Authorization
Mon Jan 19, 2015 06:51 pm
12
బానిస యజమానులః విధానంలో గానీ, ఃభూస్వాములః విధానంలో గానీ, యజమానులు అమ్మే ఉత్పత్తులకు స్పష్టమైన ఃధర విధానంః ఏదీ లేదు. అమ్మకం ఏ ఃధరఃకి సాధ్యమవుతుందో ఆ ధరకి అమ్మడమే. లెక్కలవీ స్పష్టంగా నిర్ణయమై కాదు.
భూస్వాములు, కౌలు రైతులు చెల్లించ వలిసిన కౌళ్ళ మీదే జీవించే విధానంలో ఃరాజ్యాంగంఃలో అధికారం అంతా పాత రకానిదే. గత కాలంలో అధికారం అంతా, బానిస యజమానులది అయినట్టు, తర్వాత కాలంలో ఆ అధికారం భూస్వాములదే.
పెట్టుబడిదారులు ఎప్పుడు?
పెట్టుబడిదారులు, హఠాత్తుగా అవతరించిన వాళ్ళు కారు. ఃచేతి వృత్తులః వాళ్ళు తమ సరుకుల్ని అమ్ముకునే పద్ధతి ఃకౌలు పద్ధతిఃతో పాటే సాగుతూ వుంది. చేతి వృత్తుల వాళ్ళు చేసే ఃసరుకుల అమ్మకాల పద్ధతిః పెరగడమే ఃపెట్టుబడిదారీ పద్ధతిఃగా పేరు తెచ్చుకుంది.
పెట్టుబడిదారీ విధానం అంతా అమ్మకం కోసం, రక రకాల సరుకుల్ని తయారు చేయించడమే.
బానిసలు, కౌలు రైతులుగా మారినట్టు కౌలు రైతు కుటుంబాల నుంచి కొంత జనమే, పెట్టుబడిదారుల పరిశ్రమల్లో కార్మికులుగా మారారు. అంటే, యజమానుల కింద చేసే శ్రామికులుగా.
ఃశ్రామికులుః అన్నప్పుడు, యజమానుల ఆజ్ఞల ప్రకారం శ్రమలు చేసే వారూ కావచ్చు, లేదా స్వతంత్రంగా సరుకుల్ని చేసి అమ్ముకునే వారూ కావచ్చు.
పెట్టుబడిదారీ సరుకుల విధానం వృద్ధి చెందుతోన్న కొద్దీ, స్వతంత్ర శ్రామికులు, యజమానుల కింద కార్మికులుగా మారక తప్పని పరిస్థితులు పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే, సరుకుల అమ్మకాల్లో, స్వతంత్ర శ్రామికులు తమ సరుకులకు నిర్ణయించే ధరలు, పెట్టుబడిదారీ ధరలతో పోటీ పడలేవు.
ఃదుస్తులః పరిశ్రమలో, చొక్కా ఉదాహరణని ఇంకా చూడాలి. అప్పులు ఇస్తే ఃవడ్డీలుః, భూములు ఇస్తే ఃకౌళ్ళ చెల్లింపులుః వెనకటి కాలం నించీ వున్నవే.
ధరల నిర్ణయాలు ఎలాగ?
దీన్ని మనం ఇంకా చూడలేదు. పెట్టుబడిదారుడు, తను తయారు చేయించిన సరుకులకు ఃధరల్నిః నిర్ణయించేటప్పుడు వాటిని ఎలా నిర్ణయిస్తాడు? - ఎలాగంటే ఒక చొక్కా సంగతి ఇంకా చూడాలి.
ఆ సరుకు తయారీకి తను ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఆ ఖర్చంతా వెనక్కి రావలిసిందే కదా? చొక్కా తయారీ కోసం 100 పెట్టాడు కాబట్టి, చొక్కా ఃధరఃలోకి మొదట, ఆ 100ని చేరుస్తాడు. అంతేనా? - అంతేనా చొక్కా ధర? అంతే కాదు. ఇంకా చేర్చవలిసినవి అనేకం ఉన్నాయి - అనుకుంటాడు. తను పెట్టిన డబ్బు మీద ఃవడ్డీః పేరుతో కొంత రావాలి. పరిశ్రమ ఏ స్థలం మీద వుందో దానికి ఃకౌలుః పేరుతో కూడా కొంతా. పని జరిగే బిల్డింగు, ఉత్పత్తి సాధనాల్లోకే వెళ్తుంది. ఆ బిల్డింగు కింద వున్న నేలకి కౌలు రావాలనుకుంటాడు యజమాని. ఈ వడ్డీ, కౌలు - అనేవి వెనకటి నుంచీ యజమాను లకు వస్తూ వున్నవే. ఃపరిశ్రమఃని నడుపుతున్నాడు కాబట్టి దాని కోసం పెట్టుబడి దారుడు, తనకు ఃజీతంఃగా కొంత అధికంగా! ఈ జీతం కార్మికుడికి ఇచ్చే జీతం లాగ వుండదు. ఃపరిశ్రమఃని పెట్టిన వాడు ఏం శ్రమ చేస్తున్నాడు? ఈ ప్రశ్నే ఉండదు. జీతం చాలా రావాలి. ఃపరిశ్రమః ని పెట్టాడు కాబట్టే అంత జీతం! ఇంకో ముఖ్య విషయం, తయారై వున్న సరుకుని అమ్మి పెట్టే వర్తకుడికి కొంత ఃకమిషన్ః ఇవ్వాలి. ఈ ఃవర్తక కమిషన్ఃని కూడా ఃసరుకు ధరఃలోకి ఒక భాగంగా కలుపుతారు. (ఈ ఃకమిషన్ః సంగతి చాలా తెలుసు కోవాలి.)
ఈ సరుకు వల్ల వచ్చే ఆదాయం మీద ప్రభుత్వానికి చెల్లించ వలిసిన ఃపన్నుః కూడా ఃధరః లోనే ఒక భాగం! సరుకుని అమ్మిన ఃధరః లోనించి కాకపోతే, ఃపన్నులుః ఎలా, ఏ డబ్బుతో, చెల్లిస్తాడు? ఃసరుకుఃని గురించి ప్రజలకు తెలియ జేయాలంటే ఃప్రకటనలుః వుండాలి. ఈ ప్రకటనల ఖర్చు కూడా సరుకు ధరలోకి చేరే ఒక భాగం! ఇటువంటి వన్నీ అయిన తర్వాత పరిశ్రమలో పెట్టిన ఃపెట్టుబడిః మీద రావలిసింది ఃలాభంః! ఇది కూడా సరుకు నుంచి రావలిసిన ఃధరఃలో భాగమే. - ఈ రకంగా ఈ అంశాలన్నీ కలిసి ఒక సరుకుకి ఃధరః ఏర్పడుతుంది.
మన ఉదాహరణలో వున్న ఃచొక్కాః ధరని చూడాలంటే? దాని కోసం పెట్టిన ః100 పెట్టుబడిః వెనక్కి వస్తూ, దానితో పాటే ఆ వడ్డీ, కౌలు, లాభాలు - వంటి ఇతర అంశాలు కూడా రావాలి. కాబట్టి, చొక్కాకి నిర్ణయం అయ్యే ఃఅమ్మకం ధరఃని 120 అనుకుందాం. ఈ ధరలో 100 వరకూ వున్నది ఃపెట్టుబడిః. ఇది ఉత్పత్తి సాధనాల ఖర్చు అయిన 80 ం కుట్టు శ్రమ కోసం జీతంగా ఇచ్చిన 20 ొ 100. ఇది తెలుసు కదా?
ఃపెట్టుబడిః పెట్టడంలో ఃగొప్పః ఏమీ లేదు. సరుకుకి అమ్మకం జరగగానే, అది వెనక్కి వచ్చేస్తుంది గానీ, అది ఎటూ పోదు. ఆ పెట్టుబడిని, ఆ మర్నాడు మళ్ళీ ఇంకో కొత్త సరుకు కోసం ఖర్చు పెడితే, ఆ రెండో చొక్కాకి కూడా అమ్మకం జరిగి, ఆ పెట్టుబడి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎన్ని వందల సార్లయినా ఆ పెట్టుబడి అలా వెనక్కి వస్తూనే వుంటుంది. కానీ పెట్టుబడిదారుడికి ఆ ఃపెట్టుబడిః పెట్టినందుకు ఎంత కీర్తో! వాడేదో ఃదేశ సేవః చేసేస్తున్నాడని! దేశానికి ఃసేవః అంటే ఆ దేశం, అంత ఃసేవః కావలిసిన దౌర్భాగ్యపు స్థితిలో వుందని అర్థమే కదా? పెట్టుబడిదారులు అలా అర్థం చేసుకుని సిగ్గు పడరు. తాము, దేశ సేవలు చేస్తున్నామనే అనుకుంటారు.
ఇక మనం ఆలోచించ వలిసింది చొక్కా ఃధరఃలో 100 కన్నా ఎక్కువగా వున్న దాన్ని గురించి. ఆ ఎక్కువగా వున్నది ఎంత? - ఇంకో 20. ఈ చివరి 20ని గురించే. ఈ 2వ 20లో వున్న అంశాలన్నీ చొక్కా కోసం నిజంగా జరిగిన ఖర్చులేనా కాదా - అని ఆలోచించాలి. దీన్ని ఒక్క సరుకు విషయం గానే అనుకోవచ్చు. లేదా, ఒక రోజు తయారైన ఃమొత్తం సరుకు విషయంఃగా అయినా అనుకోవచ్చు.
(1) వడ్డీ గురించి: ఃవడ్డీః కోసం, సరుకు ధరలోకి 10ని, పెట్టుబడి దారుడు చేర్చాడనుకుందాం. సరుకు అమ్మకం జరిగిపోతే, ఆ ఃధరఃలో నుంచి వచ్చిన 10 డబ్బు ఎవరికి వెళ్తుంది? - ఇంకెవరికి? ఃఅప్పుః ఇచ్చిన వాడికి. అప్పు ఇచ్చింది దేనిని? - పెట్టుబడిదారుడు సరుకు తయారీ కోసం మొదట 100ని ఖర్చు పెట్టాడు కదా? ఆ మొదటి 100నే, అప్పు ఇచ్చినదిగా అనుకుంటాడు. ఆ 100 డబ్బు ఎక్కడికీ పోదు. వెనక్కి వచ్చేస్తూనే వుంటుంది. అయినా, దానికి ఃవడ్డీః రావాలనే అనుకుంటారు. ఒక వేళ ఆ 100 డబ్బు అప్పు తెచ్చింది కాకుండా, పెట్టుబడిదారుడి స్వంత డబ్బే అయితే? అది అతని తండ్రి నుంచో, తాత నుంచో వచ్చింది అయితే? అది వాళ్ళ శ్రమలతోనే వచ్చిందే అయినా, అప్పుడైనా ఆ ః100ః మీద ఃవడ్డీః తీసుకోవడం శుద్ధ తప్పే. ఎందుకంటే ఆ 100 డబ్బు వెనక్కి వచ్చేస్తూనే వుంటుంది కాబట్టి. దాని కోసం కొంత ఎక్కువని ఎందుకు తీసుకోవాలి?
ఃడబ్బుః అంటే, ఃశ్రమఃతో తయారయ్యే బంగారమే. ఃవడ్డీఃగా ఆ 10 డబ్బుని తీసుకున్న వాళ్ళు ఏ శ్రమ చేసినందుకు ఆ డబ్బుని తీసుకున్నట్టు? ఆ 10 డబ్బుతో ఏదో ఒక ఉత్పత్తిని కొంటారు కదా? ఆ ఉత్పత్తి కోసం వాళ్ళు ఏమైనా శ్రమ చేసినట్టా? ఏ శ్రమ చేసి నందుకు ఆ ఉత్పత్తిని వాడతారు? ఃవడ్డీః అనేది కొంత డబ్బు. అది కొంత శ్రమతో తయారైన ఉత్పత్తి. ఆ ఉత్పత్తిని, ఏ శ్రమ చెయ్యకుండా తీసుకోవడానికి అందే డబ్బే వడ్డీ. అది నీచమైన తప్పు. తప్పుల్లో కూడా కొంత మంచి - చెడ్డలు వుంటాయి. ఃవడ్డీః పేరుతో కొంత భాగాన్ని సరుకు ఃధరఃలోకి చేర్చడం అంటే, అదే నీచమైన లెక్క. శ్రమ చెయ్యకుండా ఃసరుకుః ద్వారా ఃవడ్డీః పేరుతో కొంత డబ్బుని సంపాదించడం అది.
(ఇంకా వుంది)
రంగనాయకమ్మ