Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూరల్ జిల్లా కలెక్టర్ హరిత
నవతెలంగాణ-పర్వతగిరి
గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికలు,పల్లె ప్రకతి వనాలు తదితర అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత ఆదేశాలు జారీచేశారు. మండలం లోని శ్రీనగర్, చౌటపల్లి, పర్వతగిరి, కల్లెడ గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకతి వనాలు, రైతు వేదిక ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పల్లెలను ప్రగతి పథంలో రూపురేఖలను మార్చి బంగారు తెలంగాణ సాధించే దిశగా కషి చేస్తోం దని అధికారులు పనుల్లో జాప్యం చేయకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఏపీఓ సుశీల్ కుమార్, పీఆర్ఏఈ భిక్షపతి పాల్గొన్నారు.
సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం సందర్శించి పరిశీలించారు. ఆమె రైతు వేదిక నిర్మాణాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పనులను వేగవంతంచేసి దసరా పండుగలోపు రైతు వేదికల నిర్మాణాలను పూర్తిచేసినందుకు ఆమె అధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రశంసించారు. గవిచర్ల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. డిఆర్డిఓ పీడీ సంపత్ రావు,సంగెం మండలం జెడ్పిటీసీ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ మల్లేశం, రైతుబంధు అధ్యక్షులు కందకట్ల నరహరి, సర్పంచ్ దొనికెలా రమశ్రీనివాస్ పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు:
కాపులకనపర్తి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ ంలో ఎలాంటి అభివద్ధి పనులు చేస్తున్నారంటూ వివరాలు అడిగారు. గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులు,వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలు, శ్మశానవాటిక, వివిధ అభివద్ధి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. మల్లీ పునరావతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.