Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజికమాధ్యమాల నిండా కోవిడ్-19 (కరోనా) ముచ్చట్లే. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే సందేశాలు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారితో పాటు రోగులు, డాక్టర్ల అనుభవాలు. మన దేశంలోకి రానంత కాలం ఒక వర్గం వారంతా కరోనా వైరస్ రాకకు, ఆహారపు అలవాట్లకు ముడిపెట్టి చేసిన వాదనలకు దాదాపు తెరపడింది. ఇక దేశంలో, రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే అందరి జిజ్ఞాస. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల ముసుగులో ప్రజలను మోసం చేస్తూ వచ్చిన వారికి చెంపపెట్టులా ప్రజలు శాస్త్రీయ అవగాహన పెంచుకోవడంపై ఆసక్తి చూపించడం తాజా పరిణామం. పర్యావరణం, పారిశుధ్యంపై ప్రజలు తమ కోసం తామే అన్నట్టు అవగాహన పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాష్ట్రం,దేశం, భాష తదితర వాదనలన్నింటి స్థానంలో సామాజిక మాధ్యమంలో మనుష్యులందరి సమస్య ఒక్కటే అని, కరోనాను నిర్మూలించడమే ప్రస్తుత కర్తవ్యంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. మనుష్యులంతా కలిసి కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కరోనాను రావద్దంటూ పాటలు, సెటైర్లతో కళాకారు పోస్టింగ్లు పెట్టడం కూడా ప్రజల్లో అవగాహన పెంచుతోంది.
- కొత్తూరు ప్రియకుమార్