Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు హెల్త్కార్డులు ఇచ్చింది. అవి తీసుకొని ఏ కార్పొరేట్ దావఖానాలోకి వెళ్ళినా రోగులకు అవి చూసి వైద్యం చేయాలి. బిల్లు సర్కార్ చెల్లించాలి. కానీ, కొన్ని దవాఖానాల్లో మావద్ద మెడికల్ రీయంబర్స్మెంట్ మాత్రమే ఉందని చెపుతున్నారు. చేసేది లేక అవస్థలో ఉన్న రోగులు అందుకు అంగీకరించి ముందుగానే బిల్లు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన మెడికల్ రీ-యబంర్స్మెంట్ ఫైల్ను సర్కార్కి పంపిస్తున్నారు. పెన్షన్ దారులు, ఉద్యోగులు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిపార్ట్మెంట్కి పంపిన మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రొఫైల్స్ నెలల తరబడి అక్కడే ములుగుతున్నాయి తప్ప వైద్యం చేయించుకున్న ఉద్యోగులకు, పెన్షన్దారులకు సకాలంలో ఏమాత్రం న్యాయం జరగడం లేదు. అవినీతికి జరంత కూడా ఆస్కారం లేదంటున్న సర్కార్ వెంటనే స్పందించి వైద్యం ఖర్చులు, ఫ్రొఫైల్స్ పంపుకున్న ఉద్యోగులకు, పెన్షన్ దారులకు మెడికల్ రీయబర్స్మెంట్ వెంటనే అందేలా చేసి, నిజాయితీ గల సర్కార్ అని నిరూపించుకోవాలి. ఆరోగ్యశాఖ మంత్రి శ్రద్ధ తీసుకోవాలి.
ఎస్. భూదేవి, ఇందూరు,
నిజామాబాద్జిల్లా.