Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్
నవతెలంగాణ-నయీంనగర్
తూనికలు, కొలతల్లో మోసం జరిగిలే ఫిర్యాదు చేయాలని లీగ్ మెట్రాలజి ఖమ్మం, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. ఓరుగల్లు వినియో గదారుల రక్షణ సమితి విద్యారణ్యపురి గోపాలపురం ఆధ్వ ర్యంలో తూనికలు, కొలతల శాఖ సహకారంతో తూనికల్లో, కొలతల్లో జరుగుతున్న మోసాలపై గోపాలపురంలో చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ వేదికకు సంస్థ అధ్యక్షులు నాగులగాం నర్సయ్య అధ్యక్షత వహించగా ముఖ్గ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ వివిధ పద్దతుల్లో తూకంలో మోసం చేస్తారని దీనిని వినియోగ దారులు గమనించాలని తెలిపారు. వినియోగదారులు తమకు ఏవిధమైన మోసం జరిగినా తగిన రాశీదుతో తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. తమ సంస్థద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, మోసం జరిగినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసు కుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ సిరంగి సునీల్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు శ్రీఉమర్ పాషా, ప్రభాకర్ రెడ్డి టి దశరథం, ఆర్ వెంకటేష్, కే. రాజేందర్, కే ఉపేంద్ర చారి, సీతా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.