ్యే రావెళ్ల, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ వ చ్చాడు. ఊపిరి సలపని ఉద్య మాలు, ప్రజల్ని, కార్యకర్తల్ని, పార్టీని రక్షించుకోవా లనే తాపత్రయాలు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. విరామమెరుగ ని వీరుడిని చూసి జాలికలిగిందో ఏమో...ఆ గుండె ఆగి ఆయనకు విశ్రాంతినిచ్చింది.
1985 మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం శాసనసభకు సీపీఐ(ఎం) అభ్యర్థిగా కామ్రేడ్ రావెళ్లను ప్రకటించింది పార్టీ. ప్రజలంతా హర్షించారు. తమ నేతను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని అందరూ ఆనందోత్సాహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. 1985 ఫిబ్రవరి 2న రావెళ్ల గుండెపోటుతో కన్నుమూసాడు. కన్న బిడ్డలను ఏనాడైనా ఎత్తుకున్నాడో లేదో గానీ.. కష్టజీవుల కోసం కడదాకా ఎర్రజెండాను ఎత్తుకునే తిరిగాడు. అందుకే మరణించి దశాబ్దాలు గడుస్తున్నా నిత్యం జనం గుండెల్లో సత్యమై ప్రవహిస్తూనే ఉన్నాడు...
- బండారు రమేష్
సెల్ : 9490098251