Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో మనుషులకున్న మొట్టమొదటి అవస రం అన్నం, ఆకలి తీర్చుకోవడం. ఏ వ్యవస్థలోనైనా ముందు ఆ ప్రజానికానికి అన్నం సులభంగా రావాలి. కానీ ఆ మెతుకు నేడు పండించే అన్నదాతకు తప్ప అందరికీ అం దుతోంది. ఆరుగాలం కష్టపడినా ఐదువేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి రైతుది. అందరికీ తిండి కావాలి. కానీ ఆ అన్నదాత బాధలు మాత్రం ఎవరికీ పట్టవు. మనం తినే ప్రతి మెతుకు వెనక ఎంత కాయ కష్టం ఉందో ఎంతమందికి తెలుసు..? ఎండనకా, వాననకా ప్రతిక్షణం కష్టపడే రైతు బాధలు పట్టి ంచుకునే వారెవరన్నా ఉన్నారా? ఈ రోజు వ్యవసాయం పె ట్టుబడితోనే మొదలు పెట్టాలి. విత్తనం కొనుగోలు, ఎరు వులు, మందులు, దున్నకం, కూలీలు అన్నిటికీ డబ్బు అవ సరం. పైసలు లేనిదే వ్యవసాయం చేయలేని పరిస్థితికి చేరుకున్నాం. పొలం దు న్నకం మొదులు పంట చేతికొచ్చేదాకా అన్నింటికి డబ్బు లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి రైతన్నది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పేరుతో రైతులు అడుగడుగునా మోసపోతూనే ఉన్నారు. వీరిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా రైతులు బలవన్మరణా లకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాలలో దేశవాప్తంగా మూడున్నర లక్ష ్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంక సంస్థ వెల్ల డించింది. 2016లో 11,379 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, 2018లో 10,349 మంది చనిపోయినట్టు వెల్లడించింది. రైతు సంక్షేమమే ధ్యేయమనే నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయనడానికి రైతుల మరణాలే నిదర్శనం. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలుచేస్తామన్న ప్రభుత్వాలు ఏమయ్యాయి? కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక చాలామంది రైతులు దళారీల చేతిలో నేటికీ మోసపోతూనే ఉన్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరి వి అన్నట్టుంది అన్నదాత పరిస్థితి. రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగో లు చేసి మార్కెట్లలో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారు దళారీలు. ఫలితంగా కొందరు రైతులు అప్పులు తీర్చలేక మరణిస్తుండగా, మరికొంతమంది పుట్టెడు దు:ఖంతో ఉన్నఊరును వదిలి బతుకుదెరువుకోసం వలసల బాట పడుతున్నరు.
అన్నం బహుకుర్విత సంప్రదాయంలో వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మ ధ్యమం. ఉద్యోగం అధమంగా ఉండేది. కానీ నేడు వ్యవసాయం అధమంగా అయి పోయింది. నేడు పల్లెలకు, పంటలకు, రైతులకు దూరమవుతూ సమాజమంతా కార్పొరేట్ వ్యవస్థ చుట్టూనే తిరుగుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు, సిమ్కార్డులు మాత్రమే మన అభివృద్ధి అన్న భ్రమలో మనం బతుకుతున్నం. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే కొన్నేండ్లకు రైతు ఛాయచిత్రాన్ని ప్రదర్శనశాలలో చూడాల్సివస్తుంది. రాబోయే తరాలకు వ్యవసాయం పురాతన వృత్తులో ఒకటని చెప్పాల్సి వస్తుంది. నే టి తరం కలల వృత్తుల్లో అట్టడుగుస్థానంలో కూడా కర్షక వృత్తి లేకపోవడం బాధా కరం. వ్యవసాయాధారితమైన మన దేశంలో ఈ వృత్తిపై ఎవరికీ ఆసక్తి లేకపో వడం బాధాకరం. బిస్కెట్లు, చాక్లెట్లలాగ బియ్యం, పప్పులు కూడా ఆకర్షణీయమైన పొట్లాల్లో కొంటూ మురిసిపోతున్నామే గాని అది ఎక్కడ తయారవుతున్నాయి. అవి తయారుచేయడానికి నడుమొంచి కాయకష్టం చేస్తున్న రైతును మాత్రం గుర్తిం చలేని స్థితిలో మనమున్నాం. పొలం గట్టు చేరని ప్రభుత్వ ఆర్థిక విధానాలు, అమలుకా ని రుణ మాఫీ, అందీ అందని పథకాలతో సాగు చేస్తున్న రై తుల బతుకు ఆగమ్యగోచ రంగా మారింది. రైతు సంక్షే మమే తమ లక్ష్యమంటూ గొ ప్పలు చెప్పుకుంటున్న ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన పథకాలు రైతుల ఆత్మహత్యలను ఆపగ లిగాయా? ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏ కారణంచేతనైనా చనిపోతే దానికి నిరసనగా రక్షణ కల్పించాలని, పనిభారం తగ్గించాలని ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు చేసే జ నాలు మనకు కడుపునిండా అన్నం పెడుతున్న రైతు బలవన్మరణానికి పాల్పడుతు న్నా ఎందుకు? ప్రశ్నించలేకపోతున్నారు. వారి బాధలు ఎందుకని ఎవరూ అడగ రు? ఇగ మన నాయకులు ప్రవేశపెట్టిన పథకాల పరిస్థితి ఎలా ఉందంటే బతికుం డగా పనికి రానీ బీమా చచ్చాక వర్తించి ఎంతమంది రైతులను ఆదుకుంటుందో ఆలోచించాల్సిన విషయం. ఉన్నోడికి ఉట్ల పండుగ లేనోడికి లొట్ల పండుగ అన్నట్టుంది రైతు బంధు పథకం. మరి కౌలు రైతులేం కావాలి. బలవన్మరణాలకు పాల్పడిన వ్యవసాయదారుల్లో చాలా మటుకు కూలీలే ఉండటం నమ్మలేని నిజం. 24 గంటల కరెంటు, సారవంతమైన భూమి ఉన్నా సరైన వ్యవసాయ పద్ధతులు తెలిపేవారు లేక, నకిలీ విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందుల వాడకం మూలంగా చేతిపంట దెబ్బతిని రైతులు అప్పులపాలవుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కుటుంబ పోషణ పిల్లల చదువు, పెండ్లిలకు భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. వీరి అవసరాలే ఆసరగా చేసుకుని రియల్ వ్యాపారులు అధిక డబ్బులు ఆశ చూపించి పంట భూములను బీడు భూములుగా మార్చి కంచెలు వేస్తున్నారు. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పచ్చని పంట పొలాలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగా, సంస్థలుగా, ప్లాట్లుగా దర్శనమిస్తున్నాయి.
తినేవాడి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. కాని పండించే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కూటి కోసం కోటి తిప్పలంటారు. కానీ ఆ కూటిని పండించే రైతు బాధలు తీరితేనే మనందరికీ మెతుకందేదీ. కాబట్టి అన్నదాతనాదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. కనుక ప్రజలు, ప్రభుత్వాలు రైతును ఆదుకుని అన్నదాతను రక్షించాలి. సరైన వ్యవసాయ పద్ధతులు అందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దళారుల చేతివాటాన్ని నివారించేలా కృషి చేయాలి. సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, రసాయనిక ఎరువులు, మందుల వాడకం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి. సబ్సిడీ విత్తనాలను, ఎరువులను, పంటమార్పిడి పద్ధతులను అందుబాటులోకి తేవాలి.
- రాజమోని శివలీలసావిత్రి
సెల్ : 9640289695