Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రా మీణ పేదల కడుపు కొట్టి పెద్దల కడుపు నింపే విధంగా ఉన్న ది. రూ 30,42,230 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్కు రెవెన్యూ ఆదాయం రూ.20,20,926 లక్షల కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు. అంటే ఇంకా రూ.10,21,304 లక్షల కోట్లు లోటుగా ఉన్నట్టు బడ్జెట్ లెక్క లు చెబుతున్నాయి. ఈ లోటును తగ్గించుకోవడం కోసం ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పీయూసీలను సులభతర వాణిజ్య పద్ధతి పే రుతో అమ్మకం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమకూర్చుకుంటామని పార్ల మెంటులో ప్రకటించారు. ఆర్థిక శాఖ మంత్రి తన మాటల్లోనే దేశ స్థూల జాతీయ ఉత్పత్తి అరు నుండి 6.5 శాతం ఉండవచ్చు అని చెప్పినా వాస్తవ సర్వేలు జీడీపీ 4.5 శాతం మించి పెరగదని చెబుతున్నాయి. మరోవైపు పారిశ్రామికాభివృద్ధి ఆరు శాతం నుండి 2.5 శాతానికి పడిపోయిందనీ, ద్ర వ్యోల్బణం రేటు 4.1 శాతంగా నమోదైందని కేంద్ర మంత్రి చెప్పారు. కానీ వ్యవసాయ రంగంలో మాత్రమే జీడీపీ వృద్ధిరేటు 2.8 శాతం నుండి 2.9 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెంచి, రైతాంగాన్ని ఆదుకునే విధంగా బడ్జె ట్ రూపురేఖలు ఉంటాయనుకుంటే అందుకు భిన్నంగా నిర్మల సీతా రామన్ విధాన నిర్ణయాలను, బడ్జెట్ కేటాయింపులను ప్రకటించారు.
విద్యారంగంలో 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, 150 రైలు మార్గాలను ప్రైవేటీకరించడం, 5 కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపా ర సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం, ఆదాయపు పన్ను విధానాన్ని ఏడు స్లాబ్లుగా మార్పు చేయడంతోపాటు ఇతర దేశాలకు పని కోసం వెళ్లి 240 రోజులు ఉంటే వారిని ఎన్అర్ఐలుగా గుర్తించి వారి ఆదాయంపై ప న్నులు వసూళ్లు చేస్తామనడం సరైందికాదు. ప్రతి ఒక్కరికి వైద్యం అందిం చే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం సేవలు ప్రభుత్వ ప్రయివేట్ భాగ స్వామ్యంతో అభివృద్ధి చేస్తామనడం, స్మార్ట్ కరెంట్ మీటర్ల పేరుతో రీఛార్జి మీటర్లను ప్రవేశపెట్టడం, లక్ష గ్రామాలకు పవర్ నెట్వర్క్ ఏర్పాటు చేయ డమే తమ లక్ష్యమని ప్రకటించారు. మరోవైపు సామాన్యులు వినియోగించే వస్తువులైన చెప్పులపైన 25 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 35 శా తానికి, ఫర్నీచర్, పొగాకు, సిగరెట్లు, ల్యాప్టాప్స్ వంటివాటిపై 20 శాతం నుంచి 25శాతానికి ఎక్సైజ్ డ్యూటీని పన్నుల రూపంలో పెంచడం వంటి నిర్ణయాలు దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల అమలును వేగ వంతం చేయడంతోపాటు పేదలపైన భారం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు చెప్పకనే చెబుతున్నది. కృషి ఉడాన్ పథకం ద్వారా విమానాల్లో, కిసాన్ రైల్ పథకం ద్వారా రైళ్లల్లో రైతులు పండించిన తక్కువ కాలం నిల్వ ఉండే పంటలను ఇతర ప్రాంతాలకు తరలించి గిట్టుబాటు ధర ఉండేటట్టు పంటలను అమ్ముతామని చెప్పడం సానుకూల అంశమైనా గ్రామీణ రైతాంగానికి ఆచరణలో ఇది ఏమాత్రం తోడ్పాటును ఇవ్వదు.
పేదల సబ్సీడీలకు భారీ కోత
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆహార సబ్సిడీలు 70 వేల కోట్లు, ఎరువుల సబ్సిడీలు 10 వేల కోట్లు తగ్గించారు. ప్రధానమంత్రి కిసాన్ పథ కం కౌలు రైతులకు, బోరు సాగు దారులకు వర్తించదని కరాఖండిగా చెప్పా రు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న ద ళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు వృత్తిదారులు ఎక్కువగా నష్ట పోతారు. 2011 సామాజిక, ఆర్థిక కుల జనాభా సర్వే ప్రకారం ఆకలి సూ చీలో 117 దేశాల్లో 102వస్థానంలో భారతదేశం ఉంది. మూడో వంతు పి ల్లలు, మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా శా రీరక, మానసిక పెరుగుదల క్షీణిస్తున్నది. మరోవైపు ఆహారధాన్యాలు, కూ రగాయల ధరలు 60 శాతానికిపైగా పెరిగాయి. భేటీ బచావో బేటి పడా వో పథకానికీ నిధుల కోత విధించారు.
'ఉపాధి హామీ'కి మొండి చేయి
2008లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్థికమాంద్యం నుండి భారతదేశాన్ని బయటపడేసిన దానిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలకమైనదని అనే క సర్వేలు చెప్పినా మోడీ ప్రభుత్వం ఆ పథకానికి నిధుల కేటాయింపులో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. గత సంవత్సరం రూ.71 వేల కోట్లు కేటాయించగా ఈసంవత్సరం 61,500 కోట్లకు తగ్గించారు. దేశంలో 19 కోట్ల కుటుంబాలకు ఉపాధినిస్తున్న పథకానికి నిధులను తగ్గించడమంటే ప్రజల కొనుగోలు శక్తిని మరింత దిగజార్చడమే అవుతుంది. ఆర్థికమాం ద్యం వలన, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వలన గ్రామీణ ప్రాంత పేదల పనిదినాలు పడిపోతాయి. దీంతో వ్యవసాయ కూలీలకు పని 50 శాతానికిపైగా పడిపోయిందని వినియోగదారుల వ్యయ సర్వే 2018 చె ప్తున్నది. 2011-12లో రూ.1,138 ఆదాయం ఉంటే 2017-18 నాటికి రూ.1,082కు తగ్గింది. పని దొరకక ఇతర ప్రదేశాలకు వలసలు వెళ్తున్నా రని సర్వే చెప్పినా వీటిని నివారించటం కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ఒక్క పైసా కూడా అదనంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. స్వామినాథ న్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరను పంటలకు ప్రకటించే దానిలో, రైతుల రుణాల ను మాఫీ చేయడానికి బడ్జెట్లో ఒక్క పైసా కూడా ప్రకటించదానికి సిద్ధపడ లేదు. మరోవైపు బడాబాబులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించని రూ.70 వేలకోట్లను పారుబాకీల కింద రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం చూ స్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎవరి పక్షమో అర్థమవుతున్నది.
- బి.నక్షత్ర
సెల్ : 9490098901