Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఆర్డీవో కిషన్ నాయక్
శాయంపేట: ప్రజలకు ఆత్మస్థైర్యం కలిగించడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని పరకాల ఆర్డీవో ఎల్. కిషన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్ హాల్లో బుధవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలులో భాగంగా పరకాల సబ్ డివిజన్ పోలీసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పోలీసు శాఖ ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో ప్రజలకు మరింత చేరువ అయ్యిందన్నారు. పోలీసు శాఖలో ఐపీఎస్, ఉన్నతాధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారని, సంఘవిద్రోహ శక్తుల కాల్పులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు 24 గంటలు విధులు నిర్వహిస్తుండడంతోనే మనం ప్రశాంతంగా నిద్ర పోతున్నామన్నారు. పరకాల ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ పద్ధతి ప్రకారం నక్సలిజాన్ని అరికట్టడంలో ఎంతోమంది ఉన్నతాధికారుల తమ విలువైన ప్రాణాలను బలి చేశారన్నారు. రక్తదాన శిబిరంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కతజ్ఞతలు తెలియజేశారు. ఐఆర్సి ఎస్ చైర్మెన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈ. వి. శ్రీనివాసరావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, రెడ్ క్రాస్ సభ్యులు బండి సారంగపాణి, శాంతి కుమార్, రమణారెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, ఆత్మకూరు, పరకాల సిఐలు రంజిత్, మహేందర్, ఎస్సైలు అక్కిన పల్లి ప్రవీణ్ కుమార్, జక్కుల రాజాబాబు, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.