Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
నెల రోజులుగా బిల్ట్ కార్మికుల నివాసాలకు కరెంట్, తాగునీటి సరఫరా చేయకుంటే కార్మికుల కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యమని కార్మిక జేఏసీ నాయకులు అన్నారు. బుదవారం మండలంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బిల్ట్ పరిశ్రమ 2014 ఏప్రిల్ 6న ఉత్పత్తి నిలిపిందని, నాటి నుండి యాజమాన్యం ప్రభుత్వం కంపెనీని నడిపిస్తామంటూ కార్మికులను మభ్యపెడుతూ 6 సంవత్సరాల తర్వాత 2020 జనవరి 17న ఎన్సీఎల్టి కోర్టు పరిధిలోకి వెల్లడంతో విద్యుత్ అధికారులకు 10 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలున్నాయంటూ సరఫరా నిలిపివేసిందన్నారు. అనంతరం కార్మిక జేఏసీ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కెటిఆర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ విద్యుత్ పునరుద్దరించాలంటూ ఎన్పీడీసీఎల్కు లేఖ ఇవ్వడంతో విద్యుత్ పునరుద్దరించారని తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల్లో యాజమాన్యం ఎన్సీఎల్టి కోర్టు విద్యుత్ బకాయిలు చెల్లించకపోగా 2020 సెప్టెంబర్ 22న మళ్లీ విద్యుత్ తొలగించారని జేఏసీ నాయకులు తెలిపారు. నెల రోజులు గడిచినా విద్యుత్ పునరుద్దరించకపోవడంతో చీకట్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను యాజమాన్యం అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ బ్రతుకులు ఆగమ్యగోచరంగా మారాయని మాకు కరెంట్ పునరుద్దరించి నీటిసరఫరా పునరుద్దరించాలని కోరారు. సమావేశంలో వడ్లూరి రాంచందర్, బండారి వెంకటేశ్వర్లు, వంగేటి వెంకట్రెడ్డి, తిరుపతిరెడ్డి, పప్పు వెంకట్రెడ్డి, రవిమూర్తి, కొంరయ్య, కుర్బాన్అలీలు పాల్గొన్నారు.