Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశ్నించే గొంతును టీఆర్ఎస్ పార్టీ నాయకులు నొక్కుతున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మురుకుట్ల నరేందర్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ సమావేశం కర్రి నాగేంద్రబాబు అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నరేందర్ మాట్లాడుతూ నిజాన్ని నిజాయితీగా ప్రశ్నించే కాంగ్రెస్ సీనియర్ నాయకులపైన అధికార పార్టికి చెందిన కొందరు నాయకులు పరోక్షంగా పనికి మాలిన పదజాలముతో మాట్లాడుతున్నరని ఆరోపించారు. తెలంగాణా ఇచ్చిన ఘనత కాంగ్రేస్ పార్టిదదేనని, తెలంగాణా ప్రజానీకం సోనియాగాందీకి రుణపడి వుంటారని సీఎం కేసీఆర్ అన్న మాటలు నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు బయటకు రాని టీఆర్ఎస్ నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించే కాంగ్రెస్ నాయకులను దూషించడం దురదష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో కట్ల శివరాజు, గోమాసు లక్ష్మీనారాయణ, కోదండరామ్, సునీల్, మెయు నుద్దిన్, నాగేంద్రబాబు, ముకుందం, శ్రీనివాస్ పాల్గొన్నారు.