Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
- ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలి
- నవంబర్ 4న సీఎం పర్యటన
- జిల్లా స్థాయి అధికారుల సమీక్ష
- సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పాలకుర్తి
పల్లె ప్రగతి పనులతోపాటు నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి జిల్లాస్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మంత్రి మాట్లాడారు. రైతు వేదికలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం, పల్లె ప్రగతి పనుల్లో ప్రారంభానికి నవంబర్ 4న సీఎం కేసీఆర్ నియోజకవర్గం లోని కొడకండ్ల మండలానికి విచ్చేస్తున్నట్టు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు వేదికలతోపాటు పల్లె ప్రగతిలో చేపట్టిన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు, తడి చెత్త పొడి చెత్త సేకరణ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు వంద శాతం పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడాలని కాంట్రాక్టర్లు, అధికారుల్ని ఆదేశిం చారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులు, సొసైటీలు, ఐకేపీలకు ఉందన్నారు. తేమ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు రైతులకు పలు సూచనలిచ్చారు. ధాన్యం కొనుగోలుపై అధికారులు సమన్వయం తో పని చేయాలని ఆదేశించారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బీ రోడ్తోపాటు పంచాయతీరాజ్ రోడ్లు, లింక్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సుమారు రూ.50 కోట్లతో మంజూరైన పీఎంజీఎస్వై రోడ్ల పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుపుకునే వారు వారి వాడల్లోనే పరిమితంగా ఆడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ గూడూరు రామ్రెడ్డి, ఆర్డిఓ మధుమోహన్, డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, పాలకుర్తి, కొడకండ్ల జెడ్పీటీసీలు పూస్కూరి శ్రీనివాస రావు. సత్తమ్మ. జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ మదర్, జీసీసీ మాజీ చైర్మెన్ ధరావత్ మోహన్ గాంధీనాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలునాయక్, పాలకుర్తి, తొర్రూరు సొసైటీ చైర్మెన్లు బొబ్బల అశోక్ రెడ్డి, గోనె మైసులు పాల్గొన్నారుజ
రైతు వేదికలు, ప్రకృతి వనాల పనులను మంత్రి పరిశీలన
కొడకండ్ల : నవంబర్ 4న కొడకండ్ల మండల కేంద్రానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా మండల కేంద్రంలో జరుగుతున్న రైతు వేదికలు, ప్రకృతివనాల పనులను జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా పరిశీలించి వారు మాట్లాడారు. సంబంధిత పనులకు సీఎం ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. రెండుమూడు రోజుల్లో పనుల్ని వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం సీఎం కేసీఆర్ రాక సందర్భంగా కొడకండ్ల మండల కేంద్రంలో హెలిపాడ్ ఆగే ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ సత్యమ్మ, ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీ యాకయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు.