Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి
- ఏఐకేఎస్సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్
నవతెలంగాణ-నయీంనగర్
రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఉదతంగా సాగుతున్న దేశవ్యాప్త ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చర్చల పేరుతో మోడీ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఏఐకేఎస్సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి, రాచర్ల బాలరాజు సోమిడి శ్రీనివాస్ వీర గోని శంకరయ్య, మొగిలి ప్రతాప రెడ్డి ఆరోపించారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఉమ్మడి జిల్లా సమా వేశం సారంపల్లి వాసుదేవ రెడ్డి అధ్యక్షతన బాల సముద్రంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ 55 రోజులుగా లక్షలాది మంది రైతులు నిరాటంకంగా ఉద్యమాలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని రైతుల సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. తక్షణమే దేశ ప్రయోజనాలను రైతుల శ్రమను తాకట్టు పెడితే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. రైతు ఉద్యమాన్ని మరింత ఉధతం పరిచేందుకు శాయశక్తుల కషి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 23న వరంగల్ అర్బన్, రూరల్ అన్ని మండలాల్లో వంటావార్పులతో నిరసన, 24న వరంగల్ లో కార్మిక కర్షక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, 26న నియోజకవర్గ కేంద్రాల్లో, వరంగల్లో ఎడ్లబండ్లు ట్రాక్టర్లు బైకులతో ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో రైతులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు