Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మార్పులొస్తున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తూ వారి, తల్లిదండ్రు లతో మాట్లాడటానికి సమయం కేటాయించడం లేదు. అయితే ఫోన్తో ఉపయోగంతోపాటే అనవ సర అంశాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో పిల్ల లు మాత్రం ఎక్కువగా అనవసర విషయాలకే ఉప యోగిస్తున్నారు. పిల్లలు వారి పాఠశాల నుంచి కళాశాలల నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులతో మాట్లాడటం, వారిలో పాఠశాల విషయాల గురిం చి చర్చించటం తగ్గిపోతున్నది. అదేపనిగా వారు ఫోన్ ఉపయోగిస్తు న్నారు. వీటన్నింటికీ ముఖ్య కారణం ఫోన్ వాడకమే కాదు మారుతున్న మానవ జీవన విధానం కూడా. జీవన విధానంలో మార్పుల కారణంగా పి ల్లలు, తల్లిదండ్రుల మధ్య ఏర్పడే ఆత్మీయ అనుబంధాలకు సమయం లేకు ండా పోతుంది. మారుతున్న జీవన విధానంలో భాగంగా తల్లిదండ్రులి ద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా వారి వృత్తిలో లీనమైనందువల్ల వారికి పిల్లలతో గడపడానికి సమయం దొరకడం లేదు. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని, వారి ఇష్టాల గురించి చర్చించాలని అనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు వృత్తిలో నిమఘ్నమై ఆలస్యంగా ఇంటికి రావడం, అలసట వల్ల సమయం కేటాయించరు. దీంతో వారి ఇష్టాలను, స్వేచ్ఛను పిల్లలు స్వతంత్రంగా తల్లిదండ్రులకు చెప్పలేకపో తున్నారు. దీంతో పిల్లలు స్మార్ట్ఫోన్లకు అలవాటు పడుతున్నారు.
ఈ ఫోన్ల వినియోగం పెరిగినప్పటి నుండి పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారి పిల్లలకు సరైన ప్రవర్తన నేర్పించలేకపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితులను అర్ధం చేసుకోలేకపోతున్నారు. దీంతో పిల్లలకు తల్లిదండ్రుల ఆదాయంపై అవగాహన లేకుండా భవిష్యత్లో వచ్చే ఇబ్బందులను తెలుసుకోలేకుండా ఉన్నారు. మరోవైపు జాగ్రత్తలు చెప్పే తల్లిదండ్రులు ఈ మధ్య పిల్లలకు నచ్చటం లేదు. పిల్లలు పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు చెపుతారు. అలా చెప్పడం వల్ల పిల్లలు జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకొని తిరిగి చక్కగా ఇంటికి వస్తారని వారి నమ్మకం. కాని పిల్లలు 'మీరు చెప్పకపోతే మాకు తెలియదా?' అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తనతోనే తల్లిదండ్రులపై పిల్లలకు, పిల్లలపై తల్లిదండ్రులకు అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. తల్లిదండ్రుల మాట సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగు తున్నాయి. ముఖ్యంగా వద్దన్న పనినే పిల్లలు పదేపదే చేయడం, నేర్చుకో వాల్సిన వాటిని పక్కకు పెట్టడం వంటివి తల్లిదండ్రులకు నచ్చడం లేదు.
జీవనశైలిలో మార్పులు వచ్చినా తల్లిదండ్రుల ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో మార్పులు రాకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉంటే వారి పిల్లల అలవాటు కూడా అదే విధంగా ఉంటాయి. పిల్లలకు తల్లిదండ్రులే ఒక నిఘంటువు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు ప్రేమా, ఆప్యాయతతో కూడి ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం బలపడి ఎలాంటి విభేదాలు లేకుండా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులని పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు అర్ధం చేసుకోగలుగుతారు.
- ఎస్.అనీల
సెల్ : 9492093209