Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ రమాదేవి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాదాబైనామాను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ రమాదేవి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జూన్ 2, 2014 కంటే ముందు సాదాబై నామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు రెగ్యూలరైజ్ చేసుకొనుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నిర్దిష్ట నమూనాలో మీ సేవలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు చివరి అక్టోబర్ 30 అని తెలిపారు. సాదా బైనామా కోసం ప్రభుత్వం ఇచ్చిన చివరి అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ చీమన్ నాయక్, రెవెన్యూ అధికారులు నరహరి, బాబురావు, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.