Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలైన వామపక్షాల అభ్యర్థి జయసారధి రెడ్డిని గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాసరావు కోరారు. బుధ వారం సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వ హించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరు సంవ త్సరాల కాలంలో ఉద్యోగాల నియమకాలు చేయకుండా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలో హక్కుగా ఉన్న ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యునివర్సిటీ స్థాపించడంలో పూర్తిగా విఫల మైందన్నారు. ఉద్యోగులు పీఆర్సీ, సీఆర్పీ రద్దు, పదోన్నతులు తదితర సమస్యలను పరిష్కరించకుండా కాలం వెళ్లతీస్తుందన్నారు. నిరుద్యోగ, పట్టభద్రులందరు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భా టంగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ నెలకొల్పిందిలేదు ఒక్కరికి ఉద్యోగం ఇప్పించిలేదని దుయ్యపట్టారు. పట్టభద్రుల నియోజవర్గంలో వామపక్షాలు బలమైన క్యాడర్ కలిగిన వామపక్ష అభ్యర్థి జయసారథి రెడ్డి గెలుపు ఖాయ మన్నారు. ఈ సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, సీపీఐ నాయకులు అక్కపెల్లి రమేష్, గుంపెల్లి మునీశ్వర్, తోట చంద్రకళ, కందిక చెన్నకేశవులు, గోవర్థన్ మియపురం, వీరగోని శంకర్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొరబోయిన కుమమార స్వామి, కడియాల వీరచారి, హన్మకొండ శ్రీధర్, అనంతగిరి రవి, ఈదునూరి వెంకన్న పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిని గెలిపించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి
ఖిలా వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పదవి పిలుపు నిచ్చారు. బుధవారం శివ నగర్ లోని తమ్మెర భవన్లో సిపిఐ నగర సహాయ కార్యదర్శి రవీందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాటా ్లడారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం, శాసనమండలిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియో జకవర్గంలో వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కషి చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, సింగారపు బాబు, డి హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏలేందెర్, జున్ను రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకను గెలిపించండి
ధర్మసాగర్: ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని సీపీఐ వరంగల్ అర్బన్ జిల్లా సహాయ కార్యదర్శి కర్రే బిక్షపతి అన్నారు. బుధవారం వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు తెలంగాణ అభివద్ధి చేస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వాలు నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రశ్నించే గొంతుకు లేకుండా చేస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాలన్నారు. ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన జయసారధినీ అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కొట్టే ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లేష్ ధర్మసాగర్ మండల కార్యదర్శి మర్రిపల్లి అంకుష్, వేలేర్ మండల కార్యదర్శి బట్టు మల్లయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపల్లి అశోక్, వేలేర్ మండల కార్యదర్శి వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.c