Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ మనిషి జీవితంలో విద్య అనేది ఎంతో విలువైన అంశం అని, ఒక ప్రాంతం గానీ, ఒక దేశం గానీ అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా అభివృద్ధి చెందవలసి ఉంటుందని మనందరికీ తెలుసు. నేటి సమాజంలో విద్య అనేది ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కుగా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. మనిషి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఒక కీలకమైన దశలో ప్రారంభమయ్యే విద్య. దానిని వ్యాపారంగా చేసుకొని విద్యార్థుల తల్లిద్రండ్రుల యొక్క బలహీనతను పసిగట్టి వారికి మార్కులను, ర్యాంకులను ఎరవేసి వివిధ పేర్లతో వాళ్ళును ఆకర్షించే విధంగా చేసుకుంటూ, వారిని ఆర్థికంగా దోచుకుంటూ ఈ కార్పొరేట్ కళాశాలలు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాయి. అదే క్రమంలో విద్యార్థులను బాధ్యతా యుతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఈ గొలుసుకట్టు కళాశాలలు విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ, వారిని ఆత్మహత్యలు వైపు ప్రేరేపించే విధంగా కార్యాచరణ కొనసాగిస్తున్నయి.
ఆనాడు మన స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటం చేసినటువంటి తరుణంలో ఏనాడూ ఉద్యమంలో కలిసిరాని కార్పొరేట్ కళాశాలలు నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పంథాంలో ఏనాడూ బోర్డు యొక్క నియమ నిబంధనలు గానీ, ప్రభుత్వా ఆదేశాలను గానీ పాటించిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రతీ ఏడాది బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్దేశించే నియమ నిబంధనలు మాకు పట్టవంటూ వారు బేఖాతరు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కంటికి కనిపించని కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్యా జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించాలనే సంకల్పం రీత్యా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూషన్ను ప్రకటించడం జరిగింది. దానికి కార్పొరేట్ కళాశాలల యజమాన్యాలు స్పందించిన తీరు చాలా దురదృష్టకరం. మూడు జిల్లాల్లో వారి ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో వారి వద్ద పని చేస్తున్న ఉపన్యాసకులను కనీసం స్పాట్ వాల్యూషన్కు పంపనటువంటి దుశ్చర్యలకు పాల్పడటం జరిగింది. నామ మాత్రంగా అక్కడున్న లెక్చరర్స్ను 15 నుంచి 20శాతం మాత్రమే పేపర్ వాల్యూషన్కు పంపడం అనేది చాలా విచారకరం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. అది చాలదంటూ కార్పొరేట్ కళాశాలలు నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాలు దాటి మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం అనే ఉద్దేశంతో అన్నీ జిల్లాలకు వ్యాపించాలనే ఆలోచనతో జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో కళాశాలలను విస్తరింప చేసేందుకు పాల్పడుతున్నారు.
వీరు జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో విస్తరిస్తే భవిష్యత్ మరింత దారుణంగా ఉంటుంది. ఇప్పటికే బోర్డు నిబంధనలను పాటించక, ప్రభుత్వ ఆదేశాలను పాటించక ఏవైతే వారు చేస్తున్నటువంటి చర్యలకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పటికే తలలపట్టుకొని నానా యాతనపడుతున్న దాఖలాలు మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ఆ గొలుసుకట్టు విదానాన్ని నిర్వహిస్తున్న ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో అవి ఆలోచించాలి. పొట్టకూటికోసం తెలంగాణ నిరుద్యోగ పట్టబద్రులు ఏర్పాటు చేసుకునటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి పొట్ట కొట్టే ప్రయత్నం మానుకోవాలి. వారు నాణ్యమైన విద్యను అందించటానికి ఏర్పాటు చేసుకునటువంటి కళాశాలలు గ్రామీణ వాతావరణంలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
నేటి సందర్భంలో ''ఊరంతా ఓ చింత ఊసుగల్ల వారిది ఓ చింత'' అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి ఈ కార్పొరేట్ కళాశాలలు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నటువంటి తరుణంలో 2020-2021 విద్యా సంవత్సరానికిగాను ఏమిచేయాలో తోచక విద్యార్థులు, విద్యార్థుల తల్లిద్రండ్రులు, అధ్యపకులు డోలాయమనంలో (అయోమయం) ఉన్న తరుణం ఇది. కాబట్టి విద్యాశాఖ మంత్రి వర్యులు, వివిధ శాఖల ఆదిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ దయచేసి ఆలోచన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటటంటే విద్యార్థులకు కావలసినటువంటి గతంలో ఉన్నటువంటి 220పని దినాలను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. దీనితో పాటు ఉన్న సమయాన్ని తగ్గించడానికి ఆలోచన చేయాలి. గతంలో పనిదినాలు ఆదివారం నుంచి శనివారం వరకు పెట్టడం జరిగింది. మరి ఇందులో ఏదైనా ఒకవారం మొదటి రోజును సెలవుగా లేక ఆఫ్ డేగా ప్రకటించడానికి సర్దుబాటు చేయాలి. దానితో పాటుగా ఏవైతే ఆన్లైన్ క్లాసులు పెట్టడానికి ముందు ఆ ఆన్లైన్ క్లాసులను విద్యార్థులకు మనం ఏదైనా ప్రత్యామ్నాయానికి అవసరమైన సంబంధితశాఖలపైనా ఉంటుందని ఆలోచన చేయాలి. అంటే ఒకటి దూరదర్శన్, 'టీ' సాట్. మన సోషల్ మీడియానే కాకుండా విద్యార్థులకు ముఖ్యంగా ఈ ఫోన్ ద్వారా మనం ఈ ఆన్లైన్ క్లాసులు చెప్తే ఎంత వరకు వారికి అందుతుంది. అంత డేటా మనం ఇవ్వగలుగుతామా? ఈ మొబైల్ కంపెన్సీ వారికి కావలసినటు వంటిది ఉచితంగా అందించగలుగుతుందా? అనేది కూడా పెద్ద ప్రశ్న. అలాంటి ఆదేశాలను స్పష్టంగా అందించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. దానితో పాటు ఏయే ణay ఔశీతీసఱఅస్త్ర ణayర పెడుతున్నాం. విద్యార్థుల యొక్క ఫెఫార్మెన్స్ ఆధారంగా ఆన్లైన్ క్లాసులు వినడం ద్వారా విద్యార్థికి ఇన్సెంటీవ్ పాయింట్స్ (మార్కులు) యాడ్ చేయటానికి అవకాశం ఉంటుందా? పరీక్ష సమయాన్ని తగ్గించటానికి అవకాశాలు ఉన్నాయా? సిలబస్ను కూడా ఏమైనా ఆల్టర్నేట్గా తగ్గించే ఆలోచన ఉందా? ఒక వేల తగ్గిస్తే సిలబస్ ఎంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. సాద్యాసాద్యాలను నిపుణులతో ఆలోచన చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే అటు తల్లిదండ్రులు గానీ, ఇటు విద్యార్థులు గానీ కన్ఫ్యూజ్కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ అధిపతులు, సంబందిత అధికారులు అందరూ ఆలోచనచేసి దీనిపై తొందరగా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా దీనిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ప్రతి విద్యా సంస్థపైన ఉంటుంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి చదువుతో పాటు ప్రాణం కూడా ముఖ్యం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ విద్య సంస్థలను నిర్వహించాలి. విద్యార్థుల శ్రేయస్సే మనకు ముఖ్యం. అందువల్ల నాణ్యమైన విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా బావించి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యా సంస్థలను నిర్వహించడం ఇప్పుడొక సవాల్. ఇది గుర్తించి తగు మార్గదర్శకాలను విడుదల చేస్తే అందరూ దాని పట్ల తగు ఏర్పాట్లు చేసుకుంటారు.
గౌరీ సతీష్
సెల్: 9989021453