Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు ఎస్పీ శ్రీనివాసులు
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
నవతెలంగాణ-భూపాలపల్లి
పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిలాల ఏఆర్ ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్లో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాటా ్లడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహిం చలేమన్నారు. పోలీసులు ఉద్యోగ నిర్వహణలో భాగంగా కుటుంబానికి, పండుగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. శాంతి భద్రతల కోసం పౌరులు పోలీసులకు సహకరించాలని కోరారు. అదనపు ఎస్పి శ్రీనివాసులు, ఏఅర్ అదనపు ఎస్పీ సదానంద రెడ్డి, అమర వీరుల స్థూపానికి, నివాళులు అర్పించి, సెల్యూట్ చేశారు. ఆ తరువాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, ఆర్మూ డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్ జిల్లాలోని జిల్లా పరిధిలోని సిఐలు ఎస్ఐలు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సుబేదారి: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ వీరులకు జనగామ జిల్లా డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, పోలీసులు ,కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆరోగ్యం బాగాలేక వేడుకలకు హాజరు కాలేకపోయారు.
ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరం లోని మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో బుధవారం పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. బుధవారం పీటీసీ మామునూరు లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా పోలీస్ అమర వీరులకు మౌనం పాటించారు. వారి సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్, రాగ్య నాయక్, ఆర్ఐ లు చంద్రశేఖర్, కాశీరాం, సుధీర్, ఆర్ ఎస్ ఐ సుధాకర్, దశరథం, తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్సై ప్రశాంత్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు, స్వేరో విలేజ్ లెర్నింగ్ సెంటర్స్ విద్యార్థులు.విజ్ డమ్ స్కూల్ విద్యార్థులకు ఆయుధాల పనితీరును, కేసు విచారణ తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై యాదయ్య, సిబ్బంది రమణ లింగమూర్తి, గణపతి, రాజు,మోహన్, ఆశీర్వాదం, సదానందం పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెక్కొండ పోలీస్స్టేషన్లో అమవీరులకు నివాళులర్పించారు. కోవిడ్ నేపధ్యంలో పోలీస్స్టేషన్లోనే సీఐ తిరుమల్, ఎస్సై నాగరాజు, ఏఎస్సైలు వేణుగోపాల్, సాంబరెడ్డి, హెడ్ కానిసేబుళ్లు, కానిస్టేబుళ్లు పోలీసు అమరులకు మౌనం పాటించి నివాళులర్పించారు.