Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాట్లు వేసి నిరసన వ్యక్తం ప్రజలు
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
మండలంలోని అమ్మాపురం గ్రామం 10వ వార్డులో రోడ్డు సరిగ్గా లేక వర్షం వస్తే, బురదగా మారిపోవటంతో నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బుధవారం రోడ్డు మీద నాట్లు వేసి ప్రజలు నిరసన వ్యక్తం చేసి, అనంతరం పంచాయతీ కార్యదర్శి రబ్బాని బేగంకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు మంజూరై ఆరు నెలలు గడిచినప్పటికీ మట్టి పోయకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షం వస్తే రోడ్లు మొత్తం గుంతలుగా ఏర్పడి, నీరు నిలిచిపోవడంతో దోమలు విజంభిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ ముద్దం విక్రంరెడ్డి, సారయ్య, రాజు, ప్రశాంత్, రమేష్, కిరణ్, సాయి, శ్యామ్, శ్రీకాంత్, కొమురయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.