Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ ఎన్ కోటిరెడ్డి
- పోలీసుల జీవితాలు దేశ సేవకు అంకితం : ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్జి పాటిల్
- పోలిస్ అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం : వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-మహబూబాబాద్
పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్గ్రౌండ్ ఆవరణలో ఎస్పీ ఆధ్వర్యంలో అమరువీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వీపీ గౌతమ్ హాజరై పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తున్న పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు. సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, శాంతిభద్రతల విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ పోలీసులు వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్డేగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమరులైన పోలీసుల జీవితాలను ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు సిద్దం కావాలన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడే క్రమంలో ఎంతో మంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకుంటు పోలీసు స్టేషన్లలో ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమము, వ్యాసరచన పోటీలు, పేంటింగ్, రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
ములుగు : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఎస్సీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పోలీస్ అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోలీసులు పని చేస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ అత్యుత్తమంగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందంజలో ఉందని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాను, జిల్లాలో సంభవించిన వరదలను పోలీస్ శాఖ సమర్థంగా ఎదుర్కొందన్నారు. 1959 అక్టోబర్ 21న లడక్ ఈశాన్య ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పది మంది సీఆర్పీఎఫ్ పోలీసులు చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడుల్లో వీరమరణం పొందారని, వారి గుర్తుగా ప్రతితీ సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామన్నారు. అనంతరం అమరుల స్థూపానికి పుష్పగుచ్చం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అసువులు బాసిన 264 అమరుల పేర్లను ఏఆర్ అడిషనల్ ఎస్పీ చదివి వినిపించారు. అనంతరం అమరుల కుటుంబాలతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కషి చేస్తాననిహామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నందు 264 మంది పేర్ల మీద వారికి గుర్తుగా 264 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) సీహచ్ కుమారస్వామి, ఏఎస్పీ సాయి చైతన్య, ఇన్స్పెక్టర్ ఎస్కే రెహమాన్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ధన్సాయి లక్ష్మే , సీఐ దేవేందర్రెడ్డి, సీసీఎస్ సీఐ సంజీవ రావు, ఆర్ఐ స్వామి , సురేందర్, సబ్ఇన్స్పెక్టర్లు, ఆర్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల ఆశయ సాధన కోసం పాటుపడాలి
లింగాలఘనపురం : వీధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎస్సై దేవేందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసు వారికి ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క ఒక్కరూ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఏఎస్సై కుమారస్వామి, డా. కరుణాకర్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
నర్మెట్ట : పోలీసు అమరవీరుల సంస్కరణ దినం సందర్బంగా మండలంలోని పోలీస్స్టేషన్ నుంచి చౌరస్తా వరకు శ్యాంతి ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోశ్, ఎసై జక్కుల పరమేశ్వర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమెడపు కమలాకర్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధ్న్, జెడ్పీటీసీ శ్రీనివాస్,ఎంపీటీసీ మురళీ,పాల్గొన్నారు.
వరంగల్ : పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూనే వారి స్పూర్తిగా విధుల్లో రాణిస్తూ ప్రజలకు సేవలందించాలని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం పోలిస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వ హణలో మరణించిన 326 మంది పోలీస్ అమరవీరుల పేర్లను సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా చదివి వినిపించారు. అనంతరం ఆర్ఐ శ్రీనివాస్ =రావు సారధ్యంలో సాయుధ పోలీసుల 'శోక్ శ్రస్త్' చేసి మరణించిన పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగతి కళాబందం సభ్యులు పాల్గొన్నారు.
ఆన్లైన్ ఓపెన్ హౌస్ ప్రారంభించిన డి.సి.పి
వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఓపెన్ హౌస్ వెస్ట్ జోన్ అధికారులతో కల్సి వెస్ట్జోన్ డీసీపీ ప్రారంభించారు. ఆయుధ ప్రదర్శనతోపాటు, బాంబ్ డిస్పోజల్ విభాగం, కమ్యూనికేషన్ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదనపు డీసీపీలు గిరిరాజు, భీంరావు ట్రైనీ ఐపిఎస్ సుధీ పాల్గొన్నారు.