Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుగొండ
ఓంకార్ స్ఫూర్తితో రైతులందరు రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటానికి సిద్ధం కావాలని ఎంసీపీఐ(యూ) రూరల్ జిల్లా కార్యదర్శి గొనె కుమారస్వామి అన్నారు. మండలంలోని మోగిలిచెర్ల, పొగుల నాగయ్యనగర్ గ్రామాలలో కామ్రేడ్ ఓంకార్ 12 వర్ధంతిని పురస్కరించుకొని ఓంకార్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ ప్రజల సమస్యల పరిష్కారనికే జీవితాంతం ఆయాణచేసిన కషి వర్ణించలేనిదన్నారు, మద్దికాయల ఓంకార్ సాయుధపోరాటంలో తుపాకీ చేతపట్టి రజాకార్లపై పోరాటం చేసి పెదప్రజలకు వేళ ఎకరాలు పంచిపెట్టారన్నారు. కార్యక్రమంలో జట్టి రాజు,కొడపాక సురేష్,మెట్టుపల్లి సుమన్,మంద భారతి, కొమ్ములు వనమ్మ, సాంబమూర్తి, స్వప్న, అనిల్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
సంగెం: వామపక్షాల ఐక్యత కోసం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఎనలేని కషి చేశారని ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి ఎండీ. ఇస్మాయిల్ అన్నారు. మండలంలోని ఎల్గూర్ రంగంపేటలో మద్దికాయల ఓంకార్ 12 వ వర్ధంతి సభను కామ్రేడ్ ఎల్లగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం,సామాజిక న్యాయంకోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటం చేసి ప్రజలపక్షాన నిలబడ్డారని కొనియాడారు. దిండి దామోదర్,గోనే రామ చందర్, సాంబయ్య, రాగిణి రవి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.