Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాభాల బాటలో నడిచే పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుప్పకూలిపోవటంతో గతంలో సంపాదించుకున్నది కూడా మిగలని పరిస్థితికి వచ్చారు. రైతులు ముఖ్యంగా సన్న చిన్న పౌల్ట్రీ పరిశ్రమలు నిర్వహించేవారికి బతుకు భారమైంది. పెద్ద పౌల్ట్రీ పరిశ్రమల జయమానుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. ఒక్కపక్క గంగోరా వ్యాధి, మరోపక్క కరోనా వ్యాధి గురించి అపోహాలతో చికన్ ధర ఒక్కసారి రూ.200 నుంచి రూ.100, 50లకు పడిపోయింది. అమ్మకాలులేక వాటి దాణా ఖర్చులు భరించలేక ఎందరో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా కొన్నిచోట్ల పంచటం జరిగింది. కొందరు లారీల కొద్దీ కోళ్లను పూడ్చిపెట్టడం జరిగింది. ఇది పౌల్ట్రీ యజమాను లకు కోలుకోలేని దెబ్బ. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పౌల్ట్రీ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటే ఆ నష్టపరిహారాన్ని త్వరితగతిన ఇచ్చి ఆదుకోవాలి. భవిష్యత్ కాలంలో పౌల్ట్రీ పరిశ్రమ పుంజుకునేలా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి. అలాగే ఇప్పుడున్న పౌల్ట్రీ ఫాంలోని కోళ్ళకు ముందుజాగ్రత్తగా పశుసంవర్ధకశాఖ వారు టీకాలు, మందులు ఇచ్చి అవి వ్యాధిబారిన పడకుండా కాపాడాలి. మళ్ళీ పరిశ్రమను అభివృద్ధి లోకి తీసుకురావాలి. అపోహలకు పోయి బికెన్ను తినకుండా ఉండటం సరికాదు. వాటిపై అవగాహన పెంపొందించు కోవాలి. వ్యాపా రాభివృద్ధికి తోడ్పడాలి.
ఎ.రఘురామారావు, ఖమ్మం.