Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం జిల్లాలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మెన్ బిందు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ చైర్మెన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత మున్సిపల్ పరిధి ఏరియా ఆస్పత్రిలో రెండు అంబు లెన్సుల్ని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో రూ.68 లక్షలతో నిర్మించనున్న కోవిడ్ బ్లాక్కు శంకుస్థాపన చేశారు. అనంతరం సిగల్ కాలనీలో రూ.కోటతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అంచలంచలుగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సమీకృత మోడల్ మార్కెట్ నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల ఆస్తుల భద్రతకు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నిరు పేదలకు ఇబ్బందులు కల్గకుండా ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించా మన్నారు. కోవిడ్ నియంత్రణకు కృషి చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, మునిసిపాలిటీ, పోలిస్, పంచాయతీ తది తర శాఖల సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో కొనసాగుతూ కోవిడ్ కట్టడికి కృషి చేయాలన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని అధైర్యం చెందరాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి శ్రీరామ్ డి.సి.హెచ్.ఎస్. భీమ్ సాగర్, ఆర్డీఓ కోమరయ్య, డాక్టర్స్ సతీష్, సూర్యకుమారి , ఆర్ అండ్ బి ఈఈ కాంతేశ్వర్ రావు, డిఈ. రాజేందర్ ,వార్డ్ కౌన్సిలర్లు గంగాధర్, స్వాతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.