Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు ప్రారంభమై నేటికి యేడాది
- అయినా పూర్తి కాని రోడ్డు పనులు
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-న్యూశాయంపేట
ట్రైసిటీలోని ప్రజలకు పద్మాక్షమ్మ రోడ్డు చాలా ప్రధా నమైన రహదారి అటు కాజీపేట ప్రజలు ఇటు వరంగల్ ప్రజలు, చుట్టుపక్క విలీన గ్రామాల నుంచి కూడా నిత్యం వందలాది మంది వాహనదారులు హనుమకొండ చౌరస్తా మరియు కొత్త బస్టాండ్ రావాలంటే ఈ రోడ్డు మీదనే ప్రయాణం చేస్తూ ఉంటారు. బతుకమ్మ పండుగ కూడా ఈ రోడ్డు మీదనే నిర్వహి స్తుంటారు. హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షమ్మ గుట్ట మీదుగా న్యూ శాయంపేట చౌరస్తా వరకు కేవలం రెండే రెండు కిలోమీటర్లు నిత్యం ఈ రోడ్డు పై న్యూ శాయంపేట, హంటర్ రోడ్డు, కాజీపేట, వరంగల్ వాసులతో పాటు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటారు. గతేడాది బతుకమ్మ పండుగ వారం రోజుల ముందు అప్పటి మున్సిపల్ కమిషనర్, ఇప్పటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్ ,కూడా చైర్మెన్ వివిధ అధికారుల తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారం రోజుల్లో బిటీ రోడ్డు వేస్తామని చెప్పి పనులు కూడా ప్రారంభించారు. కానీ గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు రోడ్డు పనులు ముందుకు సాగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డంతా గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రజలు అరిగోస పడు తున్నారు. రోడ్డు పడుతుందని సంవత్సర కాలంగా ఎదురు చూసి న ప్రజలకు నిరాశే ఎదురైంది. మళ్లీ బతుకమ్మ పండుగ వచ్చినా రోడ్డును పూర్తి చేయలేదు. దీంతో పాలకుల తీరుపట్ల ప్రజలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
జాడలేని కార్పొరేటర్
గత ఎన్నికల్లో 31వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థిగా సోబియా శుభా హాత్ అనూహ్యంగా టికెట్ దక్కించుకుని గెలిచారు. కానీ గెలిచిన అప్పటి నుంచి ఇంతవరకు డివిజన్ వైపు చూడలేదని డివిజన్ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా కార్పొరేటర్ పట్టించుకుని రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తాం
గత సంవత్సరం లోనే పనులు పూర్తి కావాల్సి ఉంది. కాని గుత్తేదారు పనులు మొదలు పెట్టిన తరువాత మధ్య లో ఆపే శాడు.మళ్ళీ తొందరలో పనులు అధికారులతో మాట్లాడిపూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరంగా పనులు పూర్తయ్యేలా చూస్తాం.
- పులి రజిని కాంత్,. టీఆర్ఎస్ 31వ డివిజన్ అధ్యక్షులు
మరో రెండు నెలల్లోగా పనులు పూర్తి చేస్తాం
గత సంవత్సరం సద్దుల బతుకమ్మ ముందు పనులు ప్రారంభోత్సవం చేసిన నిజమే కానీ తర్వాత ప్రజల ఒత్తిడి మేరకు రోడ్డును 100 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు కుదించాం. దానికి తోడు కరోనా వల్ల వర్కర్లు రాకపోవడం వల్ల ఆలస్యం అయింది. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తాం.
-31వ డివిజన్ జీడబ్లూఎంసీ డీఈ రవీందర్