Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్తా,చెదారం తోపాటు వివిధ రకాల వ్యర్థాలను అరేవాగు, రోడ్డు ప్రక్కనే పోస్తున్నారు. దీంతో దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా, చెదారం తోపాటు పలు వ్యర్థాలను వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టిన డంపింగ్ యార్డులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రధాన రహదారుల ప్రక్కన, వాగులు, కాల్వలు, అటవీ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలను పోయడంతో ఆహ్లాద కరమైన వాతావరణం కలుషితమవుతుందని పలువురు ఆరోపి స్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిన గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదని ఫలితంగా రహదారుల వెంట ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.